India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాష్ట్ర వ్యాప్తంగా కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. మనషులపై దాడులకు పాల్పడుతూ తీవ్రంగా గాయపరుస్తున్నాయి. వరుసగా కుక్కల దాడులు జరుగుతున్నప్పటికీ.. కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తోంది. కుక్కల దాడుల నియంత్రణకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ఖమ్మం జిల్లా టేకులపల్లి మోడల్ కెరీర్ కేంద్రంలో ఉద్యోగ మేళాను గురువారం నిర్వహిస్తున్నారు. ఓ ఫైనాన్స్ సంస్థలో లోన్ ఆఫీసర్ పోస్టులు మొత్తం 100 ఖాళీలు భర్తీ ఏర్పాటు చేస్తున్నారు. 18 నుంచి 28 ఏళ్లు విద్య హర్షత్ ఇంటర్ మీడియట్ పూర్తి చేసిన, డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారు. ఉ.10 గంటలలోగా హాజరు కాగలరని ఉపాధి కల్పన అధికారి మాధవి ఓ ప్రకటనలో తెలిపారు.
హైదరాబాద్ సెక్రటేరియట్లో ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబును రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు. నియోజకవర్గం అభివృద్ధి గురించి కాసేపు చర్చించారు. ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు దీటి బాలరాజు, కటుకు ధనుంజయ్, అరగంట కృష్ణ, జనగాం శ్రీనివాస్ గౌడ్ తదితరులు ఉన్నారు.
వినాయక నిమజ్జనోత్సవాలు ప్రజలు ప్రశాంతంగా జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. బుధవారం మెట్పల్లి పట్టణంలో వినాయక విగ్రహాలు నిమజ్జనం చేసే వాగు ప్రాంతాన్ని వారు పరిశీలించారు. వాగు ఒడ్డుకు హైమాస్ లైట్లు ఏర్పాటు చేయాలని, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని స్థానిక అధికారులను ఆదేశించారు. నిమజ్జనం ఉత్సవాలు రాత్రివేళ ఉంటాయని, పట్టణంలోని అన్ని వీధుల్లో వీధిలైట్లు ఉండాలన్నారు.
రామప్ప దేవాలయానికి ప్రత్యేక చరిత్ర ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. సచివాలయంలో అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. రామప్ప కీర్తి ప్రతిష్టలను చాటి చెప్పేలా అభివృద్ధి పనులను చేపట్టాలని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి గడువులోగా అభివృద్ధి పనులను పూర్తి చేయాలని పిలుపునిచ్చారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పల్లికాయ ధరలు మొన్నటితో పోలిస్తే ఈరోజు భారీగా పెరిగాయి.
> సోమవారం సూక పల్లికాయ ధర రూ.5,270 పలకగా నేడు రూ.6400 పలికింది.
> అలాగే పచ్చి పల్లికాయకు మొన్న రూ.3,600 ధర రాగా.. రూ.5550 పలికింది.
> మరోవైపు పసుపుకి మొన్న రూ.12,399 ధర రాగా.. నేడు రూ.12,817 ధర వచ్చింది.
> 5531 రకం మిర్చికి మొన్న రూ.12వేల ధర రాగా.. నేడు రూ.13,500 వచ్చినట్లు వ్యాపారులు తెలిపారు.
దేవరకద్ర మండలం డోకూర్ గ్రామ స్టేజి వద్ద గుర్తుతెలియని వ్యక్తులు అప్పుడే పుట్టిన పసికందును చెట్ల పొదల్లో వదిలేసి వెళ్లారు. దేవరకద్ర PACS ఛైర్మన్ నరేందర్ రెడ్డి గ్రామానికి వెళ్తుండగా పాప ఏడుపు వినపడగా పాప ఉన్న ప్రాంతానికి వెళ్లి చూశారు. చీమలు పట్టి ఉండటం గమనించి పోలీసులకు సమాచారం అందజేశారు. ఘటనా స్థలానికి SI నాగన్న, అంగన్వాడీ టీచర్ చేరుకుని నవజాత శిశువును చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ప్రతి హిందువు తమ సనాతన ధర్మాన్ని తప్పకుండా అనుసరించాలని కేదార్నాథ్లోని మాతాకీ శిఖర్లో ఉంటున్న మంచిర్యాలకు చెందిన మహిళ అఘోరీ తెలిపారు. బుధవారం కొండగట్టు అంజన్న దర్శనానికి వచ్చిన అఘోరీకి అర్చకులు స్వాగతం పలికారు. స్వామివారి తీర్థ ప్రసాదం అందజేశారు. హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా ఆలయాలను సందర్శిస్తున్నట్లు చెప్పారు. తాను 20 ఏళ్ల క్రితం నాగ సాధువు (అఘోరీ)గా మారినట్లు పేర్కొన్నారు.
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర అగ్రికల్చర్ యూనివర్సిటీ బీఎస్సీ డిప్లొమా అర్హత పరీక్షలో మహబూబ్ నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండలం దేశాయిపల్లికి చెందిన డి.వేణు 92 మార్కులతో రాష్ట్రస్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించారు. తల్లిదండ్రులు సరోజ,పెంటయ్య స్వగ్రామంలో వ్యవసాయం చేస్తూ జీవనం గడుపుతున్నారు. రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు సాధించడం పట్ల గ్రామస్థులు,మండల నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
HMWSSB ఆధ్వర్యంలో గ్రేటర్ HYDలో 20 వేల లీటర్ల ఉచిత నీటి సరఫరా పథకం కొనసాగుతుందని, ఇప్పటి వరకు 6,13,562 మందికి ఈ పథకం అందిస్తున్నట్లుగా అధికారులు వెల్లడించారు. దీని ద్వారా 11,85,479 గృహాలకు లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. డిసెంబర్ 2020లో పథకం ప్రారంభించినప్పటి నుంచి ఆగస్టు 31 నాటికి రూ.1108.88 కోట్ల మేర జీరో బిల్ అందించినట్లు పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.