India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
చారిత్రక సంపదకు పుట్టినిల్లు మన హైదరాబాద్. నగర నిర్మాణ చిహ్నానికి చార్మినార్, 12వ శతాబ్దంలో నిర్మించిన గోల్కొండ కోట, రాజభవనాలకు కేరాఫ్గా చౌమహల్లా ప్యాలెస్, మాల్వాల ప్యాలెస్లు ఉన్నాయి. కళా ప్రపంచంలో సలార్జంగ్ మ్యూజియం ఓ మాస్టర్ పీస్. ట్యాంక్బండ్, కుతుబ్ షాషీ టూంబ్స్, మక్కా మసీద్, తారామతి బరాదారి, తోలి(డమ్రి) మసీద్, పైగా టూంబ్స్, స్పానీష్ మసీద్ HYD చరిత్రకు ఆనవాళ్లు. నేడు World Heritage Day
చారిత్రక సంపదకు పుట్టినిల్లు మన హైదరాబాద్. నగర నిర్మాణ చిహ్నానికి చార్మినార్, 12వ శతాబ్దంలో నిర్మించిన గోల్కొండ కోట, రాజభవనాలకు కేరాఫ్గా చౌమహల్లా ప్యాలెస్, మాల్వాల ప్యాలెస్లు ఉన్నాయి. కళా ప్రపంచంలో సలార్జంగ్ మ్యూజియం ఓ మాస్టర్ పీస్. ట్యాంక్బండ్, కుతుబ్ షాషీ టూంబ్స్, మక్కా మసీద్, తారామతి బరాదారి, తోలి(డమ్రి) మసీద్, పైగా టూంబ్స్, స్పానీష్ మసీద్ HYD చరిత్రకు ఆనవాళ్లు. నేడు World Heritage Day
ఆసిఫాబాద్ మండలం బురుగూడ గ్రామంలో బుధవారం సాయంత్రం 5గంటలకు ఈదురు గాలులకు బురుగూడకి చెందిన వృద్ధురాలు చున్నూబాయి ఎగిరి పడింది.. సాయంత్రం వర్షం వస్తుండడంతో వృద్దురాలు చున్నూబాయి ఇంటి ముందు నిలబడి ఉంది. ఈదురుగాలులు బలంగా వీయడంతో చున్నూబాయి ఎగిరిపడి ముళ్ల కంపలో చిక్కుకుంది. దీంతో ఆమెకు తీవ్రగాయాలయ్యయి. వెంటనే ఆసిఫాబాద్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందన్నారు.
కామారెడ్డి జిల్లాలో బుధవారం భానుడు భగభగ మండాడు. డోంగ్లీలో అత్యధికంగా ఉష్ణోగ్రత నమోదైంది. పొద్దంతా మండే ఎండతో అల్లాడిన జనం రాత్రి కురిసిన వానతో కొంతమేర ఉపశమనం పొందారు. కామారెడ్డి కలెక్టరేట్ ప్రాంతంలో 11 మిల్లీమీటర్లు, బీబీపేటలో 3.5, సదాశివనగర్ లో 3.3, పాతరాజంపేట 3, మాచారెడ్డిలో 1.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కామారెడ్డి జిల్లాలోని మిగితా ప్రాంతాల్లో 41 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత నమోదైంది.
కల్వకుంట్ల కవిత చేసిన పనికి తెలంగాణ ప్రజలకు కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మెదక్లో ఎన్ని కోట్లు ఖర్చు చేసిన బీఆర్ఎస్ గెలవలేదని జోస్యం చెప్పారు. కాగా మంత్రి కోమటిరెడ్డి నల్లగొండలో మాట్లాడుతూ..ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని బీఆర్ఎస్ నేతలు మాట్లాడటం హాస్యాస్పదమని.. మేము గేట్లు తెరిస్తే బీఆర్ఎస్లో ఒక్కరు కూడా మిగలరని అన్నారు.
సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో ఖాళీ సీట్ల భర్తీకి ఈనెల 21న అర్హత పరీక్ష నిర్వహించనున్నట్లు ఎస్సీ గురుకుల విద్యాలయాల సంస్థ మహబూబ్ నగర్ తూర్పు ప్రాంతీయ సమన్వయకర్త విద్యుల్లత తెలిపారు. గురుకులాల్లో 6, 7, 8, 9 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేసేందుకు జారీ చేసిన ప్రకటనతో విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారన్నారు. ఆన్లైన్ లో హాల్ టికెట్లు అందుబాటులో ఉన్నాయన్నారు.
భద్రాద్రిలో బుధవారం సీతారాముల కళ్యాణం కమనీయంగా జరిగింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు భద్రాచలంలో శ్రీరామ పట్టాభిషేకం నిర్వహించనున్నారు. ఈ పట్టాభిషేక సమయాన సకల లోకాల దేవతలు, భక్తులు నేత్రపర్వంగా తిలకించి పులకితులవుతారట. ఈ వేడుకను తిలకించేందుకు తెలంగాణ గవర్నర్ సీపీ. రాధాకృష్ణన్ రానున్నారు. ఇప్పటికే పట్టాభిషేకానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
నగరంలోని HMWSSB, ఇతర ప్రభుత్వ సంస్థలు కలిసి ప్లంబింగ్ టెక్నీషియన్లకు.. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కింద ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. ఏప్రిల్ 22, 24, 25వ తేదీల్లో ట్రైనింగ్ ఉంటుందని వాటర్ బోర్డు తెలిపింది. ఆసక్తిగలవారు https://forms.gle/cpgRCaEqr4UBKaMH7 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎండాకాలం వచ్చిందంటే చాలు ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పట్టణవాసులు ఇంటిల్లిపాది విహారయాత్రలు, సొంతూళ్లకు వెళ్తుంటారు. ప్రతి ఏడాదిలో జరిగే చోరీల కంటే ఈ వేసవి మూడు నెలల వ్యవధిలోని అధిక శాతం జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. అంతర రాష్ట్ర ముఠా సైతం వేసవిని ఆసరాగా చేసుకుంటున్నారు. అందుకే వేసవి వేళ, ఉమ్మడి జిల్లా ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు.
HYD నగరంలో HMWSSB పరిధిలో దాదాపు 13.5 లక్షల మంది వినియోగదారులు ఉండగా కేవలం సుమారు 5 లక్షల వరకు, అంటే 40 శాతానికి తక్కువ మందికి మాత్రమే వాటర్ మీటర్లు ఉండడం గమనార్హం. HMWSSB రికార్డుల ప్రకారం మీటర్లు అంతంత మాత్రమే ఉండటంతో నల్లాలకు మోటర్లు పెట్టి నీటిని లాగేస్తున్నా తెలియని పరిస్థితి. నీటి ఎద్దడికి ఇదొక కారణంగా కనిపిస్తోంది. దీనిపై దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.
Sorry, no posts matched your criteria.