Telangana

News April 18, 2024

ADB: తోలి రోజు 2 నామినేషన్‌లు దాఖలు

image

లోక్ సభ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైన విషయం తెలిసిందే. దీంతో గురువారం ఆదిలాబాద్ నియోజకవర్గానికి చెందిన ఇద్దరు నాయకులు నామినేషన్ దాఖలు చేశారు. ఏడీఆర్ పార్టీ తరఫున ఖమ్మం జిల్లాకు చెందిన మాలోతు శ్యామ్ లాల్ నాయక్, స్వతంత్ర అభ్యర్థిగా ఆదిలాబాద్‌కు చెందిన రాథోడ్ సుభాష్ పాలనాధికారి రాజర్షి షాకు నామినేషన్ పత్రాలు అందజేశారు.

News April 18, 2024

KNR: ఇద్దరు ఎస్సైలు, కానిస్టేబుల్స్ సస్పెండ్..!

image

సారంగాపూర్ పీఎస్‌లో ఇద్దరు ఎస్సైలు, ఇద్దరు కానిస్టేబుల్స్ సస్పెండ్ అయ్యారు. గతేడాది ఫిబ్రవరిలో 70 కిలోల గంజాయిని పట్టుకొని పీఎస్ వెనుక ఉంచినట్లు అధికారులు గుర్తించారు. అయితే ఈ నెల 1న దుండగులు ఆ గంజాయిని ఎత్తుకెళ్లారు. వారి నిర్లక్ష్యంపై ఆగ్రహించిన ఉన్నతాధికారులు.. ఈ కేసులో ఎస్సైలు జి.మనోహర్‌రావు, ఎ.తిరుపతితో పాటు.. హెడ్ కానిస్టేబుల్ బి.రవీందర్ రెడ్డి, కానిస్టేబుల్ టి.నరేందర్‌ను సస్పెండ్ చేశారు.

News April 18, 2024

అల్లాదుర్గం: వంశీ క్షేమం.. సెల్ఫీ వీడియోతో కలకలం

image

అల్లాదుర్గం మండలం ముస్లాపూర్ గ్రామానికి చెందిన ఇప్ప <<13078791>>వంశీ క్షేమం<<>>గా ఉన్నట్లు ఎస్సై ప్రవీణ్ రెడ్డి తెలిపారు. బంధువులు, కుటుంబీకులు మోసం చేశారని పేర్కొంటూ.. చనిపోతున్నట్లు సెల్ఫీ వీడియోలను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దాంతో పోలీసులు విచారణ చేపట్టి అల్లాదుర్గం సమీపంలోని అటవీ ప్రాంతంలో వంశీని గుర్తించారు. దీంతో పోలీసులుకు గ్రామస్థులు, కుటుంబీకులు కృతజ్ఞతలు తెలిపారు.

News April 18, 2024

మెదక్: ఎండలతో అల్లాడుతున్న ప్రజలు

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎండల తీవ్రత పెరుగుతోంది. ఉదయం నుంచే వేడి తీవ్రత ఎక్కవగా ఉండగా.. మధ్యాహ్నానికి ఎండ తీవ్రత తారాస్థాయికి చేరుతోంది. దీంతో ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు. రానున్న రోజుల్లో మరింత ఎండలు కాసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని వడదెబ్బకు గురికాకుండా జాగ్రత్తలు పడాలని వైద్యులు చెబుతున్నారు.

News April 18, 2024

బీఫామ్ అందుకున్న మల్కాజ్గిరి బీఆర్ఎస్ అభ్యర్థి

image

మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న రాగి లక్ష్మారెడ్డి ఇవాళ తెలంగాణ భవన్ నందు గులాబీ అధినేత సీఎం కేసీఆర్ చేతుల మీదుగా బీఫామ్ అందుకున్నారు. మల్కాజ్గిరి గడ్డపై గులాబీ జెండా ఎగరవేస్తామని లక్ష్మారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ కార్య నిర్వాహక అధ్యక్షులు కేటీఆర్, ఎమ్మెల్యేలు చామకూర మల్లారెడ్డి, బండారి లక్ష్మారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి ఉన్నారు.

News April 18, 2024

బీఫామ్ అందుకున్న మల్కాజ్గిరి బీఆర్ఎస్ అభ్యర్థి

image

మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న రాగి లక్ష్మారెడ్డి ఇవాళ తెలంగాణ భవన్ నందు గులాబీ అధినేత సీఎం కేసీఆర్ చేతుల మీదుగా బీఫామ్ అందుకున్నారు. మల్కాజ్గిరి గడ్డపై గులాబీ జెండా ఎగరవేస్తామని లక్ష్మారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ కార్య నిర్వాహక అధ్యక్షులు కేటీఆర్, ఎమ్మెల్యేలు చామకూర మల్లారెడ్డి, బండారి లక్ష్మారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి ఉన్నారు.

News April 18, 2024

HYD: రేప్ కేసులో మైనర్ బాలునికి జైలు శిక్ష

image

ఆమనగల్లు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రేప్ కేసులో మైనర్ బాలుడి(17)కి గురువారం రంగారెడ్డి జిల్లా జువైనల్ కోర్టు జడ్జి ఒక సంవత్సరం జైలు శిక్ష, రూ.4వేల జరిమానా విధించినట్లు ఎస్సై బలరాం చెప్పారు. 2018లో జరిగిన ఘటనలో కేసు విచారణలో భాగంగా జైలు శిక్ష, జరిమానా విధించినట్లు ఎస్సై వివరించారు. నేరంపై వెంటనే స్పందించి సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టిన పోలీసులను అధికారులు అభినందించారు.

News April 18, 2024

ఆమనగల్లు: రేప్ కేసులో మైనర్ బాలునికి జైలు శిక్ష

image

ఆమనగల్లు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రేప్ కేసులో మైనర్ బాలుడి(17)కి గురువారం రంగారెడ్డి జిల్లా జువైనల్ కోర్టు జడ్జి ఒక సంవత్సరం జైలు శిక్ష, రూ.4వేల జరిమానా విధించినట్లు ఎస్సై బలరాం చెప్పారు. 2018లో జరిగిన ఘటనలో కేసు విచారణలో భాగంగా జైలు శిక్ష, జరిమానా విధించినట్లు ఎస్సై వివరించారు. నేరంపై వెంటనే స్పందించి సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టిన పోలీసులను అధికారులు అభినందించారు.

News April 18, 2024

నిజామాబాద్ జిల్లాలో ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు సస్పెండ్

image

నిజామాబాద్ జిల్లాలో ఇద్దరు సీఐలను సస్పెండ్ చేస్తూ ఐజీ రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు. పట్టణానికి చెందిన సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ రమేశ్ మద్యం తాగి సిబ్బందితో దురుసుగా ప్రవర్తించినందుకు ఆయన్ను సస్పెండ్ చేశారు. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ తప్పించుకునేందుకు సహకరించిన సీఐ ప్రేమ్ కుమార్‌ను కూడా సస్పెండ్ చేసినట్లు ప్రకటించారు.

News April 18, 2024

సికింద్రాబాద్: ప్రజలకు నివేదిక అందించిన కిషన్ రెడ్డి

image

ఐదేళ్ల పదవీకాలంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గురువారం ప్రజలకు నివేదిక అందించారు. నగరంలోని బస్తీ దవాఖానాలు, క్రీడా వసతులను మెరుగుపరచడం, మహిళల కోసం నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం వివిధ రూపాల్లో రూ.10 లక్షల కోట్ల నిధులు అందించిందని తెలిపారు. మరోసారి గెలిపిస్తే నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామన్నారు.