Telangana

News April 18, 2024

నా గెలుపును ఎవరూ ఆపలేరు: ఈటల రాజేందర్

image

మల్కాజిగిరి పార్లమెంట్ బరిలో తన గెలుపును ఎవరూ ఆపలేరని BJP అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. నామినేషన్ దాఖలుకు ముందు తన ఇంటి వద్ద ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. మల్కాజిగిరిలో ధర్మానికి, అధర్మానికి జరిగే యుద్ధమే ఈ ఎన్నికలు అని అభివర్ణించారు. కొందరు దొంగ సర్వేలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఈటల ఆరోపించారు.

News April 18, 2024

భద్రాచలం: ఎడారిని తలపిస్తున్న గోదావరి

image

భద్రాద్రిలో గోదావరి ఎడారిని తలపిస్తోంది. కనుచూపు మేరలో ఎక్కడ చూసినా చుక్క నీరు కూడా కనిపించడం లేదు. నిన్న జరిగిన శ్రీరామ నవమి వేడుకలలో ఉమ్మడి తెలుగు రాష్ట్రల నుంచి వేలాది మంది భక్తులు వచ్చారు. వారి కోసం మోటార్లు ద్వారా తాత్కలికంగా ఏర్పాటు చేసిన వాటి కింద భక్తులు స్థానాలు చేశారు.

News April 18, 2024

లింగంపేట్: మురికి కాలువలో పసికందు మృతదేహం

image

కామారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. లింగంపేట మండలం ఐలాపూర్ గ్రామంలో మురికి కాలువలో పసికందు మృతదేహం కలకలం రేపింది. ఇవాళ ఉదయం గ్రామస్థులు పసికందు మృతదేహన్ని మురికి కాలువలో గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 18, 2024

అభ్యర్థుల నామినేషన్స్ ప్రక్రియ సందర్భంగా నిఘా: ఎస్పీ

image

పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియలో భాగంగా జిల్లాలో రాజకీయ పార్టీ అభ్యర్థులు, పార్టీల ప్రతినిధులు, ఎన్నికల నియమావళికి లోబడి నడుచుకోవాలని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే తెలిపారు. అనుమతులు లేకుండా ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించకూడదని హెచ్చరించారు. నామినేషన్ల కేంద్రాలు నల్గొండ జిల్లాలో ఉన్నప్పటికీ జిల్లా వ్యాప్తంగా నిఘా కట్టుదిట్టం చేశామని తెలిపారు.

News April 18, 2024

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పంటల ధరల వివరాలు

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పంటల ధరల వివరాలను మార్కెట్ శాఖ అధికారులు గురువారం ఉదయం వెల్లడించారు. మిర్చి క్వింటా జండా పాట రూ.20,000, పత్తి జెండా పాట క్వింటా రూ.7200 పలికినట్లు అధికారులు వెల్లడించారు. పత్తి, మిర్చికి మంచి ధర పలుకుతుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం సెలవు ఉండడంతో ఈరోజు పంట మార్కెట్ కు పెద్ద ఎత్తున వచ్చింది.

News April 18, 2024

MNCL: ఆర్టీసీ బస్టాండ్‌లో గుర్తు తెలియని వ్యక్తి మృతి

image

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో బుధవారం సుమారు 40 ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు సీఐ బన్సీలాల్ తెలిపారు. బస్టాండ్‌లోని ఆసిఫాబాద్‌కు వెళ్లే ప్లాట్ ఫామ్ వద్ద మరణించిన మృతుని వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదని పేర్కొన్నారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీ గదిలో భద్రపరిచామని, వివరాలు తెలిసిన వారు పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని సూచించారు.

News April 18, 2024

లోక్‌సభ ఎలక్షన్స్.. భువనగిరి బీ ఫామ్ అందజేత

image

ధర్మ సమాజ్ పార్టీ నుంచి భువనగిరి పార్లమెంటు అభ్యర్థిగా కొంగరి లింగస్వామి పోటీ చేయనున్నారు. ఆ పార్టీ అధినేత డాక్టర్ విశారదన్ మహరాజ్ ఆయనకు పార్లమెంటు టికెట్ కేటాయిస్తూ బీ ఫామ్ అందించారు. లింగస్వామి స్వగ్రామం సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాక గ్రామం. టికెట్ కేటాయించడంతో పలువురు ఆయనకు అభినందనలు తెలుపుతున్నారు.

News April 18, 2024

రేపే మంచి ముహూర్తం.. సిద్ధమవుతున్న నాయకులు

image

ఈరోజు నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో పెద్దపల్లి పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్న ప్రధాన పార్టీల MP అభ్యర్థులు సిద్ధంగా ఉన్నారు. రేపు (శుక్రవారం) ముగ్గురు అభ్యర్థులు మొదటి సెట్టు నామినేషన్ వేయనున్నారు. కాంగ్రెస్-వంశీకృష్ణ, BRS-కొప్పుల ఈశ్వర్, BJP-గోమాస శ్రీనివాస్ సిద్ధమయ్యారు. తర్వాత మరో మారు అట్టహాసంగా నామినేషన్ వేయనున్నారు.

News April 18, 2024

కొత్తగూడెం: పిడుగు పడి కొబ్బరి చెట్టు దగ్ధం

image

బయ్యారం మండలంలో బుధవారం సాయంత్రం ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాలులు బలంగా వీచాయి. చిన్నపాటి వర్షం పడింది. కొయ్యగూడెం గ్రామ పంచాయతీలోని చుంచు బంధంతండాలో ఉరుములకు కొబ్బరి చెట్టుపై పిడుగు పడి కాలిపోయింది. పిడుగు పడిన ప్రాంతంలో ఆ సమయాన ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు.

News April 18, 2024

నామ పత్రాల సమర్పణకు సర్వం సిద్ధం!

image

ఉమ్మడి జిల్లాలోని MBNR, NGKL లోక్‌సభ పరిధిలో గురువారం నుంచి నామపత్రాల స్వీకరణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.ఈ నెల 18 నుంచి 25 వరకు నామినేషన్లు తీసుకుంటారు. 21న ఆదివారం సెలవు. ఉదయం 11 గం. నుంచి మధ్యాహ్నం 3 గం. వరకు నామినేషన్లు సమర్పించవచ్చు. అభ్యర్థి వెంట ఐదుగురు మాత్రమే లోపలికి వెళ్లాలి. నామపత్రాలు సమర్పించే అభ్యర్థులు రూ.25 వేలు,SC,ST అభ్యర్థులు రూ.12,500 డిపాజిట్ సమర్పించాల్సి ఉంటుంది.