Telangana

News September 11, 2024

వరంగల్ మార్కెట్లో పెరిగిన అన్ని రకాల ధరలు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పల్లికాయ ధరలు మొన్నటితో పోలిస్తే ఈరోజు భారీగా పెరిగాయి.
> సోమవారం సూక పల్లికాయ ధర రూ.5,270 పలకగా నేడు రూ.6400 పలికింది.
> అలాగే పచ్చి పల్లికాయకు మొన్న రూ.3,600 ధర రాగా.. రూ.5550 పలికింది.
> మరోవైపు పసుపుకి మొన్న రూ.12,399 ధర రాగా.. నేడు రూ.12,817 ధర వచ్చింది.
> 5531 రకం మిర్చికి మొన్న రూ.12వేల ధర రాగా.. నేడు రూ.13,500 వచ్చినట్లు వ్యాపారులు తెలిపారు.

News September 11, 2024

దేవరకద్ర: పొదల్లో నవజాత శిశువు లభ్యం

image

దేవరకద్ర మండలం డోకూర్ గ్రామ స్టేజి వద్ద గుర్తుతెలియని వ్యక్తులు అప్పుడే పుట్టిన పసికందును చెట్ల పొదల్లో వదిలేసి వెళ్లారు. దేవరకద్ర PACS ఛైర్మన్ నరేందర్ రెడ్డి గ్రామానికి వెళ్తుండగా పాప ఏడుపు వినపడగా పాప ఉన్న ప్రాంతానికి వెళ్లి చూశారు. చీమలు పట్టి ఉండటం గమనించి పోలీసులకు సమాచారం అందజేశారు. ఘటనా స్థలానికి SI నాగన్న, అంగన్‌వాడీ టీచర్ చేరుకుని నవజాత శిశువును చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

News September 11, 2024

కొండగట్టులో మహిళ అఘోరీ

image

ప్రతి హిందువు తమ సనాతన ధర్మాన్ని తప్పకుండా అనుసరించాలని కేదార్నాథ్‌లోని మాతాకీ శిఖర్‌‌లో ఉంటున్న మంచిర్యాలకు చెందిన మహిళ అఘోరీ తెలిపారు. బుధవారం కొండగట్టు అంజన్న దర్శనానికి వచ్చిన అఘోరీకి అర్చకులు స్వాగతం పలికారు. స్వామివారి తీర్థ ప్రసాదం అందజేశారు. హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా ఆలయాలను సందర్శిస్తున్నట్లు చెప్పారు. తాను 20 ఏళ్ల క్రితం నాగ సాధువు (అఘోరీ)గా మారినట్లు పేర్కొన్నారు.

News September 11, 2024

రాష్ట్రంలోనే మొదటి ర్యాంకు సాధించిన పాలమూరు వాసి

image

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర అగ్రికల్చర్ యూనివర్సిటీ బీఎస్సీ డిప్లొమా అర్హత పరీక్షలో మహబూబ్ నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండలం దేశాయిపల్లికి చెందిన డి.వేణు 92 మార్కులతో రాష్ట్రస్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించారు. తల్లిదండ్రులు సరోజ,పెంటయ్య స్వగ్రామంలో వ్యవసాయం చేస్తూ జీవనం గడుపుతున్నారు. రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు సాధించడం పట్ల గ్రామస్థులు,మండల నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

News September 11, 2024

HYD: 6.13 లక్షల మందికి 20 వేల లీటర్ల వాటర్ FREE

image

HMWSSB ఆధ్వర్యంలో గ్రేటర్ HYDలో 20 వేల లీటర్ల ఉచిత నీటి సరఫరా పథకం కొనసాగుతుందని, ఇప్పటి వరకు 6,13,562 మందికి ఈ పథకం అందిస్తున్నట్లుగా అధికారులు వెల్లడించారు. దీని ద్వారా 11,85,479 గృహాలకు లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. డిసెంబర్ 2020లో పథకం ప్రారంభించినప్పటి నుంచి ఆగస్టు 31 నాటికి రూ.1108.88 కోట్ల మేర జీరో బిల్ అందించినట్లు పేర్కొన్నారు.

News September 11, 2024

WGL: నిన్నటితో పోలిస్తే పెరిగిన మిర్చి ధరలు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో బుధవారం వివిధ రకాల మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. నిన్న తేజ మిర్చి క్వింటాకు రూ.18,000 పలకగా, నేడు రూ.18,500కి పెరిగింది. అలాగే 341 రకం మిర్చికి నిన్న రూ.14,800 ధర రాగా.. నేడు రూ.15,500కి ఎగబాకింది. మరోవైపు వండర్ హాట్(WH) మిర్చికి మంగళవారం రూ.16,000 ధర రాగా నేడు కూడా అదే ధర వచ్చిందని వ్యాపారులు తెలిపారు.

News September 11, 2024

GOOD NEWS: వరంగల్‌లో పెరిగిన పత్తి ధర

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో పత్తి ధర రెండు రోజులతో పోలిస్తే ఈరోజు భారీగా పెరిగింది. మార్కెట్‌లో సోమ, మంగళవారాలు క్వింటా పత్తి ధర రూ.7,700 పలకగా నేడు రూ.7,800 అయిందని మార్కెట్ అధికారులు తెలిపారు. ధరలు పెరగడం రైతులకు కొంత ఊరట లభించినట్టయింది. మరింత ధరలు పెరగాలని అన్నదాతలు ఆకాంక్షిస్తున్నారు.

News September 11, 2024

నేడు ఖమ్మం జిల్లాకు రానున్న కేంద్ర బృందం

image

మున్నేరు, ఆకేరు, పాలేరు వరదలతో నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించేందుకు కేంద్ర బృందం బుధవారం ఖమ్మం జిల్లాకు రానుంది. ఈ సందర్భంగా వివిధ విభాగాల అధికారులు 9 మందితో ఈ బృందం నేడు ఢిల్లీ నుంచి వస్తోంది. ఈ బృందంలోని అధికారులు రెండు బృందాలుగా ఏర్పడి నష్టాన్ని పరిశీలిస్తారు. ఒక బృందం దెబ్బతిన్న పంటలను, మరో బృందం రోడ్లు, ఎన్నెస్పీ కాలువలు, వంతెనలను పరిశీలించనుంది.

News September 11, 2024

MBNR: తట్టుకోలేక.. తనువు చాలిస్తున్నారు

image

కుటుంబ ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కెరీర్‌లో ఎత్తు పల్లాలు, లవ్ ఫెయిల్యూర్ ఇలా వివిధ కారణాలతో కొందరు తనువు చాలిస్తున్నారు. ఎంతో విలువైన జీవితానికి ముగింపు పలుకుతున్నారు. ఫలితంగా కుటుంబ సభ్యులకు వేదన మిగుల్చుతున్నారు. పాలమూరు జిల్లాలో బలవన్మరణానికి పాల్పడే వారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. ఉమ్మడి జిల్లాలో గడిచిన 12 నెలల్లో 930 ఆత్మహత్యకు పాల్పడ్డారంటే.. ఆ తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.

News September 11, 2024

HYD: మెట్రో ప్రయాణికుల కొత్త డిమాండ్

image

హైదరాబాద్‌ మెట్రో‌లో రద్దీ రోజురోజుకి పెరుగుతోంది. ముఖ్యంగా నాగోల్ నుంచి రాయదుర్గం రూట్‌లో ఉదయం, సాయంత్రం నిలబడలేని పరిస్థితి ఉంటోంది. నాన్‌స్టాప్ సర్వీసులు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. దీనివలన ప్రయాణం సౌలభ్యంగా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. రెగ్యులర్ సేవలతో పాటు నాన్ స్టాప్ సర్వీసులు కూడా ఏర్పాటు చేయడంతో‌ సమయం ఆదా అవుతోందన్నారు. దీనిపై మీ కామెంట్?