India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాగల 3 రోజులు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈనెల 20 నుంచి 23 వరకు కొన్ని చోట్ల అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. వేడికి సంబంధించి ఎల్లో అలర్ట్ పరిధిలో ఉన్నామని ఆయా జిల్లాల కలెక్టర్లు తెలిపారు. అవసరమైతేనే బయటికి వెళ్లాలని, శిశువులు, పిల్లలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు పలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
ఉమ్మడి జిల్లాలో మూగజీవాలకు పశువైద్యం అందని ద్రాక్షలా మారింది. పశువైద్యశాలల్లో సిబ్బంది కొరతతో పాటు సరిపడా వసతులు లేక పశువులకు సరైన వైద్యం అందడం లేదు. NLG, SRPT, యాదాద్రి BNG జిల్లాల్లోని పశువైద్యశాలల్లో గడిచిన పదేళ్ల కాలంగా ఖాళీ పోస్టులు భర్తీకి నోచుకోకపోవడం లేదు. దీంతో మూగజీవాలకు సరైన వైద్యం అందక మృత్యువాత పడుతున్నాయి. సీజనల్ వ్యాధుల ప్రబలి పశువులు మృతి చెందుతున్నా పట్టించుకునే పరిస్థితి లేదు.
కాసిపేట మండలం కోమటిచేనుకి చెందిన <<13074826>>మౌనిక విద్యుత్ షాక్తో<<>> మృతి చెందింది. కాగా విద్యుదాఘాతానికి రేకులపై పడిపోయిన తల్లిని ఆమె నాలుగేళ్ల కుమారుడు గౌతమ్ చూశాడు. వెంటనే పెద్దనాన్నకు సమాచారం అందించాడు. వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేసి మౌనికకు కిందికి తీసుకురాగా అప్పటికే మృతి చెందిందని 108 సిబ్బంది తెలిపారు. తన తల్లిని కాపాడాలని 108 సిబ్బందిని వేడుకుంటున్న గౌతమ్ని చూసి గ్రామస్థులు కంటతడి పెట్టారు.
ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నాటి నుంచి ఇప్పటివరకు ఎన్ఫోర్స్మెంట్ బృందాల తనిఖీల్లో రూ.14,31,65,540 నగదు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. రూ.2,00,13,088 విలువైన ఇతర వస్తువులు, 20,441.89 లీటర్ల మద్యాన్ని సీజ్ చేశామన్నారు. 185 మందిపై కేసులు నమోదు చేయగా, 181 మందిని అరెస్టు చేసినట్లు రోనాల్డ్ రాస్ వివరించారు.
ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నాటి నుంచి ఇప్పటివరకు ఎన్ఫోర్స్మెంట్ బృందాల తనిఖీల్లో రూ.14,31,65,540 నగదు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. రూ.2,00,13,088 విలువైన ఇతర వస్తువులు, 20,441.89 లీటర్ల మద్యాన్ని సీజ్ చేశామన్నారు. 185 మందిపై కేసులు నమోదు చేయగా, 181 మందిని అరెస్టు చేసినట్లు రోనాల్డ్ రాస్ వివరించారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎండల వల్ల తీవ్రతరం అయ్యాయి. దీంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరాయి. కాగా వాతావరణశాఖ ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. మధ్యాహ్నం 12 గంటలు దాటితే ప్రధాన రహదారులు, కూడళ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. అవసరం అయితేనే తప్ప బయటకు రావద్దని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
డోర్నకల్- గద్వాల్ వరకు నూతనంగా నిర్మించనున్న రైలు మార్గం నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం మీదుగా వెళ్లనుంది. మండలంలోని పలు గ్రామాల్లో రైలు మార్గానికి సర్వే చేస్తున్నారు. నల్గొండ నుంచి మర్రిగూడ మండలం మీదుగా చింతపల్లి మండలం వైపు రైలు మార్గానికి అధికారులు, సిబ్బంది సర్వే చేస్తున్నారు. దీంతో రైలు వెళ్లనున్న గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కాసిపేట మండలంలోని కోమటిచేనుకు చెందిన బెడ్డల మౌనిక అనే మహిళ బుధవారం విద్యుత్ షాక్ తో మృతి చెందింది. వాటర్ ట్యాంకులో నీటిని పరిశీలించేందుకు ఇంటిపైకి ఎక్కగా తెగిపోయిన విద్యుత్ వైరు ఇనుప రేకులకు తాకింది. మౌనిక వాటిని తాకడంతో విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఎస్సై ప్రవీణ్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జిల్లాలో ఎండ తీవ్రత పెరుగుతోంది. బుధవారం ఏకంగా 44.2 డిగ్రీలకు చేరింది. జిల్లాలోని ముదిగొండ మండలం పమ్మిలో గరిష్టంగా 44.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం 8గంటలకే ఎండ మొదలై పది గంటల తర్వాత బయటకు రాలేని పరిస్థితి ఉంటోంది. కాగా, ఖమ్మంలో 43.9, కూసుమంచిలో 43.7, కల్లూరులో 43.6, నేలకొండపల్లిలో 43.5, తల్లాడ, తిరుమలాయపాలెంల్లో 43.3, తిమ్మారావుపేటలో 43.2, చింతకాని 43.1, సత్తుపల్లిలో 42డిగ్రీల మేర నమోదైంది.
లోక్ సభ ఎన్నికల బరిలో పోటీ చేస్తున్న జీవన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్లకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. జీవన్ రెడ్డి ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ఓసారి ఎమ్మెల్సీగా గెలిచారు. ఉమ్మడి రాష్ట్రంలో 3సార్లు మంత్రిగా పనిచేశారు. ఇక ఈశ్వర్ 6 సార్లు (మేడారం నుంచి రెండు, ధర్మపురి నుంచి నాలుగు సార్లు) గెలిచి చీఫ్ విప్గా, మంత్రిగా పనిచేశారు. మరి ఇంత అనుభవం ఉన్న వీరివురూ ఈసారి ఎన్నికల్లో సత్తా చాటుతారా..? కామెంట్ చేయండి.
Sorry, no posts matched your criteria.