India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
డెంగ్యూతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరిన బాలుడు చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం మృతి చెందాడు. హత్నూర మండలం కొన్యాల గ్రామానికి చెందిన ప్రభులింగం కుమరుడు దశ్విక్(45రోజులు) మూడు రోజుల క్రితం అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి నీలోఫర్ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు.
వరకట్న వేధింపులతో వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు తెలిపిన వివరాలు.. పైడిపల్లికి చెందిన స్వాతికి అదే గ్రామానికి చెందిన నిరంజన్తో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. పెళ్లయిన తర్వాత నుంచి ఆమె భర్త, అత్త కట్నం తీసుకురమ్మని వేధించేవారు. ఈ క్రమంలో పెద్దమనుషుల సమక్షంలో పలుమార్లు పంచాయితీ జరిగినా వేధించడం మానకపోయేసరికి ఈ నెల 5న గడ్డి మందు తాగింది. MGMలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది.
>వివిధ శాఖల అధికారులతో ఖమ్మం భద్రాద్రి జిల్లా కలెక్టర్లు సమీక్ష
> వరదలపై వైరా ఎమ్మెల్యే అధికారులతో సమీక్ష
>భద్రాచలం వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి
>ఖమ్మం మున్నేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న చర్యలు
>అశ్వరావుపేటలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పర్యటన
>పినపాక నియోజకవర్గంలో ఎమ్మెల్యే పాయం పర్యటన
>సత్తుపల్లిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని పీజీ సెమిస్టర్- 2 పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ మేరకు పీజీ కళాశాల పరీక్ష కేంద్రంలో పీయూ రిజిస్ట్రార్ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరీక్షలు సజావుగా జరిగే విధంగా అధికారులు చూడాలని, చూచిరాతలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట కంట్రోలర్ రాజ్ కుమార్, ప్రిన్సిపాల్ చంద్రకిరణ్, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడి మెదక్లో చికెన్ ధరలు భారీగా తగ్గాయి. గతవారం కిలో రూ. 200లకు పైగానే విక్రయించారు. గణేశ్ నవరాత్రులు మొదలుకావడంతో మాంసం విక్రయాలు క్రమంగా తగ్గినట్లు వ్యాపారులు చెబుతున్నారు. మంగళవారం చికెన్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. విత్ స్కిన్ కిలో రూ. 161, స్కిన్ లెస్ రూ. 183, ఫాంరేటు రూ. 89, రిటైల్ రూ. 111 చొప్పున విక్రయిస్తున్నారు.
SHARE IT
హైదరాబాద్లో చికెన్ ధరలు భారీగా తగ్గాయి. గతవారం కిలో రూ. 200లకు పైగానే విక్రయించారు. గణేశ్ నవరాత్రులు మొదలుకావడంతో మాంసం విక్రయాలు క్రమంగా తగ్గినట్లు వ్యాపారులు చెబుతున్నారు. మంగళవారం చికెన్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. విత్ స్కిన్ కిలో రూ. 161, స్కిన్ లెస్ రూ. 183, ఫాంరేటు రూ. 89, రిటైల్ రూ. 111 చొప్పున విక్రయిస్తున్నారు.
SHARE IT
హైదరాబాద్లో చికెన్ ధరలు భారీగా తగ్గాయి. గతవారం కిలో రూ. 200లకు పైగానే విక్రయించారు. గణేశ్ నవరాత్రులు మొదలుకావడంతో మాంసం విక్రయాలు క్రమంగా తగ్గినట్లు వ్యాపారులు చెబుతున్నారు. మంగళవారం చికెన్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. విత్ స్కిన్ కిలో రూ. 161, స్కిన్ లెస్ రూ. 183, ఫాంరేటు రూ. 89, రిటైల్ రూ. 111 చొప్పున విక్రయిస్తున్నారు.
SHARE IT
వరంగల్ నగరంలోని ప్రసిద్ధ శ్రీ భద్రకాళి అమ్మవారి దేవస్థానంలో అర్చకులు, ఉద్యోగుల తీరు విమర్శలకు తావిస్తోంది. అమ్మవారికి భక్తులు కానుకలుగా ఇచ్చిన పలు వస్తువులను కొందరు అర్చకులు, అధికారులు ఫలహారంగా పంచుతున్నట్లు సమాచారం. అమ్మవారికి భక్తులు చీర, సారె, పూజా వస్తువులు, పూలు, పండ్లు ఇతరత్రా వస్తువులు భక్తితో సమర్పిస్తారు. ఇవి పక్కదారి పట్టడం ఆందోళన కలిగిస్తోంది.
రాష్ట్రంలో ఉప ఎన్నికలు జరగడం ఖాయమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య విధానానికి చెంపు పెట్టుతున్నదని పేర్కొన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు అనర్హతకు గురికావడం తద్యమన్నారు. ఈ క్రమంలో ఆయా సంబంధిత నియోజకవర్గంలో ఉప ఎన్నికలు రావడం ఖాయమని తెలిపారు.
పరిశ్రమల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకున్న వారికి నిర్ణీత గడువులోపు అనుమతులు ఇవ్వాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సోమవారం నారాయణపేట కలెక్టరేట్లో పరిశ్రమలు, డిఆర్డిఏ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఇప్పటి వరకు అనుమతుల కొరకు 58 దరఖాస్తులు రాగా, 45 దరఖాస్తులకు అనుమతులు వచ్చాయని, మిగతావి ప్రాసేస్ లో వున్నాయని కలెక్టర్ కు వివరించారు. టి ప్రైడ్ కింద 79 దరఖాస్తులకు సబ్సిడీ మంజూరు చేశామన్నారు.
Sorry, no posts matched your criteria.