India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆకస్మిక తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలను, స్టేషన్ పరిధిలో నమోదవుతున్న, నమోదైన కేసుల వివరాలు, స్టేషన్ రికార్డ్లను తనిఖీ చేశారు. కేసుల దర్యాప్తు విషయంలో అధికారులు అలసత్వం వహించొద్దన్నారు. ప్రజా ఫిర్యాదులలో ఎలాంటి జాప్యం చేయకుండా బాధితుల పట్ల తక్షణమే స్పందించాలన్నారు. ప్రజలకు ఎల్లపుడు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలను తీర్చాలని సూచించారు.
వరంగల్ నగరంలో గణేశ్ నిమజ్జనానికి ఏర్పాట్లు ప్రారంభం అయ్యాయి. మంగళవారం నిమజ్జనానికి సంబంధించిన చెరువులను, పరిసర ప్రాంతాలను సెంట్రల్ జోన్ డీసీపీ సలీమా పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నిమజ్జనానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏసిపి నందిరాం నాయక్, CI గోపి, సిబ్బంది పాల్గొన్నారు.
భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోందని సీడబ్ల్యుసీ అధికారులు ప్రకటించారు. మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల సమయం నాటికి గోదావరి నీటి మట్టం 47.1 అడుగులకు చేరిందని వెల్లడించారు. మొదటి ప్రమాద హెచ్చరిక 43 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 47.1 అడుగులుగా ఉంది. రెండో ప్రమాద హెచ్చరిక 48 అడుగులు కావడంతో వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
జడ్చర్ల మాజీ మంత్రి చర్లకోల లక్ష్మారెడ్డి సతీమణి గత రాత్రి అనారోగ్యంతో చెన్నైలో మరణించింది. ఆమె భౌతిక దేహాన్నినాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజీపేట మండలం ఆవంచ గ్రామానికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఉమ్మడి MBNR జిల్లా ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణరెడ్డి, జనంపల్లి అనిరుద్ రెడ్డి, యెన్నం శ్రీనివాస్ రెడ్డి వాకటి శ్రీహరి, కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, ఇంద్రసేనారెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు.
క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడవద్దని ఆదిలాబాద్ డీఎంహెచ్ఓ డాక్టర్ కృష్ణ, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ పేర్కొన్నారు. సెప్టెంబర్ 10 ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా స్థానిక రిమ్స్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని కరపత్రాలను ఆవిష్కరించారు. ఆత్మహత్యలకు పాల్పడటం వల్ల వారి కుటుంబాలు చిన్న భిన్నమవుతాయన్నారు. ఉచిత కౌన్సెలింగ్ కొరకు 14416 నంబర్ను సంప్రదించాలన్నారు.
తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల్లో పని చేస్తున్న శానిటేషన్, ఇతర సిబ్బందికి 6 నెలలుగా ప్రభుత్వం జీతాలు చెల్లించకపోవడం అమానుషం అని మాజీమంత్రి హరీష్ రావు అన్నారు. 1వ తేదీనే జీతాలు చెల్లిస్తున్నట్లు చెప్పుకునే సీఎంకు వీరి వెతలు కనిపించకపోవడం శోచనీయమన్నారు. టీవీవీపీ ఆసుపత్రుల్లోని సిబ్బందికి వెంటనే జీతాలు చెల్లించాలని, పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని బీఆర్ఎస్ తరఫున డిమాండ్ చేశారు.
మాజీ మంత్రి, BRS మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి సతీమణి శ్వేతా లక్ష్మారెడ్డి(60) సోమవారం రాత్రి మృతిచెందారు. కాగా శ్వేతా మృతి పట్ల మాజీ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ప్రకటన విడుదల చేశారు. లక్ష్మారెడ్డికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అంత్యక్రియలకు బీఆర్ఎస్ అగ్రనేతలు కేటీఆర్, హరీష్ రావు తదితరులు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు వెల్లడించారు.
నూతనంగా నిర్మించనున్న శివాలయం స్థలంలో తాత్కాలికంగా ప్రతిష్ఠించిన శివలింగాన్ని గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లిన ఘటన వారం రోజుల తర్వాత వెలుగులోకి వచ్చింది. మండలంలోని మునిపల్లి గ్రామంలోని వడ్డెర కాలనీలో నిర్మించనున్న గుడి స్థలంలో ప్రతిష్ఠించిన శివలింగం చోరీకి గురైనట్లు స్థానికులు కాలనీవాసులు తెలిపారు. వారి ఫిర్యాదు మేరకు ఎస్ఐ తిరుపతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
గల్ఫ్లో మరో మెదక్ జిల్లా వాసి మృతి చెందాడు. హవేలీఘనపూర్ మండలం సుల్తాన్ పూర్ తండాకు చెందిన రామావత్ వస్రాం(40) మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నిజామాబాద్కు చెందిన ఏజెంట్ ద్వారా గత నెల10న కూలి పని కోసం దుబాయ్ వెళ్ళాడు. నిన్న మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. కాగా మెదక్ మండలం తిమ్మక్కపల్లి తండాకు చెందిన రాట్ల సూర్య కూడా ఈనెల 1న అబుదాబిలో మరణించగా మృతదేహం కోసం ఎదురు చూస్తున్నారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ ఏరియా ఆసుపత్రి, వేములవాడ ఏరియా ఆసుపత్రులకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఇటీవల ఎన్క్వాస్ అవార్డుకు ఎంపికయ్యాయి. ఇక్కడి వైద్యులు ఆసుపత్రిలో రోగులకు నాణ్యమైన సేవలు అందిస్తుండడంతో పాటు చక్కటి నాణ్యత ప్రమాణాలను పాటిస్తున్నారు. ఈ క్రమంలో గుర్తింపు లభించింది. అయితే మంచి సేవలు అందిస్తున్నప్పటికీ ఈ ఆసుపత్రులకు నిధులు మాత్రం కరవయ్యాయి.
Sorry, no posts matched your criteria.