Telangana

News April 19, 2024

ఈటల ఆస్తి రూ.54.01 కోట్లు

image

మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు రూ.54.01 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ఎన్నికల అధికారికి ఇచ్చిన తన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. రూ.20.43 కోట్ల అప్పులు ఉన్నాయని, తనపై 54 కేసులు ఉన్నట్లు చెప్పారు. చేతిలో రూ. లక్ష నగదు, భార్య జమునకు 1.5 కిలోల బంగారు ఆభరణాలు, వివిధ కంపెనీల్లో పెట్టబడులు ఉన్నాయన్నారు. కుటుంబానికి 72.25 ఎకరాల భూమి, పౌల్ట్రీ ఫారాలు, నివాస, వాణిజ్య భవనాలు ఉన్నాయని వెల్లడించారు.

News April 19, 2024

షాకింగ్.. కోదాడలో పశువుల కొవ్వు నుంచి నూనె తయారీ 

image

పశువుల కొవ్వు నుంచి నూనె తయారు చేసిన నూనెను కోదాడలో పోలీసులు పట్టుకున్నారు. 45 లీటర్ల నూనెను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ రాము తెలిపారు. షేక్.యాదుల్ అనే వ్యక్తి మటన్ దుకాణం నడుపుతుంటాడని.. నూనె తయారు చేసి HYDలో అమ్మేందుకు ఇంట్లో డంపు చేయగా పట్టుకున్నామన్నారు.

News April 19, 2024

మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి ఈటల ఆస్తి రూ.54.01 కోట్లు

image

మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు రూ.54.01 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ఎన్నికల అధికారికి ఇచ్చిన తన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. రూ.20.43 కోట్ల అప్పులు ఉన్నాయని, తనపై 54 కేసులు ఉన్నట్లు చెప్పారు. చేతిలో రూ. లక్ష నగదు, భార్య జమునకు 1.5 కిలోల బంగారు ఆభరణాలు, వివిధ కంపెనీల్లో పెట్టబడులు ఉన్నాయన్నారు. కుటుంబానికి 72.25 ఎకరాల భూమి, పౌల్ట్రీ ఫారాలు, నివాస, వాణిజ్య భవనాలు ఉన్నాయని వెల్లడించారు.

News April 19, 2024

మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి ఈటల ఆస్తి రూ.54.01 కోట్లు

image

మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు రూ.54.01 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ఎన్నికల అధికారికి ఇచ్చిన తన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. రూ.20.43 కోట్ల అప్పులు ఉన్నాయని, తనపై 54 కేసులు ఉన్నట్లు చెప్పారు. చేతిలో రూ. లక్ష నగదు, భార్య జమునకు 1.5 కిలోల బంగారు ఆభరణాలు, వివిధ కంపెనీల్లో పెట్టబడులు ఉన్నాయన్నారు. కుటుంబానికి 72.25 ఎకరాల భూమి, పౌల్ట్రీ ఫారాలు, నివాస, వాణిజ్య భవనాలు ఉన్నాయని వెల్లడించారు.

News April 19, 2024

NZB: 17 సార్లు ఎన్నికలు..ఒక్కసారే మహిళకు అవకాశం

image

నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గానికి ఇప్పటివరకు 17 సార్లు ఎన్నికలు జరిగాయి. అయితే ఒక్కసారే మహిళకు అవకాశం లభించింది. 1952 నుంచి 2019 వరకు జరిగిన ఎన్నికల్లో 1967లో మాత్రమే స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. 11 సార్లు కాంగ్రెస్, 3 సార్లు TDP, TRS, BJP ఒకసారి విజయం సాధించాయి. 2014లో TRS అభ్యర్థిగా కవిత ఎన్నికయ్యారు. 2004లో పునర్విభజన అనంతరం జగిత్యాల, కోరుట్లు నియోజకవర్గాలు నిజామాబాద్‌లో వచ్చి చేరాయి.

News April 19, 2024

సంగారెడ్డి: లారీని ఢీకొన్న కారు.. ఇద్దరు మృతి

image

పటాన్‌చెరు మండలం కొల్లూరు ఎగ్జిట్ వద్ద తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కర్ణాటక నుండి హైదరాబాద్‌కు అతివేగంగా వస్తున్న ఓ కారు ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

News April 19, 2024

KTDM: ఎంపీటీసీ దారుణ హత్య

image

కన్నాయిగూడెం ఎంపీటీసీ పర్స బాలకృష్ణ దారుణ హత్యకు గురయ్యారు. శుక్రవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు తలపై బండరాయితో మోది హత్య చేసినట్లు తెలుస్తోంది. స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రాజకీయ కక్షల నేపథ్యంలోని హత్య జరిగినట్లు తెలుస్తుంది.

News April 19, 2024

హైదరాబాద్‌లో పార్డి (కే) డిగ్రీ విద్యార్థి మృతి

image

కుబీర్ మండలంలోని పార్డి(కె) గ్రామానికి చెందిన విద్యార్థి బందెల అజయ్ (18) హైదరాబాదులో ప్రమాదానికి గురై మృతిచెందాడు.. కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. అజయ్ హైదరాబాదులో డిగ్రీ చదువుతున్నాడు.. రెండ్రోజుల క్రితం ఆటోలో ప్రయాణిస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. ఉన్న ఒక్క కొడుకు మృతి చెందడంతో కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి.

News April 19, 2024

BJP అభ్యర్థి డీకే అరుణ ఆస్తుల వివరాలు

image

BJP అభ్యర్థి డీకే అరుణ గురువారం నామినేషన్ దాఖలు చేయగా.. అఫిడవిట్ వివరాలు సమర్పించారు. చరాస్తుల విలువ-రూ.3,21,73,518, స్థిరాస్తులు-రూ.3,10,00,000, బ్యాంకు రుణాలు, ఇతర అప్పులు- లేవు, ప్రస్తుతం దగ్గర ఉన్న నగదు- రూ.1,50,000, అరుణ భర్త భరతసింహారెడ్డి ఆస్తులు: చరాస్తుల విలువ- రూ.23,26,16,353 స్థిరాస్తులు- రూ.37,17,80,000, అప్పులు-1,38,79,619, ప్రస్తుతం ఉన్న నగదు-రూ.20,000,00 ఉన్నట్లు తెలిపారు.

News April 19, 2024

ఆదిలాబాద్: Way2News కథనానికి అధికారుల స్పందన

image

Way2News కథనానికి మున్సిపల్ అధికారులు స్పందించారు. ఈనెల 17న ఆదిలాబాద్ సుభాష్ నగర్ కాలనీలో “మురికి కాలువ శుభ్రం చేసుకుంటున్న యజమానులు” అనే శీర్షికతో వార్త ప్రచురితమయ్యింది. దీంతో మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి పారిశుద్ధ్య కార్మికులతో నాళాలను శుభ్రం చేయించారు. అలగే మున్సిపల్ సానిటరీ ఇన్స్పెక్టర్ నరేందర్ సైతం నాళాలు తీసిన కుటుంబీకులతో మాట్లాడి ఏమైనా సమస్య ఉంటే తనను సంప్రదించాలన్నారు.