Telangana

News April 19, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి కార్యక్రమాలు

image

✒నేడు పాలమూరుకు CM రేవంత్ రెడ్డి రాక
✒ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న వార్షిక పరీక్షలు
✒SA-2 మార్కులు నమోదు చేయండి:DEOలు
✒వేసవి క్రీడలపై అధికారుల ఫోకస్
✒CM పర్యటనకు భారీ భద్రత:SP హర్షవర్ధన్
✒నేడు నామినేషన్ వెయ్యనున్న ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి,వంశీ చంద్ రెడ్డి,స్వతంత్ర అభ్యర్థులు
✒పలుచోట్ల చలివేంద్రాలు ఏర్పాటు
✒నేడు సివిల్ ర్యాంకర్లకు సన్మానించనున్న CM,జిల్లా నేతలు
✒ఉపాధి హామీ పనులపై అధికారుల నజర్

News April 19, 2024

ఖమ్మం: తగ్గిన మిర్చి, పత్తి ధరలు

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పంటల ధరల వివరాలను మార్కెట్ శాఖ అధికారులు శుక్రవారం ఉదయం వెల్లడించారు. మిర్చి జెండా పాట క్వింట రూ.19500, పత్తి క్వింటా జండా పాట 7150 రూపాయలు ధర పలికినట్లు అధికారులు వెల్లడించారు. నిన్నటి కంటే ఈరోజు భారీగా ధర తగ్గడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిన్నటి కంటే ఈరోజు మిర్చి 500, పత్తి 150 రూపాయలు తగ్గింది.

News April 19, 2024

బీఆర్ఎస్ పరిస్థితి దారుణంగా ఉంది: మంత్రి తుమ్మల

image

పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ప్రస్తుతం దారుణంగా ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీఆర్ఎస్ కు అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. 400 సీట్లు గెలుచుకుంటామంటూ బీజేపీ మ్యాజిక్ చేసే ప్రయత్నం చేస్తోందని రెండు సార్లు ప్రజలను మోసం చేసిన మోదీ మూడోసారి మోసం చేసేందుకు వస్తున్నారని విమర్శించారు.

News April 19, 2024

HYD: గ్రేటర్‌లో 4,053 మెగావాట్ల విద్యుత్ వినియోగం

image

గ్రేటర్‌లో గురువారం రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం నమోదైంది. గతంలో నమోదైన రికార్డులను బ్రేక్ చేస్తూ.. గురువారం ఏకంగా 4,053 మెగావాట్లు నమోదు కావడం విశేషం. 2023 మే 19న అత్యధికంగా 3,756 మెగావాట్లు నమోదు కాగా.. 2024 ఏప్రిల్ 1న 3,832 మెగావాట్లు నమోదైంది. డిస్కం చరిత్రలో ఈ స్థాయిలో విద్యుత్ వినియోగం జరగడం ఇదే తొలిసారి.

News April 19, 2024

NGKL: BJP అభ్యర్థి భరత్ ప్రసాద్ ఆస్తుల వివరాలు

image

నాగర్ కర్నూల్ బీజేపీ అభ్యర్థి పోతుగంటి భరత్ ప్రసాద్ తన కుటుంబానికి రూ.33.85 లక్షల ఆస్తులున్నట్లు అఫిడవిట్‌లో తెలిపారు. ఇందులో రూ.15.86 లక్షల విలువైన స్థిరాస్తులు ఉన్నాయన్నారు. తనపై కేసుల్లేవన్నారు. సొంత కారు లేదని, చేతిలో నగదు రూ.2 లక్షలు ఉన్నాయని, బైక్, 15 తులాల బంగారంతో కలిపి రూ.17.99 లక్షల చరాస్తులు ఉన్నట్లు తెలిపారు. కల్వకుర్తి మండలం గుండూరులో 7.02 ఎకరాల వ్యవసాయ భూమి ఉందన్నారు.

News April 19, 2024

కలెక్టరేట్ ఆవరణలో 144 సెక్షన్ విధింపు

image

లోక్ సభ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ పురస్కరించుకొని కలెక్టర్ కార్యాలయ పరిధిలో 144 సెక్షన్ విధించినట్లు రాచకొండ భువనగిరి జోన్ డీసీపీ రాజేష్ చంద్ర తెలిపారు. రిటర్నింగ్ కార్యాలయం ఏర్పాటు చేసినందున కలెక్టరేట్ ప్రాంగణం బయట 100 మీటర్ల వరకు ఈ నిబంధన వర్తిస్తుందని ఐదుగురు కన్నా ఎక్కువమంది గుమిగూడరాదని ఆయన స్పష్టం చేశారు. ఈనెల 29 వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయన్నారు. 

News April 19, 2024

మంచిర్యాల: వడదెబ్బతో ఒకరి మృతి

image

మంచిర్యాల ఇక్బాల్ అహ్మద్ నగర్‌కు చెందిన ఎలక్ట్రిషియన్ షేక్ పాషా (40) గురువారం వడదెబ్బతో మృతిచెందినట్లు ఎస్సై లక్ష్మణ్ తెలిపారు. మృతుడు కొద్దిరోజులుగా మద్యం తాగుతూ అనారోగ్యానికి గురయ్యాడు. గురువారం ఇంట్లో నుంచి వెళ్లిన అతడిని ఎస్బీఐ బ్యాంకు ముందు ఉన్నట్లు గుర్తించారు .స్థానికులు మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.

News April 19, 2024

KMM: తాటి చెట్టు పైనుంచి పడి గీత కార్మికుడి మృతి

image

తాటి చెట్టు పై నుంచి పడి ఓ గీత కార్మికుడు మృతి చెందిన ఘటన తిరుమలాయపాలెం మండలంలో ఉదయం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పాతర్లపాడుకి చెందిన వెంకన్న(55) కల్లు గీత కార్మికుడు రోజులాగే సమీప గ్రామమైన చంద్రుతండాలో తాడిచెట్టు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి జారి పక్కనే ఉన్న వ్యవసాయ బావిలో పడి చనిపోయాడని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

News April 19, 2024

BJP అభ్యర్థి రఘునందన్‌రావు ఆస్తుల వివరాలు

image

మెదక్ ఎంపీ BJPఅభ్యర్థి రఘునందర్ రావు‌కు రూ.21.07కోట్ల ఆస్తులు ఉన్నట్లు తెలిపారు. చరాస్తులు రూ.9.13కోట్లు, స్థిరాస్తులు రూ.12.94కోట్లుగా చూపించారు. రూ.12.11కోట్లు రుణాలు. 28 కేసులు ఉన్నాయన్నారు. చేతిలో రూ.2.5లక్షల నగదు, బ్యాంకులో రూ.5.2కోట్లు ఉన్నట్లు వెల్లడించారు. వ్యక్తిగత అడ్వాన్సు రూ.3.14కోట్లు ఇచ్చారన్నారు. 14తులాల బంగారం, ఓ నెక్లస్. 46.25ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నట్లు అఫిడవిట్‌లో వెల్లండిచారు.

News April 19, 2024

జనగామ: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

సిద్దిపేట జిల్లా దుద్దెడ టోల్ గేట్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో జనగామ జిల్లా బచ్చన్నపేటకి చెందిన సందేల అశోక్‌ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో అశోక్ అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.