India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మాజీ సర్పంచి విడుదల చేసిన ఓ ప్రకటన సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపురంకి చెందిన మాజీ సర్పంచి శ్రీధర్ రూ.15 లక్షల అప్పు చేసి RWS అధికారులు, పంచాయితీ తీర్మానంతో గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ బాగుచేయించాడు. అయితే తన పదవీకాలం ముగిసినా MB రికార్డు చేయలేదని, అధికారులు పట్టించుకోవడంలేదన్నారు. ‘బిల్లులు ఇవ్వకపోతే సూపైడ్ చేసుకుంటానంటూ’ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
నేటి నుంచి 25 వరకు ప్రతి రోజు ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కలెక్టరేట్ లోని తన ఛాంబర్లో పార్లమెంట్ ఎన్నికల నామినేషన్లు స్వీకరిస్తామని నిజామాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఏప్రిల్ 26న నామినేషన్ల స్క్రూటినీ, ఏప్రిల్ 29 మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు చివరి గడువు ఉంటుందని, మే 13న పోలింగ్, జూన్ 4 న కౌంటింగ్ జరుగుతుందన్నారు.
ఉరివేసుకొని యువతి మృతి చెందిన ఘటన కనగల్ మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు వివరాల ప్రకారం.. పర్వతగిరికి చెందిన చెనగోని కావ్య అనే యువతి రెండు సంవత్సరాలుగా ఫిట్స్ వ్యాధితో బాధపడుతుంది. తీవ్ర మనోవేదనకు గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరి వేసుకుని చనిపోయింది. తల్లి చెనగోని లక్ష్మమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
గుండెపోటుతో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
కొత్తగూడెం జిల్లా వెంకటాపురం మండల పరిధిలోని వీఆర్కేపురం ఎంపీపీ పాఠశాలలో హెచ్ఎంగా విధులు నిర్వహిస్తున్న శేషాచలం బుధవారం చాతిలో నొప్పితో ఒక్కసారిగా కుప్ప కూలిపోయాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. శేషాచలం మృతికి పలువురు సంతాపం తెలిపారు.
భార్య, అత్త కలిసి దాడి చేశారని ఓ అల్లుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఎస్సై సురేష్ వివరాలు.. అమరచింత మండలం చంద్రఘడ్ గ్రామానికి చెందిన చెన్నారెడ్డి తన భార్యతో మంగళవారం రాత్రి గొడవ పడగా ఆమె కోపంతో తల్లిదండ్రుల గ్రామమైన పామిరెడ్డిపల్లికి వెళ్లిపోయింది. అత్తమామల వద్దే ఉంటున్న తన భార్యను కాపురానికి రమ్మని పిలవడానికి వెళ్తే ఆగ్రహంతో అత్త, భార్య కలిసి దాడి చేశారని బుధవారం ఫిర్యాదు చేశారన్నారు.
పార్లమెంట్ ఎన్నికల సమరానికి శంఖారావం పూరించే సమయం ఆసన్నమైంది. నేటి నుంచి ఈ నెల 25 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో 17,01573 ఓటర్లున్నారు. 936 ప్రదేశాల్లో 1807 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. దివ్యాంగులు, 85 ఏళ్లు నిండిన వారు ఇంటి వద్దే ఓటు హక్కు వినియోగించుకొనేందుకు 12- డీ ఫారాలు ఇప్పటికే ఇచ్చారు. వీటిని 22వ తేదీ నాటికి తిరిగి బీఎల్వోలకు అందించాలి.
BJP అభ్యర్థి డీకే అరుణ నేడు నామపత్రాలు సమర్పించనుండగా కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. గడియారం చౌరస్తా కూడలిలో సభ ఏర్పాటు చేయనున్నారు. NGKL లోక్సభ నియోజకవర్గ పరిధిలో గురువారం బీజేపీ అభ్యర్థి భరత్ ప్రసాద్, కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి నామపత్రాలు దాఖలు చేయనున్నారు. BJP అభ్యర్థి భరత్ ప్రసాద్ 25న రెండోసారి వేసే నామినేషన్ కు గుజరాత్ సీఎం భూపేంద్ర పాటిల్ హాజరుకానున్నారు.
పార్లమెంట్ ఎన్నికల సమరానికి సమయం ఆసన్నమైంది. ఏడు శాసనసభ స్థానాలతో విస్తరించిన ADB పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఫిబ్రవరి 8న విడుదల ఓటరు జాబితా ప్రకారం మొత్తం 16,44,715 మంది ఓటర్లున్నారు. ఇందులో 2,57,248 మంది ఓటర్లతో నిర్మల్ మొదటిస్థానంలో ఉంటే 2,10,915 ఓటర్లతో బోథ్ నియోజకవర్గం చివరిస్థానంలో ఉంది. ADB కలెక్టరేట్ ఆవరణలో నేటి నుంచి ప్రారంభం కానున్న నామపత్రాల స్వీకరణ ఈ నెల 25తో ముగియనుంది.
క్రిస్టియనపల్లిలో ఎంవీఎస్ ప్రభుత్వ కళాశాలలో నేడు మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ పద్మావతి తెలిపారు.HYD మ్యూజిక్ బస్ ఫౌండేషన్,MVS కళాశాల సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ మేళాకు మెడ్ ప్లస్, అపోలో,క్రోబాన్ ఐసీఐసీఐ బ్యాంక్,వీఎన్ ఫెర్టిలైజర్స్,స్పందన స్ఫూర్తి,ముత్తూట్ ఫైనాన్స్ తదితర అనేక కంపెనీల ప్రతినిధులు,హెచ్వీడీలు హాజరవుతారని తెలిపారు. ప్రతి ఒక్కరు తమ బయోడేటా ఫార్మ్స్ తో హాజరు కావాలన్నారు.
HYDలో జనవరి 2023 నుంచి ఇప్పటివరకు ఓటర్ల జాబితాను సవరించినట్లు జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ తెలిపారు. 5 లక్షలకు పైగా ఓట్లను తొలగించారు.
తొలగించిన ఓట్ల వివరాలు:
వేరే ప్రాంతాలకు వెళ్లిన ఓట్లు: 4,39,801
డూప్లికేట్ ఓట్లు: 54,259
మరణించిన వారి ఓట్లు: 47,141.
FEB 8, 2024 వరకు జిల్లాలో మొత్తం 45,70,138 మంది ఓటర్లు ఉన్నారు.
https://voters.eci.gov.in/login ద్వారా చెక్ చేసుకోవచ్చు.
SHARE IT
Sorry, no posts matched your criteria.