India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నిజామాబాద్ పార్లమెంట్ BRS ఎంపీ అభ్యర్థిగా ఈ నెల 19న మధ్యాహ్నం 12.05 గంటలకు నామినేషన్ దాఖలు చేయనున్నట్లు బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఆర్థిక శాఖ మంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు హాజరు కానున్నారని చెప్పారు. ఈ కార్యక్రమానికి 7 అసెంబ్లీ నియోజకవర్గాల BRS శ్రేణులు హాజరుకావాలని పిలుపునిచ్చారు.
నేటి నుంచి ఎంపీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈనెల 24 వరకు ఉమ్మడి జిల్లాలోని 2 ఎంపీ స్థానాలకు అధికారులు నామినేషన్లు స్వీకరిస్తారు. ఉ. 10 గంటల నుంచి మ. 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరిస్తారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. రిటర్నింగ్ అధికారి ఛాంబర్లోకి అయిదుగురికి మాత్రమే అనుమతి ఉందని పేర్కొన్నారు.
ఉమ్మడి జిల్లాలో లోక్ సభ ఎన్నికలు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్నారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి నామినేషన్ల స్వీకరణ, తుది ఓటరు జాబితా రూపకల్పనపై జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. సిద్దిపేట కలెక్టర్ మనూచౌదరి, అదనపు కలెక్టర్ గరిమా అగ్రవాల్ పాల్గొన్నారు.
నేడు భద్రాద్రిలో మహా పట్టాభిషేకం కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ రానున్నారు. ఈ సందర్భంగా విధులు కేటాయించిన అధికారులు ఉదయం 6 గంటలకే హాజరుకావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల తెలిపారు. గవర్నర్ పర్యటనపై బుధవారం ఐటీసీ విశ్రాంతి భవనంలో రెవెన్యూ, డీఆర్డీఎ, జడ్పీ, పంచాయతీ రాజ్ శాఖల అధికారులతో సమీక్షించారు. గవర్నర్ పర్యటనలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకొవాలని అధికారులను ఆదేశించారు.
పకడ్బందీగా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ చేపట్టాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్నారు. ఎంపీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ, తుది ఓటర్ జాబితా రూపకల్పనపై జిల్లా ఎన్నికల అధికారులతో బుధవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పెండింగ్ ఓటర్ నమోదు దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. సమావేశంలో సిరిసిల్ల అడిషనల్ కలెక్టర్ కిమ్యా నాయక్, ఆర్డిఓలు రమేష్, రాజేశ్వర్ పాల్గొన్నారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ నేడు ప్రారంభం కానుంది. నిన్న శ్రీరామనవమి సందర్భంగా మార్కెట్కు సెలవు ప్రకటించగా..
నేడు మార్కెట్ ఓపెన్ ఉండనుంది. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని రైతులు తగుజాగ్రత్తలు పాటిస్తూ మార్కెట్కు రావాలని, నాణ్యమైన సరుకులు తీసుకొనిరావాలని అధికారులు సూచిస్తున్నారు.
HYD నగరంలో HMWSSB పరిధిలో దాదాపు 13.5 లక్షల మంది వినియోగదారులు ఉండగా కేవలం సుమారు 5 లక్షల వరకు, అంటే 40 శాతానికి తక్కువ మందికి మాత్రమే వాటర్ మీటర్లు ఉండడం గమనార్హం. HMWSSB రికార్డుల ప్రకారం మీటర్లు అంతంత మాత్రమే ఉండటంతో నల్లాలకు మోటర్లు పెట్టి నీటిని లాగేస్తున్నా తెలియని పరిస్థితి. నీటి ఎద్దడికి ఇదొక కారణంగా కనిపిస్తోంది. దీనిపై దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.
పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ చందనా దీప్తి తెలిపారు. సెంట్రల్ ఫోర్స్, అర్ముడ్, సివిల్ ఫోర్స్ తో మూడు అంచెల భద్రత ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఎటువంటి శాంతి భద్రతల సమస్యలు, అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీస్ పరంగా అవసరమైన అన్ని భద్రతా చర్యలు, పటిష్ట బందోబస్త్ ఏర్పాటు చేశామన్నారు.
✓HYD, RR, MDCL, VKB జిల్లాల్లో ఘనంగా శ్రీరామనవమి
✓కూకట్పల్లి: రాములవారికి KTR ప్రత్యేక పూజలు
✓రేపు బీజేపి మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి ఈటల నామినేషన్
✓ప్రయాణికులతో కిక్కిరిసిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్
✓జైశ్రీరామ్ నినాదాలతో దద్దరిల్లిన దూల్ పేట
✓UPSC ఫలితాల్లో సత్తా చాటిన HYD,VKB,RR జిల్లాల అభ్యర్థులు
✓రేపటి నుండి ఎన్నికల నామినేషన్ ప్రక్రియ షురూ
@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వైభవంగా శ్రీరామనవమి వేడుకలు. @ శ్రీరామనవమి వేడుకలలో ప్రభుత్వ విప్ లు ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్. @ సైదాపూర్ మండలంలో అక్రమంగా రవాణా చేస్తున్న 3 ఇసుక ట్రాక్టర్ల పట్టివేత. @ రాయికల్ మండలంలో తమ్మునిపై దాడి చేసిన అన్నపై హత్యాయత్నం కేసు. @ కథలాపూర్ మండలంలో చోరీకి పాల్పడిన నలుగురికి రిమాండ్. @ సివిల్స్ లో సత్తా చాటిన రామడుగు మండల యువకుడికి సన్మానం.
Sorry, no posts matched your criteria.