India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మెదక్ పట్టణంలో ఈనెల 20న సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను రాష్ట్ర మంత్రి కొండా సురేఖ శుక్రవారం సాయంత్రం పరిశీలించారు. సీఎస్ఐ గ్రౌండ్ లో హెలిపాడ్ పరిశీలించారు. గ్రౌండ్ నుండి కలెక్టరేట్ అక్కడి నుండి రాందాస్ చౌరస్తా వరకు నిర్వహించే రోడ్ షో, మీటింగ్ గురించి స్థానిక నేతలను అడిగి తెలుసుకున్నారు. వెంట మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, సుప్రభాతారావు, రమేశ్ రెడ్డి, జీవన్ రావు ఉన్నారు.
షెడ్డు నుంచి కారు ఇక బయటకు రాదు. అది పాడైపోయిందని BRSను ఉద్దేశించి సీఎం రేవంత్రెడ్డి విమర్శించారు. MBNRలో వంశీచంద్రెడ్డి నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. నిన్న BRS అధినేత కేసీఆర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై స్పందించారు.”20 మంది MLAలు టచ్లో ఉన్నారని కేసీఆర్ అంటున్నారు. ఇక్కడ కాపలా ఉన్నది రేవంత్రెడ్డి. మా MLAలను టచ్ చేస్తే మాడి మసైపోతావు” అని అన్నారు.
గద్వాల- ఎర్రవల్లి రహదారిలో శుక్రవారం మధ్యాహ్నం బైక్, బొలెరో వాహనం ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో బైక్ పై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. అటుగా వెళుతున్న ద్విచక్ర వాహనదారులు గద్వాల పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
నాగర్ కర్నూల్ పార్లమెంట్ BRS అభ్యర్థి ప్రవీణ్ కుమార్ శుక్రవారం జిల్లా ఎన్నికల అధికారి ఉదయ్ కుమార్కు నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈనెల 24న నాగర్ కర్నూల్లో నిర్వహించే రోడ్డు షోలో కేటీఆర్ పాల్గొనేందుకు రానున్నారు. 24న నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రవీణ్ కుమార్ మరో సెట్ నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్నారు.
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంబీఏ పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు. ఎంబీఏ (సీబీసీఎస్) మొదటి సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు. ఈ ఫలితాలను ఓయూ వెబ్సైట్ www.osmania.ac.in లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంబీఏ పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు. ఎంబీఏ (సీబీసీఎస్) మొదటి సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు. ఈ ఫలితాలను ఓయూ వెబ్సైట్ www.osmania.ac.in లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.
సిద్దిపేట జిల్లా కొండపాక మండలం వెలికట్ట చౌరస్తా వద్ద రాజీవ్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందారు. స్థానికుల సమాచారం మేరకు.. హైవే పై స్కూటీని టాటా ఏస్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జనగామ జిల్లా బచ్చన్నపేట వాసి ఆశోక్(70) స్పాట్లోనే చనిపోయాడు. సమాచారం అందుకున్న కుకునూర్పల్లి పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం సిద్దిపేట ఆస్పత్రికి తరలించారు.
బావిలో దూకి వృద్ధురాలు మృతి చెందిన ఘటన ఓదెల మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓదెల గ్రామానికి చెందిన చింతం లక్ష్మి(74) శుక్రవారం తెల్లవారుజామున 5 గంటలకు నాగులకుంట కట్ట వెనకాల బావిలో దూకి మృతి చెందింది. ఘటనా స్థలానికి పొత్కపల్లి ఎస్ఐ చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. భార్య చనిపోవడంతో భర్త చంద్రయ్య విలపించిన తీరు అందర్నీ తీవ్రంగా కలిచివేస్తోంది.
తనతో 20 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారంటూ మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి నామినేషన్ సందర్భంగా రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ.. మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే మాడి మసై పోతావ్ అంటూ కేసీఆర్ను హెచ్చరించారు. గతంలో కేసీఆర్ను కరీంనగర్ ప్రజలు తరిమి కొడితే ఈ జిల్లా ప్రజలు ఆదరించారని గుర్తు చేశారు.
తల్లి, చెల్లిని పోషించలేకపోతున్నానని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన శామీర్పేట పరిధిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. బాబాగూడకు చెందిన సంపత్ గౌడ్ (23) హైటెక్ సిటీలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. కాగా చేసిన పనికి 2 నెలలుగా జీతాలు రాకపోవడంతో చేతిలో డబ్బులు లేకపోవడంతో తల్లితో చెప్పుకోలేకపోయాడు. బయటకు వెళ్తున్నట్లు చెల్లికి చెప్పి ఓ పాఠశాల సమీపంలో ఉరేసుకున్నట్లు పోలీసులు చెప్పారు.
Sorry, no posts matched your criteria.