India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ADB పార్లమెంట్లో 3 ప్రధానపార్టీలు ఆదివాసీలకు టికెట్లు కేటాయించాయి. నియోజకవర్గంలో 16.50 లక్షల ఓటర్లు ఉన్నారు. 2019 పార్లమెంట్ ఎన్నికల ఫలితాలను చూస్తే BJP సోయంకు 3,77,374 ఓట్లు రాగా, BRS గోడం నగేశ్కు 318,814 ఓట్లు వచ్చాయి, కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన రాథోడ్ రమేష్కి 3,14,238 ఓట్లు పోలయ్యాయి. ప్రస్తుతం నగేశ్, రమేశ్ ఒకే గొడుగు కింద రావడంతో సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని చూస్తున్నారు.
ఖమ్మం బీఆర్ఎస్ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ బూత్ లెవల్ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో చేసిన పొరపాట్లు ఈ ఎన్నికల్లో చేయకుండా.. బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు గెలుపు కోసం ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పువ్వాడ, ఎమ్మెల్సీ తాతా మధు పాల్గొన్నారు.
2021లో జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో 5,05,565 మంది ఓటర్లు ఉండగా.. ఇటీవల ఎన్నికల సంఘం వెలువరించిన ఓటరు తుది జాబితా ప్రకారం 4,61,786 మంది ఓటర్లుగా నమోదయ్యారు. గతంలో పోల్చితే ఓటర్ల సంఖ్య తగ్గింది. పట్టభద్రులు ఓటు నమోదుపై ఆసక్తి చూపకపోవటమే దీనికి కారణం. సాధారణ ఓటుహక్కు మాదిరిగా కాకుండా ఎన్నికలు జరిగే ప్రతిసారీ పట్టభద్రులు కొత్త ఓటరుగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
చెన్నాపురం చెరువులో దూకి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల ప్రకారం.. చెన్నాపురం చెరువులో గురువారం గుర్తు తెలియని వ్యక్తి(25-30) చెరువులో దూకాడు. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.
చెన్నాపురం చెరువులో దూకి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల ప్రకారం.. చెన్నాపురం చెరువులో గురువారం గుర్తు తెలియని వ్యక్తి(25-30) చెరువులో దూకాడు. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.
సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఎక్సైజ్ ఎస్ఐ అనుమానాస్పదంగా మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఖమ్మం జిల్లాకు చెందిన కాళీ ప్రసాద్(54)మూడు నెలల క్రితం బదిలీపై ఎల్లారెడ్డిపేటకు వచ్చారు. మండల కేంద్రంలో ఇంట్లో అద్దెకు ఉంటుంన్నారు. శుక్రవారం ఉదయం అనుమానాస్పదంగా మృతి చెందినట్లు కనిపించడంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
బూర్గంపాడు మండలం సారపాకలో కుటుంబ కలహాల నేపథ్యంలో అమర్ జీవ్ అనే వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. స్థానికుల నుంచి పలు వివరాలు సేకరించారు. ఆత్మహత్యకు గల కారణాలు, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల బరిలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, BRS, BJP అభ్యర్థులు తలపడనున్నారు. ఇప్పటికే ఆయా పార్టీల ఎంపీ అభ్యర్థులు కార్నర్ మీటింగ్, ఆత్మీయ సమ్మేళనాలతో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అటు రేపు కొత్తగూడెంలో సీఎం రేవంత్ రెడ్డి సభ ఉంది. తానంటే తాను స్థానికుడని తనను ప్రజలు ఓటు వేసి గెలిపించాలని ఆయా పార్టీల అభ్యర్థులు ప్రజలను వేడుకుంటున్నారు. కాగా ఎన్నికల బరిలో గెలిచేది ఎవరు కామెంట్ చేయండి.
2021లో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో 5,05,565 మందికి 3,87,969 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. వీరిలో 21,636 మంది ఓట్లు చెల్లకపోవటం గమనార్హం. సాధారణ ఓటుహక్కు మాదిరిగా కాకుండా పట్టభద్రులు తమ ఓటుహక్కును ప్రాధాన్య క్రమంలో వినియోగించుకోవాలి. అంటే పోటీలో నిలిచిన అభ్యర్థులకు ప్రాధాన్య క్రమంలో ఓటేయాలి. ఈ విధానంపై కొందరికి అవగాహన లేకపోవటంతో వారి ఓట్లు చెల్లకుండా పోతున్నాయి.
బీజేపీ గెలిచే 400 సీట్లలో ఖమ్మం సైతం ఒకటిగా ఉండాలని ఖమ్మం పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు అన్నారు. ఖమ్మం 2టౌన్ లో శుక్రవారం జరిగిన రోడ్ షోలో అయన మాట్లాడుతూ.. కుటుంబ రాజకీయాలతో ఇక్కడ ప్రజలు ఎన్నో బాధలు పడుతున్నారని, అభివృద్ధికి ఖమ్మం జిల్లా ఆమడ దూరంలో ఉన్నదని అన్నారు. తనకు ఈసారి ఎంపీగా అవకాశం ఇస్తే కేంద్రం నుండి ప్రత్యేక నిధులతో ఖమ్మం అభివృద్ధి చేసేలా తాను చూసుకుంటానని అన్నారు.
Sorry, no posts matched your criteria.