Telangana

News September 12, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈరోజు ముఖ్య అంశాలు

image

✓ భద్రాచలం వద్ద గోదావరి రెండో ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ ✓ తాలిపేరు ప్రాజెక్టు కొనసాగుతున్న వరద ✓ అశ్వారావుపేటలో బీభత్సం సృష్టించిన దొంగలు ✓ అధికారులు సమన్వయంతో పనిచేయాలి: మంత్రి తుమ్మల ✓ ఖమ్మం: నిమర్జన ఏర్పాటును పరిశీలించిన సీపీ సునీల్ దత్ ✓ కూసుమంచిలో కేంద్ర బృందం పర్యటన ✓ ప్రతి పేదవాడికి కార్పొరేట్ విద్య: డిప్యూటీ సీఎం ✓ కారేపల్లి: సీఎం సహాయనిధి చెక్కు అందించిన మంత్రి పొంగులేటి

News September 12, 2024

PDSU 50ఏళ్ల స్వర్ణోత్సవ సభ లోగో, పోస్టర్ ఆవిష్కరణ

image

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఈనెల 24న నిర్వహించే PDSU 50ఏళ్ల లోగో, స్వర్ణోత్సవ సభ పోస్టర్ ను PDSU మాజీ నేతలు బి.రాము, కాలేశ్వర్ ఆవిష్కరించారు. 1974లో PDSU ఏర్పడిన నాటి నుంచి 2024 వరకు మొక్కవోని దీక్షతో, విద్యారంగ సమస్యల పరిష్కారానికై తన వంతు కృషి చేసిందని వారు తెలిపారు. ఈ సమావేశంలో కాలేశ్వర్, దేవేందర్, అరుణ్, అంబదాస్, సాంబశివుడు, సాయి, మారుతి, సీతారాం, అజయ్, హరీష్ తదితరులు పాల్గొన్నారు.

News September 11, 2024

KMM: పత్తి కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై మంత్రి సమీక్ష

image

పత్తి కొనుగోలు కేంద్రాల ఏర్పాటు తీసుకోవలసిన చర్యలపై అధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమావేశం నిర్వహించారు. పత్తి కొనుగోలు కేంద్రాలు, జిన్నింగ్ మిల్లులను సీజన్ ప్రారంభానికి ముందే సిద్ధం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. రైతులకు కనిష్ట మద్దతు ధర, పత్తి సేకరణ మార్గదర్శకాల గురించి ప్రచార మాధ్యమాల ద్వారా ప్రచారం చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాలు వారానికి 6 రోజులు పనిచేయాలని సూచించారు.

News September 11, 2024

ఎన్ఎంఎంఎస్ దరఖాస్తు గడువు ఈనెల 25 వరకు పెంపు

image

జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్తు, ఎయిడెడ్, ఆదర్శ పాఠశాలలో ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు నేషనల్ మెన్స్ కం మెరిట్ స్కాలర్షిప్‌లో పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఈ నెల 25 వరకు ప్రభుత్వం పొడిగించిందని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. జిల్లాలోని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఇతర వివరాల కోసం జిల్లా విద్యాధికారి కార్యాలయంలో సంప్రదించాలన్నారు.

News September 11, 2024

చెరువులు, కుంటలు ఆక్రమణ జరగకుండా చూడాలి: కలెక్టర్

image

సంగారెడ్డి జిల్లాలో చెరువులు, కుంటలు ఆక్రమణ జరగకుండా చూడాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ హెచ్ఎండిఏ వెబ్ సైట్లో 8 మండలాలకు సంబంధించిన మ్యాపింగ్ ఉంచాలని చెప్పారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో ఇంటి నిర్మాణాలకు అనుమతులు ఇవ్వవద్దని సూచించారు. సమావేశంలో అధికారులు పాల్గొన్నారు.

News September 11, 2024

HYD: ‘హైడ్రా ప్రణాళిక సిద్ధం చేసేందుకు కసరత్తు’

image

HYDలో హైడ్రా ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసేందుకు కసరత్తు చేస్తుంది. ఇందులో భాగంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్, లేటెస్ట్ హిస్టారికల్ సాటిలైట్ డేటాపై చర్చలు జరిపారు. ఏరియల్ సర్వీస్, డిజిటల్ మ్యాపింగ్ హైడ్రాకు ఖచ్చితమైన విశ్లేషణ, ప్రణాళిక చేసేందుకు అవసరమని తెలిపారు. వాతావరణాన్ని అంచనా వేయడం, నీటి వనరులు, డిజాస్టర్ మేనేజ్మెంట్ లాంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు కమిషనర్ పేర్కొన్నారు.

News September 11, 2024

NLG: అక్రమ రిజిస్ట్రేషన్లు రద్దు.!

image

NLGలో 8 మంది జర్నలిస్టులు జీవో నెంబర్ 59లోని లొసుగులను ఆసరా చేసుకొని ఇరిగేషన్ శాఖకు చెందిన కోట్ల విలువ చేసే భూమిని గతేడాది అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ అక్రమ రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలని కోరుతూ జర్నలిస్టులు అప్పటి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. స్పందించిన కలెక్టర్ జరిగిన అక్రమాలపై పూర్తిస్థాయిలో విచారణ చేయించారు. ఈ అక్రమ రిజిస్ట్రేషన్లను రద్దు చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.

News September 11, 2024

సంగారెడ్డి: కేజీబీవీ ఉద్యోగుల మెరిట్ జాబితా విడుదల

image

2023-24 సంవత్సరం కేజీబీవీ అభ్యర్థుల 1:3 మెరిట్ జాబితాను www.deosangareddy.in వెబ్ సైట్ లో ఉంచినట్లు డీఈవో వెంకటేశ్వర్లు బుధవారం తెలిపారు. జాబితాలో పేర్లు ఉన్నవారు 13వ తేదీన కలెక్టరేట్లోని సమగ్ర శిక్ష కార్యాలయంలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరు కావాలని చెప్పారు. ఆ తర్వాత 1:1 మెరిట్ జాబితాను విడుదల చేస్తామని పేర్కొన్నారు. అభ్యంతరాలు ఉంటే 18వ తేదీలోపు సమగ్ర శిక్ష కార్యాలయంలో సమర్పించాలన్నారు.

News September 11, 2024

అడవుల్లో ప్రకృతి ప్రకోపం అత్యంత బాధాకరం: కేటీఆర్

image

అడవుల్లో ప్రకృతి ప్రకోపం అత్యంత బాధాకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. మానవ తప్పిదాల వల్ల పర్యావరణంలో ఇలా ఎన్నడూ లేని మార్పులు ఏర్పడుతున్నాయని, పర్యావరణాన్ని రక్షిస్తూ.. ఇలాంటి ప్రకృతి విపత్తుల నుంచి బయటపడాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం వెంటనే ములుగు జిల్లా అటవీ ప్రాంతాన్ని భారీ చెట్ల పెంపకంతో సంరక్షించాలని కేటీఆర్ కోరారు.

News September 11, 2024

NLG: భౌమాకోన్ ఎక్స్ పో ఇండియాకు రావాలని మంత్రి కోమటిరెడ్డికి ఆహ్వానం

image

అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఎక్విప్ మెంట్ మ్యాన్ ఫ్యాక్చరర్స్‌తో కలిసి ‘మెస్సె ముంచన్ ఇండియా’ సంస్థ డిసెంబర్ 11 నుంచి 14 వరకు గ్రేటర్ నోయిడాలో నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక ‘భౌమాకోన్ ఎక్స్ పో ఇండియా’కు ముఖ్యఅతిథిగా హాజరుకావాలని నిర్వాహకులు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఆహ్వానం అందించారు. ప్రతీయేటా నిర్మాణ రంగంలో వస్తున్న అధునాతన పరికరాలు, టెక్నాలజీలను ఈ ఎక్స్ పోలో ప్రదర్శిస్తారు.