Telangana

News September 11, 2024

హనుమకొండ: వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

image

కాకతీయ యూనివర్సిటీ స్టేషన్ పరిధి గోపాల్‌పూర్ శివసాయి కాలనీలోని ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్న మహిళను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వేలేరు ప్రాంతానికి చెందిన ఓ మహిళ శివసాయి కాలనీలో ఇతర రాష్ట్రాల నుంచి మహిళలను తీసుకువచ్చి ఏడాదిగా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. స్థానికుల సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్, కేయూ పోలీసులతో కలిసి ఆ గృహంపై దాడి చేసి ఆమెను అరెస్టు చేశారు.

News September 11, 2024

నిర్మల్: గృహిణి పై డెలివరీ బాయ్ అత్యాచారయత్నం

image

ఓ గృహిణిపై డెలివరీ బాయ్ అత్యాచారం చేయడానికి ప్రయత్నించిన ఘటన నిర్మల్‌లో మంగళవారం చోటుచేసుకుంది. ఓ ఆర్డర్‌ను డెలివరీ చేసేందుకు వచ్చిన డెలివరీ బాయ్ ఇంట్లో ఒంటరిగా ఉన్న గృహిణి పై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. అప్రమత్తమైన ఆమె కేకలు వేయగానే పక్కింటి వారు వచ్చేలోపు డెలివరీ బాయ్ పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి నిందితుడు విఘ్నేశ్ (23)ని అరెస్టు చేసినట్లు CI రామకృష్ణ తెలిపారు.

News September 11, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో TODAY HEADLINES

image

> వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన > భద్రాచలం వద్ద కొనసాగుతున్న గోదావరి ఉధృతి > కొత్తగూడెంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం > సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద పర్యటన > మధిర మండలంలో మంచినీటి సరఫరా బంద్ > పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు >ఖమ్మం నగరంలో మంత్రి తుమ్మల పర్యటన >మున్నేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న చర్యలు

News September 11, 2024

కొండగట్టు బస్సు ప్రమాద ఘటనకు ఆరేళ్లు!

image

కొండగట్టు రోడ్డులో బస్సు ప్రమాదం జరిగిన ఘటనకు నేటితో ఆరేళ్లు పూర్తైంది.108 మంది ప్రయాణికులతో వెళుతున్న ఆర్టీసీ బస్సు కొండగట్టు ఘాటు రోడ్డు లోయలో పడి 65 మంది చనిపోయారు. పదుల సంఖ్యలో గాయపడి జీవచ్ఛవంలా బతుకుతున్నారు. ఈ ఘటన దేశ చరిత్రలోనే ఆతి పెద్ద ప్రమాదంగా నిలిచింది. ఆ తర్వాత ప్రభుత్వం రూ.1.50 కోట్లు వెచ్చించి ఘాట్ రోడ్డుకు ఇరువైపులా పలుచోట్ల రక్షణ గోడలు, తక్కువ ఎత్తుతో వేగనియంత్రికలు నిర్మించింది.

News September 11, 2024

MDK: ఆడపడుచులకు ఆపదలో అస్త్రాలివే

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో పోకిరీలు రెచ్చిపోతున్నారు. జిల్లాలో ఎక్కడో ఒకచోట అత్యాచారాలు, లైంగిక వేధింపు కేసులు నమోదవుతూనే ఉన్నాయి. వీటికి చెక్ పెట్టేందుకు అధికారలు చర్యలు చేపట్టారు. అత్యవసర సమయాల్లో రక్షణకు టోల్‌ఫ్రీ నంబర్లను, యాప్‌లను తీసుకొచ్చారు. చైల్డ్ హెల్పులైన్-198, షీ టీం-8712657963, భరోసా-08457293098, మహిళా హెల్ప్‌లైన్-181, మిషన్ పరివర్తన-14446, పోక్సో ఈ బాక్స్, 112 యాప్‌‌లు ఉన్నాయి. SHARE IT

News September 11, 2024

నిలకడగా భద్రాచలం గోదావరి నది ప్రవాహం

image

భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం గడిచిన గంట నుంచి నిలకడగా కొనసాగుతోంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం ఉదయం 5 గంటలకు 50.5 అడుగుల వద్ద ఉన్న గోదావరి నీటిమట్టం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇక గోదావరి ప్రవాహం పెరిగే అవకాశం లేదని, ఒకవేళ పెరిగినా స్వల్పంగా పెరిగి, అనంతరం తగ్గుముఖం పడుతుందని విశ్లేషకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

News September 11, 2024

HYDలో 40 గంటల భారీ బందోబస్తు!

image

HYD నగరంలో గణపతి నిమజ్జనం చివరి రోజు 40 గంటల పాటు భారీ బందోబస్తు ఉంటుందని సీపీ CV ఆనంద్ తెలిపారు. ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్, తదితర పోలీసులతో ఆయన సమావేశం నిర్వహించారు. మిలాద్ ఉన్ నబి వేడుకల్లో భాగంగా ఎక్కడికక్కడ చర్యలు తీసుకుంటామన్నారు. రౌడీలు, కమ్యూనల్ అంశాలపై ప్రత్యేక దృష్టి సాధించాలని కిందిస్థాయి అధికారులకు సూచించారు. శాంతియుతంగా వేడుకలు నిర్వహించుకోవాలన్నారు.

News September 11, 2024

HYDలో 40 గంటల భారీ బందోబస్తు!

image

HYD నగరంలో గణపతి నిమజ్జనం చివరి రోజు 40 గంటల పాటు భారీ బందోబస్తు ఉంటుందని సీపీ CV ఆనంద్ తెలిపారు. ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్, తదితర పోలీసులతో ఆయన సమావేశం నిర్వహించారు. మిలాద్ ఉన్ నబి వేడుకల్లో భాగంగా ఎక్కడికక్కడ చర్యలు తీసుకుంటామన్నారు. రౌడీలు, కమ్యూనల్ అంశాలపై ప్రత్యేక దృష్టి సాధించాలని కిందిస్థాయి అధికారులకు సూచించారు. శాంతియుతంగా వేడుకలు నిర్వహించుకోవాలన్నారు.

News September 11, 2024

మహిళా కమిషన్ సభ్యురాలిగా చాకలి ఐలమ్మ మనుమరాలు: సీఎం

image

ప్రభుత్వం HYD రవీంద్రభారతిలో చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో ధీర వనిత ఐలమ్మ స్ఫూర్తిని కొనసాగిస్తామన్నారు. ఐలమ్మ మనుమరాలు శ్వేతను మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమించాలని నిర్ణయం తీసుకున్నట్లు సీఎం చెప్పారు.

News September 11, 2024

ఆదిలాబాద్: 13న ఇంటర్వ్యూ.. 20 వేల జీతం

image

ఆదిలాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (సైన్సెస్)లలో ఈనెల 13న వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ డా.సంగీత పేర్కొన్నారు. UpGrad వారి సహకారంతో HDFC Bank లలో శాశ్వత ప్రాతిపదికన బ్యాంకులలో నెలకు 20,000 పైన జీతభత్యాలు అందుకొనే సువర్ణ అవకాశమని పేర్కొన్నారు. ఏదైనా డిగ్రీ /బిటెక్ లో 50% మార్కులు కలిగి ఉండి 30 సం.రాల లోపు వయసు ఉన్నవారు అర్హులని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.