India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నల్గొండ జిల్లా పరిధిలో 28గురుకులాలు, 5 డిగ్రీ కళాశాలలు పనిచేస్తున్నాయి. ఆయా పాఠశాలలు, కళాశాలల్లో వేలాది మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. సిబ్బంది సమన్వయలోపం, నిర్లక్ష్యంతోనే భువనగిరి గురుకుల పాఠశాల విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురైనట్లు ప్రాథమికంగా విచారణలో తేలడంతో ప్రిన్సిపల్ శ్రీరాముల శ్రీనివాస్ను సంస్థ కార్యదర్శి సీతాలక్ష్మి సస్పెండ్ చేయడంపై ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది.
కోటగిరి మండలం లింగాపూర్కి చెందిన నీరడి సాయిలు (45) అనే వ్యక్తి బీర్కూర్ అంగడిలో కూరగాయలు తీసుకుని బైక్ పై స్వగ్రామానికి వెళ్తున్నారు. బైరాపూర్ గేట్ వద్ద సాయిలు తన బైక్తో ముందున్న మరో బైక్ను ఢీకొట్టాడు. దీంతో కిందపడ్డ సాయిలుకు తలకు తీవ్రగాయమైంది. చికిత్స నిమిత్తం 108లో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో సాయిలు మృతిచెందారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు.
పాలమూరు నుంచి UPSCలో 3వ ర్యాంకు సాధించిన అనన్యరెడ్డి, 278వ ర్యాంకు పొందిన ఎహతేదా ముఫసిర్(ఆత్మకూర్) ఇద్దరూ తాతయ్యలో స్ఫూర్తితోనే సివిల్స్ కొట్టారు. ఇద్దరూ దిల్లీలోనే డిగ్రీ చదవడం విశేషం. అనన్యరెడ్డి దిల్లీ యూనివర్సిటీలోని మిరిండా హౌజ్లో, ఎహతేదా ముఫసిర్ ఢిల్లీలోని శ్రీరాం కళాశాలలో బీఏలో డిగ్రీ పూర్తి చేశారు. కాగా వీరిద్దరూ ఎలాంటి కోచింగ్ లేకుండా విజయం సాధించారు.
కాళ్లకల్లో ప్రతి ఆదివారం ఎల్లారెడ్డి కుంట వద్ద సంత జరుగుతుంది. రోడ్డు ఇరుకుగా ఉండటంతో జనం రద్దీగా ఉంటుంది. దొంగలు అదును చూసి చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఎల్లారెడ్డి కుంట సంతలో ప్రతీ వారం 10 వరకు సెల్ఫోన్లు, బంగారు ఆభరణాలు చోరీకి గురవుతున్నాయి. ఉమ్మడి జిల్లాలోని ఇతర సంతలోని ఇదే పరిస్థితి. వీటిపై పోలీసులు నిఘా పెంచాలని ప్రజలు కోరుతున్నారు. ఈ పరిస్థితిలో ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.
HYD, సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి MP ఎన్నికలు, కంటోన్మెంట్ ఉప ఎన్నిక ప్రశాంత వాతావరణంలో జరిగేలా సహకరించాలని అధికారులు సూచిస్తున్నారు.
అభ్యర్థులు నామినేషన్ వేసే కేంద్రాలు:
HYD లోక్సభ: హైదరాబాద్ కలెక్టరేట్
SEC లోక్సభ: సికింద్రాబాద్ జోనల్ ఆఫీస్
మల్కాజిగిరి: మేడ్చల్ కలెక్టరేట్
చేవెళ్ల: రాజేంద్రనగర్ RDO ఆఫీస్
కంటోన్మెంట్: CNT CEO (రిటర్నింగ్ అధికారి)
నేటి నుంచి 25 వరకు స్వీకరిస్తారు.
నల్గొండలో జరిగిన రోడ్డుప్రమాదంలో సినీ నటుడు రఘుబాబు కారు తగిలి <<13072708>>బీఆర్ఎస్ నేత జనార్ధన్ రావు మృతి<<>> చెందిన విషయం తెలిసిందే. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అజాగ్రత్తగా కారు నడిపి రఘుబాబు తన భర్త మృతికి కారణమయ్యారని ఆమె పేర్కొన్నట్లు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్ ఎస్సై నాగరాజు వెల్లడించారు.
HYD, సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి MP ఎన్నికలు, కంటోన్మెంట్ ఉప ఎన్నిక ప్రశాంత వాతావరణంలో జరిగేలా సహకరించాలని అధికారులు సూచిస్తున్నారు.
అభ్యర్థులు నామినేషన్ వేసే కేంద్రాలు:
HYD లోక్సభ: హైదరాబాద్ కలెక్టరేట్
SEC లోక్సభ: సికింద్రాబాద్ జోనల్ ఆఫీస్
మల్కాజిగిరి: మేడ్చల్ కలెక్టరేట్
చేవెళ్ల: రాజేంద్రనగర్ RDO ఆఫీస్
కంటోన్మెంట్: CNT CEO (రిటర్నింగ్ అధికారి)
నేటి నుంచి 25 వరకు స్వీకరిస్తారు.
వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ ఇంటికి బుధవారం రాత్రి బీఆర్ఎస్ నాయకులు వెళ్లారు. పార్టీలో తనకు గుర్తింపు ఇవ్వడం లేదనే అసంతృప్తితో ఉన్నట్లు తెలియడంతో ఖమ్మంలోని ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. పార్టీలో తగిన ప్రాధాన్యం ఉంటుందని హామీ ఇచ్చారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎంపీ నామా, ఎమ్మెల్సీ తాతా మధు, వైరా ఏఎంసీ మోహనరావు ఉన్నారు.
గజ్వేల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ 3వ సంవత్సరం చదువుతున్న NCC కాడెట్ రాజేష్ గత 3 సంవత్సరాల నుండి వరుసగా పర్వతారోహణ చేశారు. NCC శిబిరాల్లో భాగంగా బేసిక్ (బీఎంసి), అడ్వాన్స్డ్ మౌంటెనిరింగ్ (ఏయంసీ), సెర్చ్ అండ్ రెస్క్యూ (యస్ & ఆర్) క్యాంపులను పూర్తి చేసి, అరుదైన అవకాశాన్ని రాజేష్ రాష్ట్రం తరపున వినియోగించుకున్నట్లు కళాశాల NCC ఆఫీసర్ లెఫ్టినెంట్ భవానీ తెలిపారు.
మహబూబ్నగర్, నాగర్ కర్నూల్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థుల పేర్లు ఇప్పటికే ఖరారయ్యాయి. MBNRలో డీకే అరుణ(BJP), వంశీచంద్ రెడ్డి (కాంగ్రెస్), మన్నె శ్రీనివాస్ రెడ్డి (BRS) బరిలో ఉన్నారు. NGKLలో భరత్ ప్రసాద్ (BJP), మల్లు రవి (కాంగ్రెస్), RS ప్రవీణ్ కుమార్ (BRS) పోటీలో ఉన్నారు. నామపత్రాలు సమర్పణకు గెజిట్ నోటిఫికేషన్ నేడు విడుదల కానుండటంతో పాలమూరులో సందడి నెలకొననుంది.
Sorry, no posts matched your criteria.