Telangana

News May 3, 2024

HYD: హోటల్ యజమాని హత్య

image

HYD గచ్చిబౌలిలో ఓ హోటల్ యజమాని ఈరోజు దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. స్థానిక అంజయ్య నగర్‌లో శ్రీనివాస్ (54) అనే వ్యక్తి హోటల్ నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో దారి విషయంలో ఏడాది క్రితం హోటల్ పక్కన నివసించే వ్యక్తితో అతడికి గొడవ జరిగింది. కక్ష కట్టిన సదరు వ్యక్తి ఇనుప రాడ్డుతో దాడి చేయడంతో శ్రీనివాస్‌ మృతిచెందాడు. మృతుడి కుమారుడు కేశవ్ ఫిర్యాదుతో రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు.

News May 3, 2024

HYD: హోటల్ యజమాని హత్య

image

HYD గచ్చిబౌలిలో ఓ హోటల్ యజమాని ఈరోజు దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. స్థానిక అంజయ్య నగర్‌లో శ్రీనివాస్ (54) అనే వ్యక్తి హోటల్ నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో దారి విషయంలో ఏడాది క్రితం హోటల్ పక్కన నివసించే వ్యక్తితో అతడికి గొడవ జరిగింది. కక్ష కట్టిన సదరు వ్యక్తి ఇనుప రాడ్డుతో దాడి చేయడంతో శ్రీనివాస్‌ మృతిచెందాడు. మృతుడి కుమారుడు కేశవ్ ఫిర్యాదుతో రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు.

News May 3, 2024

భగ్గుమన్న పాలమూరు.. నాగర్‌కర్నూల్ జిల్లాలో 46 డిగ్రీలు

image

ఉమ్మడి జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. ఎండ తీవ్రతతో జిల్లా ప్రజలు అల్లాడిపోతున్నారు. వడగాలులతో ఉక్కిరి బిక్కిరవుతున్నారు. నేడు నాగర్‌కర్నూల్ జిల్లాలో 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా.. గద్వాలలో 45.7, నారాయణపేట 45.2, మహబూబ్‌నగర్‌లో 45.1, వనపర్తిలో 44.8 డిగ్రీలు రికార్డు అయింది. వచ్చే 3రోజులు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని.. మ‌ధ్యాహ్నం సమయంలో బ‌య‌ట‌కు రాకపోవడమే మంచిదని అధికారులు చెబుతున్నారు.

News May 3, 2024

HYD: ప్రయాణికులకు TSRTC శుభవార్త

image

ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం రిజర్వేషన్ ఛార్జీలను మినహాయింపు ఇస్తున్నట్లు HYD అధికారులు తెలిపారు. ఎనిమిది రోజుల ముందు ముందస్తు రిజర్వేషన్ చేసుకునే వారికి ఇందులో మినహాయింపు వర్తిస్తుందని తెలిపారు. టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ కోసం tsrtconline.in వెబ్ సైట్‌ని సంప్రదించాలని పేర్కొన్నారు.

News May 3, 2024

HYD: ప్రయాణికులకు TSRTC శుభవార్త

image

ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం రిజర్వేషన్ ఛార్జీలను మినహాయింపు ఇస్తున్నట్లు HYD అధికారులు తెలిపారు. ఎనిమిది రోజుల ముందు ముందస్తు రిజర్వేషన్ చేసుకునే వారికి ఇందులో మినహాయింపు వర్తిస్తుందని తెలిపారు. టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ కోసం tsrtconline.in వెబ్ సైట్‌ని సంప్రదించాలని పేర్కొన్నారు.

News May 3, 2024

HYD: ఇంటి వద్ద ఓటు వేసిన వయోవృద్ధులు

image

మే 13న రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలకు పోలింగ్ ఉండడంతో వయోవృద్ధులు, సీనియర్ సిటిజన్స్, అనారోగ్యంతో ఉన్నవారి కోసం ఇంటి వద్దనే ఓటింగ్ సౌకర్యాన్ని ఎన్నికల అధికారులు కల్పించారు. ఈ సందర్భంగా శుక్రవారం HYDలోని మలక్‌పేట్ సహా పలు ప్రాంతాల్లో ఎన్నికల అధికారులు వయోవృద్ధుల ఇంటింటికి తిరుగుతూ వివరాలు సేకరించారు. వారితో ఓటు వేయించారు. పూర్తిగా పారదర్శకంగా ఈ ప్రక్రియ చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.

News May 3, 2024

HYD: ఇంటి వద్ద ఓటు వేసిన వయోవృద్ధులు

image

మే 13న రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలకు పోలింగ్ ఉండడంతో వయోవృద్ధులు, సీనియర్ సిటిజన్స్, అనారోగ్యంతో ఉన్నవారి కోసం ఇంటి వద్దనే ఓటింగ్ సౌకర్యాన్ని ఎన్నికల అధికారులు కల్పించారు. ఈ సందర్భంగా శుక్రవారం HYDలోని మలక్‌పేట్ సహా పలు ప్రాంతాల్లో ఎన్నికల అధికారులు వయోవృద్ధుల ఇంటింటికి తిరుగుతూ వివరాలు సేకరించారు. వారితో ఓటు వేయించారు. పూర్తిగా పారదర్శకంగా ఈ ప్రక్రియ చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.

News May 3, 2024

సిరిసిల్ల: వాహనం ఢీ.. బాలుడి మృతి

image

వాహనం ఢీకొని బాలుడు మృతి చెందిన ఘటన సిరిసిల్ల జిల్లాలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. వేములవాడ రూరల్ మండలం నాగయ్యపల్లిలో శుక్రవారం ఉదయం బాలుడు సూర హర్షవర్ధన్(6) రోడ్డు దాటుతున్నాడు. ఈ క్రమంలో బొలెరో వాహనం ఢీకొంది. తీవ్ర గాయాలైన బాలుడిని వేములవాడలోని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో కరీంనగర్ తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడని స్థానికులు చెప్పారు.

News May 3, 2024

చెరుకు ఫ్యాక్టరీలు తెరిచే యత్నం ఎన్నికల స్టంట్: అరవింద్

image

చెరుకు ఫ్యాక్టరీలు తెరిచే యత్నం ఎన్నికల స్టంట్ అని బీజేపీ ఎంపీ అభ్యర్థి అర్వింద్ ధర్మపురి ఆరోపించారు. శుక్రవారం బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి కోసమే రూ. 43 కోట్ల నిధులు విడుదల చేశారని అన్నారు. ఫ్యాక్టరీలు తెరిచేందుకు రూ. 800 కోట్లు అవసరం కాగా ఐదు శాతం నిధులు విడుదల చేశారని విమర్శించారు.

News May 3, 2024

నిరుద్యోగుల పక్షాన నిలబడతా: పాలకూరి అశోక్

image

గెలిచినా.. ఓడినా నిరుద్యోగుల పక్షాన నిలబడతానని NLG- KMM-WGL స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థి పాలకూరి అశోక్ కుమార్ అన్నారు. నల్లగొండలో ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 12 క్రిమినల్ కేసులు, చంచల్ గూడ జైలు జీవితం గడిపిన తాను విద్యార్థుల కోసం ఐదు రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేశానని నిరుద్యోగులు తమకు మద్దతుగా నిలబడతానన్నారు. తనను గెలిపిస్తే అసెంబ్లీలో నిరుద్యోగుల పక్షాన ప్రశ్నించే గొంతుకనవుతానన్నారు.