Telangana

News May 3, 2024

BREAKING: HYD: MLA మల్లారెడ్డి ర్యాలీలో అపశ్రుతి

image

HYD బోడుప్పల్‌లో మాజీ మంత్రి, మేడ్చల్ MLA చామకూర మల్లారెడ్డి పాల్గొన్న బైక్ ర్యాలీలో ఈరోజు అపశ్రుతి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. బోడుప్పల్‌కి చెందిన BRS యువ నేత శ్రవణ్(24) మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి మద్దతుగా ర్యాలీలో పాల్గొన్నాడు. ఈ క్రమంలో డీజే ఉన్న డీసీఎం చక్రాల కింద ప్రమాదవశాత్తు అతడు పడి మృతిచెందాడు. ఉప్పల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

News May 3, 2024

BREAKING: HYD: MLA మల్లారెడ్డి ర్యాలీలో అపశ్రుతి

image

HYD బోడుప్పల్‌లో మాజీ మంత్రి, మేడ్చల్ MLA చామకూర మల్లారెడ్డి పాల్గొన్న బైక్ ర్యాలీలో ఈరోజు అపశ్రుతి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. బోడుప్పల్‌కి చెందిన BRS యువ నేత శ్రవణ్(24) మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి మద్దతుగా ర్యాలీలో పాల్గొన్నాడు. ఈ క్రమంలో డీజే ఉన్న డీసీఎం చక్రాల కింద ప్రమాదవశాత్తు అతడు పడి మృతిచెందాడు. ఉప్పల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

News May 3, 2024

MBNR: మీ అభ్యర్థి వివరాలు తెలుసుకోండి ఇలా!

image

లోక్ సభ నియోజకవర్గంలో ఎంత మంది అభ్యర్థులు బరిలో నిలిచారన్నది చాలామందికి తెలియదు. ఎవరెవరు పోటీ చేస్తున్నారో కేవైసీ(నో యువర్ క్యాండిడేట్) యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. దీని ద్వారా పోటీ చేసే అభ్యర్థి విద్యార్హతలు, వారికి నేర చరిత్ర ఉందా, ఎక్కడెక్కడ ఎంత మేర ఆస్తులు ఉన్నాయి. స్థిర, చర ఆస్తులు, ఇతర వివరాలన్నీ ఇందులో ఉంటాయి. దీన్ని బట్టి ఎవరికి ఓటేయాలో నిర్ణయించుకునే అవకాశం ఉంటుంది.

News May 3, 2024

KMR: నీటి తొట్టెలో పడి చిన్నారి మృతి

image

కామారెడ్డి జిల్లాలో విషాదం జరిగింది. నీటి తొట్టెలో పడి రెండేళ్ల చిన్నారి మృతి చెందింది. మహమ్మద్ నగర్ మండలం గాలిపూర్‌కు చెందిన వడ్డే సాయిబాబా, గాయత్రీల కుమార్తె సావిత్రి శుక్రవారం మధ్యాహ్నం ఇంటి ఆవరణలో ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు నీటి తొట్టెలో పడిపోయింది. ఎంతసేపటికి కనిపించకపోవడంతో నీటి తొట్టెలో చిన్నారి ఉండటాన్ని గమనించి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

News May 3, 2024

NZB: రణక్షేత్రంలా లోక్ సభ ఎన్నికల ప్రచారం

image

ఉమ్మడి జిల్లాలో లోక్ సభ ఎన్నికల ప్రచారం రణక్షేత్రంలా సాగుతోంది. అభ్యర్థులతో పాటు ఆయా పార్టీల అగ్రనేతలు, కార్యకర్తలు ప్రచార జోరును పెంచారు. జిల్లా, మండల, గ్రామస్థాయి నాయకులు ఇంటింటి ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. పార్టీల కరపత్రాలు, గుర్తులతో రూపొందించిన ఫ్లకార్డులను చేతబూని తమ అభ్యర్థికి ఓటేయమని అభ్యర్థిస్తున్నారు. ఇక సభలు, సమావేశాలు, రోడ్ షోలతో ఓటర్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు.

News May 3, 2024

ADB: ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

image

ఆర్థిక ఇబ్బందులతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కుంటాల మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై రజనీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని లింబా (బి) గ్రామానికి చెందిన గంగుల యోగేష్ (22) ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. నిన్న రాత్రి సమయంలో ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారు. మృతుడి తండ్రి నారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

News May 3, 2024

బీర్కూర్: గుండెపోటుతో ఐకెపి VAO మృతి

image

కామారెడ్డి జిల్లా కిష్టాపూర్ గ్రామానికి చెందిన విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్‌గా ఐకెపిలో విధులు నిర్వహిస్తున్న చాకలి బోయిన అంజయ్య (38) శుక్రవారం గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అంజయ్యకు కూతురు, కుమారుడు ఉన్నారు. అంజయ్య మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు.

News May 3, 2024

శంషాబాద్‌లో 34 కేజీల బంగారం స్వాధీనం

image

HYD శంషాబాద్‌ విమానాశ్రయం సమీపంలో పోలీసులు భారీగా బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ కారులో 34 కిలోల బంగారం, 40 కిలోల వెండి ఆభరణాలు పట్టుబడ్డాయి. సరైన పత్రాలు లేకపోవడంతో వాటిని స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ఆభరణాలను ముంబయి నుంచి హైదరాబాద్‌ తీసుకొస్తున్నట్టు గుర్తించారు.

News May 3, 2024

శంషాబాద్‌లో 34 కేజీల బంగారం స్వాధీనం

image

HYD శంషాబాద్‌ విమానాశ్రయం సమీపంలో పోలీసులు భారీగా బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ కారులో 34 కిలోల బంగారం, 40 కిలోల వెండి ఆభరణాలు పట్టుబడ్డాయి. సరైన పత్రాలు లేకపోవడంతో వాటిని స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ఆభరణాలను ముంబయి నుంచి హైదరాబాద్‌ తీసుకొస్తున్నట్టు గుర్తించారు.

News May 3, 2024

సిద్దిపేట: పెళ్లిరోజు విషాదం.. రోడ్డు ప్రమాదంలో మృతి

image

జగదేవ్పూర్ మండలం తీగుల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కందుకూరి వెంకటేశం(45) పెళ్లిరోజు మృతి చెందాడు. తీగుల్‌కు చెందిన వెంకటేశం పెళ్లిరోజు కావడంతో భార్య, పిల్లలతో ఆలయంలో పూజలు చేశారు. అనంతరం అతను పనిచేసే ప్రజ్ఞాపూర్ రెస్టారెంట్‌కు ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. ఈ క్రమంలో గ్రామ శివారులో ఎదురుగా వచ్చిన బైక్ ఢీకొనడంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడ్డ మరో వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు.