Telangana

News September 5, 2025

ఉత్తమ ప్రిన్సిపల్‌గా అవార్డు అందుకున్న ADB వాసి

image

బోధన, అభ్యాసం, పరిపాలనలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన బోథ్ తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శివకృష్ణ ఉత్తమ ప్రిన్సిపల్ అవార్డుకు ఎంపికయ్యారు. టీచర్స్ డేను పురస్కరించుకొని శుక్రవారం హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో ఏర్పాటు చేసిన ‘గురుపూజోత్సవం’ కార్యక్రమంలో విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, డైరెక్టర్ నవీన్ నికోలస్ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు

News September 5, 2025

ADB: డీజే యజమానులు, ఆపరేటర్లపై 4 కేసులు నమోదు

image

నిబంధనకు లోబడి సౌండ్ బాక్స్‌లను ఏర్పాటు చేయని వారిపై చట్ట ప్రకారం చర్యలు తప్పవని ఇచ్చోడ సీఐ బండారి రాజు తెలిపారు. నేరడిగొండ మండలం వడూరు గణపతి మండపాల వద్ద నిబంధనలకు అతిక్రమించి, ఏర్పాటు చేసిన నాలుగు డీజేలను స్వాధీనం చేసుకొని యజమానులపై, ఆపరేటర్లపై నేరడిగొండ PSలో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు.

News September 5, 2025

HYD: ఆదివారం ఆలయాలు బంద్

image

ఈ నెల 7వ తేదీన(ఆదివారం) చంద్ర గ్రహణం ఉంది. ఆ రోజు సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి దేవాలయం మధ్యాహ్నం 12 గంటలకు మూసి వేస్తామని ఆలయ కార్యనిర్వహణ అధికారి గుత్తా మనోహర్ రెడ్డి తెలిపారు. తిరిగి సోమవారం ఉదయం 8:30 గంటలకు తెరుస్తామని చెప్పారు. ఇక చిల్కూరు బాలాజీ ఆలయం ఆదివారం సాయంత్రం 4 గంటలకు మూసివేస్తారు. సోమవారం ఉదయం 8 గంటలకు తెరుస్తారు. భక్తులు గమనించాలని ఆలయ సిబ్బంది సూచించారు.
SHARE IT

News September 5, 2025

రేపు నగరం కిటకిట

image

గణపతి నిమజ్జన ఘట్టం మరికొన్ని గంటల్లో ప్రారంభం కాబోతోంది. వేలాది వినాయక విగ్రహాలు వివిధ రూపాల్లో నగర ప్రజలను కనువిందు చేయనున్నాయి. ఈ వేడుకను చూసేందుకు చిన్నా..పెద్దా అందరూ ఎదురుచూస్తున్నారు. నగరవాసులే కాక తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు ప్రజలు కూడా ఇప్పటికే నగరానికి చేరుకున్నారు. దాదాపు 40 లక్షల మంది నిమజ్జన ఘట్టాన్ని తిలకించనున్నారని గణేశ్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి శశిధర్ తెలిపారు.

News September 5, 2025

2 గ్రూపుల గొడవను ఆపిన ADB ట్రాఫిక్ సీఐ

image

గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ADB శివాజీ చౌక్ నుంచి ఠాకూర్ హోటల్‌కు వెళ్లే దారి మధ్యలో ఓకే మండపానికి చెందిన వ్యక్తులు రెండు గ్రూపులుగా విడిపోయి, మద్యం మత్తులో గొడవ పడ్డారు. ట్రాఫిక్ సీఐ ప్రణయ్ కుమార్ అక్కడికి చేరుకొని వారికి సర్ది చెప్పిన.. వినక పోయేసరికి బలవంతంగా వారిని చెదరగొట్టి పంపించేశారు. ఈ ఘటనను కొందరు పోలీసులు కొట్టారని దుష్ప్రచారం చేస్తున్నారని వారిపట్ల చర్యలు తప్పవని ఆయన తెలిపారు.

News September 5, 2025

HYD పరువు తీస్తున్నారు.. మీరు మారరా?

image

వినాయకచవితి పండుగ నగర యువతకు ఒక ఎమోషన్. ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకొనే వేడుక ఇది. కానీ, కొందరు పరువు తీస్తున్నారు. ఖైరతాబాద్‌‌కు దర్శనానికి వచ్చిన అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించి 930 మంది పట్టుబడ్డారు. మరికొందరు మద్యం తాగి జులూస్‌లకు వస్తున్నారు. భక్తిపాటలకు బదులు తమకు నచ్చిన పాటలతో చిందులేసిన వీడియోలు SMలో వైరల్ అయ్యాయి. ఇకనైనా వీటికి స్వస్థి పలికి భక్తితో నిమజ్జనం చేద్దాం. దీనిపై మీ కామెంట్?

News September 5, 2025

పాలమూరులో వినాయక నిమజ్జనం.. ఎస్పీ సూచనలు

image

మహబూబ్‌నగర్‌లో గణపతి నిమజ్జనోత్సవం శాంతియుతంగా, ఘనంగా నిర్వహించేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఎస్పీ డి.జానకి, జిల్లా పోలీస్ కవాతు మైదానంలో పోలీస్ అధికారులతో, సిబ్బందితో బ్రీఫింగ్ సమావేశం నిర్వహించి కీలక సూచనలు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పికెట్స్, రూఫ్ టాప్ బందోబస్తు, మఫ్టీ పోలీసులు, పెట్రోలింగ్, స్ట్రైకింగ్ ఫోర్స్లను 280 మంది పోలీసులను ఏర్పాటు చేసింది.

News September 5, 2025

HYD: SBI రివార్డ్ పాయింట్ల పేరిట మోసం..జాగ్రత్త!

image

SBI రివార్డు పాయింట్ల తేదీ గడిచిపోతుందని, వాటిని నగదుగా మార్చుకోవాలంటే వెంటనే APK ఫైల్ డౌన్‌లోడ్ చేసుకోవాలని వాట్సప్, ఫేస్‌బుక్, మెసేజెస్ ద్వారా వచ్చే సమాచారాన్ని నమ్మొద్దని పోలీసులు సూచించారు. APK డౌన్‌లోడ్ చేసుకున్న అనంతరం వ్యక్తిగత వివరాలు తీసుకునే ప్రమాదం ఉందన్నారు. SBI బ్యాంకు అలాంటిది ఏది వాట్సాప్ ద్వారా పంపదని ఉప్పల్ SBI ప్రశాంత్ నగర్ అధికారులు తెలిపారు.

News September 5, 2025

HYD: గణేశ్ నిమజ్జనం కోసం.. ఆన్ డ్యూటీలో అన్ని శాఖలు!

image

హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద గణపతి నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు మంత్రి ప్రభాకర్ తెలిపారు. పోలీస్, రెవెన్యూ, విద్యుత్, HMDA, వాటర్ బోర్డు, ట్రాఫిక్ పోలీస్, R&B, హైడ్రా, మెడికల్ & హెల్త్, టూరిజం & ఇన్ఫర్మేషన్ విభాగాలు ఆన్ డ్యూటీలో ఉన్నట్లు చెప్పారు. GHMC సెప్టెంబర్ 6న విగ్రహాల నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు.

News September 5, 2025

HYD: హైడ్రా పేరిట మోసాలు.. జాగ్రత్త!

image

భూముల రక్షణకు సంబంధించి హైడ్రా కార్యాలయానికి వెళ్లకుండా డైరెక్ట్ డీల్ చేస్తామని కొంతమంది మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. అలాంటి వారిని నమ్మొద్దని సూచించారు. ఒక డిజిటల్ మీడియా రిపోర్టర్, నకిలీ న్యాయవాది, సహచరులు హైడ్రాతో లింక్ ఉన్నట్టు చూపిస్తూ ఒక పౌరుని రూ.50 లక్షలతో మోసం చేసిన ఆరోపణపై కేసు బుక్ చేసినట్లు తెలిపారు.