Telangana

News May 4, 2024

మల్కాజిగిరి: కీలకంగా మారనున్న పురుష ఓటర్లు!

image

దేశంలోని అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గమైన మల్కాజిగిరిలో అభ్యర్థుల గెలుపోటములకు పురుషుల ఓట్లే కీలకం కానున్నాయి. మల్కాజిగిరి లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో మొత్తం 37,79,596 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 19,45,624 కాగా.. మహిళా ఓటర్లు 18,33,430 మంది ఉన్నారు. నియోజకవర్గంలో మహిళా ఓట్ల కంటే పురుషుల ఓట్లు 1,12,194 అధికంగా ఉన్నాయి.

News May 4, 2024

HYD: బర్త్‌డే కేక్‌ కోసం వెళ్లి బాలుడి మృతి

image

బర్త్‌డే సందర్భంగా కేక్ తెచ్చుకోవడానికి వెళ్లి రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి చెందిన ఘటన HYD షాద్‌నగర్‌లో జరిగింది. పోలీసుల వివరాలు.. రతన్‌ కాలనీకి చెందిన బిజ్వి సందీప్‌ (16) బర్త్‌డే సందర్భంగా స్నేహితులతో కలిసి కేక్‌ కట్‌ చేయాలని గురువారం రాత్రి బయటికి వెళ్లాడు. కేశంపేట బైపాస్‌ చౌరస్తాలో రోడ్డు దాటుతుండగా జడ్చర్ల వైపు వెళ్తున్న వాహనం అతడిని ఢీకొంది. దీంతో సందీప్ అక్కడికక్కడే మృతి చెందాడు.

News May 4, 2024

ఖమ్మం: డిగ్రీ పరీక్షలు వాయిదా ప్రచారం.. అధికారుల క్లారిటీ

image

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు ఈనెల 6 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ఓ ప్రెస్ నోట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. స్పందించిన కేయూ అధికారులు అది ఫేక్ అని నిర్ధారించారు. పరీక్షలు యథావిధిగా ఈనెల 6 నుంచి ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.

News May 4, 2024

HYD: బర్త్‌డే కేక్‌ కోసం వెళ్లి బాలుడి మృతి

image

బర్త్‌డే సందర్భంగా కేక్ తెచ్చుకోవడానికి వెళ్లి రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి చెందిన ఘటన HYD షాద్‌నగర్‌లో జరిగింది. పోలీసుల వివరాలు.. రతన్‌ కాలనీకి చెందిన బిజ్వి సందీప్‌ (16) బర్త్‌డే సందర్భంగా స్నేహితులతో కలిసి కేక్‌ కట్‌ చేయాలని గురువారం రాత్రి బయటికి వెళ్లాడు. కేశంపేట బైపాస్‌ చౌరస్తాలో రోడ్డు దాటుతుండగా జడ్చర్ల వైపు వెళ్తున్న వాహనం అతడిని ఢీకొంది. దీంతో సందీప్ అక్కడికక్కడే మృతి చెందాడు.

News May 4, 2024

వడదెబ్బతో వెల్గటూర్ ఎంఈఓ మృతి

image

జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల విద్యాధికారి బత్తుల భూమన్న మృతి చెందారు. వడదెబ్బతో శనివారం ఉదయం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఎంఈఓ మృతి పట్ల మండల ప్రజా ప్రతినిధులు, అధికారులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

News May 4, 2024

నిజామాబాద్: ఎంపీ అర్వింద్‌పై చార్జిషీట్

image

TPCC ఎన్నారై సెల్, గల్ఫ్ కార్మికుల ఆధ్వర్యంలో MP అర్వింద్‌పై చార్జిషీట్ విడుదల చేశారు. డిచ్‌పల్లి(M)లోని ఓ గార్డెన్స్‌లో కాంగ్రెస్ నాయకులు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. గల్ఫ్ దేశాలలో భారతీయులకు ఇస్తున్న వేతనాలను, BJP 30-50 శాతం వరకు తగ్గిస్తూ సర్క్యూలర్లను జారీ చేసి కార్మకులు పొట్ట కొట్టిందన్నారు. మోదీ ప్రభుత్వం ఆన్‌లైన్ ఓటింగ్ వ్యవస్థను ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు.

News May 4, 2024

ADB: ఆద‌ర్శంగా నిలుస్తున్న ఆ ఎమ్మెల్యే

image

సర్కారు దవాఖానకు నేను రాను అనేది ఒకప్పటి మాట.. కానీ ఇప్పుడు సర్కారీ దవాఖానలలో పేదలకు నాణ్యమైన వైద్యం అందిస్తాయని, ప్రభుత్వ ఆస్పత్రిపై ప్రజలకు నమ్మకం కలిగే విధంగా MLA వెడ్మ బొజ్జు ప్రయత్నాలు చేస్తున్నారు. తనకు జబ్బు చేస్తే స్వయంగా ప్రభుత్వ ద‌వ‌ఖానాకు వెళ్లి వైద్యం చేయించుకుంటున్నారు. తాజాగా తన తండ్రి భీంరావు ద‌వ‌డ‌కు క్యాన్స‌ర్ కావ‌డంతో ఆయన ఆదిలాబాద్ రిమ్స్ లో చేర్పించి శ‌స్త్ర చికిత్స చేయించారు

News May 4, 2024

పెబ్బేరు: భార్యాభర్తల మధ్య గొడవ.. భర్త సూసైడ్

image

భార్యాభర్తలు గొడవపడి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. SI వెంకటేశ్వర్లు వివరాలు.. గోపాల్‌పేట మండలం ఏదుట్లకి చెందిన తిరుమలయ్య (42), రేణుకతో 20 ఏళ్ల క్రితం పెళ్లయింది. వీరు HYDలో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఏడాది పాటుగా ఇద్దరి మధ్య గొడవలతో దూరంగా ఉంటున్నారు. పలుమార్లు పెద్దలు కలిపినా మళ్లీ గొడవ పడ్డారు. భర్త మనస్తాపంతో నిన్న ఉరేసుకుని మృతి చెందాడని, కేసు నమోదైనట్లు ఎస్సై తెలిపారు.

News May 4, 2024

రూ.181 కోట్ల మద్యం విక్రయాలు

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో డిమాండ్‌కు తగ్గట్లుగా బీర్ల నిల్వలు లేవు. ఉభయ జిల్లాల్లో 210 మద్యం దుకాణాలు, 50 బార్లు, మూడు క్లబ్స్ ఉన్నాయి. అయితే గతేడాది మే మొదటి, రెండు వారాల్లో 48 వేల లిక్కర్ కేసులు, లక్ష బీర్ల కేసులను దుకాణాలకు విక్రయించారు. వీటి విలువ రూ.50 కోట్లు. ఈసారి బీర్లకు డిమాండ్ అమాంతం పెరగటంతో ఎమ్మార్పీకి మించి అధిక ధరలకు అమ్ముతున్నారు. ఏప్రిల్లో రూ.181 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి.

News May 4, 2024

ఉమ్మడి వరంగల్ నుంచి 29 మంది మావోయిస్టులు

image

ఉమ్మడి WGL జిల్లా నుంచి పీపుల్స్‌వార్ ఉద్యమంలో చేరి కీలక పదవులను చేపట్టిన మావోయిస్టులు క్రమంగా పట్టును కోల్పోతున్నారు. WGL కమిషనరేట్ పరిధిలోని 70 మంది మావోయిస్టుల్లో 31 మంది లొంగిపోయారు. మిగతా 20 మంది ఎన్కౌంటర్లు, అనారోగ్యంతో మరణించారు. 19 మంది ప్రస్తుతం పలు హోదాల్లో ఉన్నారు. BHPL, ములుగు జిల్లాకు చెందిన వారు ఐదుగురు చొప్పున ఉన్నారు. అంటే ఉమ్మడి జిల్లా నుంచి 29 మంది మావోయిస్టు పార్టీలో ఉన్నారు.