Telangana

News April 17, 2024

HYD: ఓవైపు ఎండలు.. మరోవైపు వర్షం

image

గ్రేటర్ HYD నగరంలోని అనేక ప్రాంతాల్లో మధ్యాహ్నం ఎండలు దంచి కొడుతూనే, సాయంత్రం పలుచోట్ల వర్షం కురిసింది. HYD జియాగూడ రంగనాథ కమ్యూనిటీ హాల్ వద్ద నేడు 41.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు TSDPS తెలిపింది. మరోవైపు మేడ్చల్, రాజేంద్రనగర్, నార్సింగి, KPHB ప్రాంతాల్లో సాయంత్రం వేళ వర్షం కురిసింది. ప్రస్తుతం ఉప్పల్, హబ్సిగూడ ప్రాంతాల్లోనూ చిరుజల్లులతో కూడిన వర్షం కురుస్తుంది.

News April 17, 2024

కాంగ్రెస్, బీఆర్ఎస్‌ను ప్రజలు నమ్మే స్థితిలో లేరు: డీకే అరుణ

image

పార్లమెంట్ ఎన్నికల్లో అన్నీ స్థానాల్లో బీజేపీ గెలుపు ఖాయమని బీజేపీ జాతీయ అధ్యక్షురాలు, పాలమూరు ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మాయ మాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. అమలుకు సాధ్యం కాని హామీలతో కాంగ్రెస్, గతంలో బీఆర్ఎస్ ప్రజలను నట్టేట ముంచాయని విమర్శించారు. ఈ సారి ఎన్నికల్లో ప్రజలు బీజేపీని గెలిపించాలని కోరారు.

News April 17, 2024

శామీర్పేట: రేపు ఈటల నామినేషన్ ర్యాలీ

image

మల్కాజ్గిరి పార్లమెంటు బీజేపి అభ్యర్థి ఈటల రాజేందర్ రేపు నామినేషన్ వేయనున్నట్లు తెలిపారు. ఓల్డ్ శామీర్పేట నుంచి అంతాయిపల్లిలోని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వరకు నామినేషన్ ర్యాలీ కొనసాగుతుందని, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కేంద్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పాల్గొంటారేన్నారు. కార్యకర్తలు భారీ సంఖ్యలు తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు.

News April 17, 2024

ADB: తొలి ప్రయత్నంలోనే సివిల్స్

image

సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో ఆదిలాబాద్‌కి చెందిన ఆదా వెంకటేష్-వాణి దంపతుల కుమారుడు సందీప్ సత్తా చాటాడు. తొలి ప్రయత్నంలోనే సివిల్స్ లో 830వ ర్యాంకు సంపాదించి ఔరా అనిపించాడు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతోనే ఈ ర్యాంకు సాధించినట్లు సందీప్ తెలిపారు. ఐఏఎస్ కావడమే తన లక్ష్యమన్నారు. కాగా సందీప్ తండ్రి వెంకటేశ్ ఇంటెలిజెన్స్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు.

News April 17, 2024

మాచారెడ్డిలో షార్ట్‌సర్క్యూట్‌‌తో గుడిసె దగ్ధం 

image

మాచారెడ్డి మండలంలోని హెల్పుగొండ గ్రామంలో బుధవారం షార్ట్‌సర్క్యూట్‌‌తో మొగుళ్ల లక్ష్మీకి చెందిన గుడిసె దగ్ధమైనట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదంలో రూ.50వేల వరకు ఆస్తి నష్టం జరిగిందన్నారు. ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు.

News April 17, 2024

దుగ్గొండి: ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

image

ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం గోపాలపురంలో చోటుచేసుకుంది గోపాలపురం గ్రామానికి చెందిన కట్కూరి ప్రమోద్ రెడ్డి (28) గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. పలు ఆసుపత్రిలో చికిత్స పొందినప్పటికీ ఆరోగ్యం కుదుట పడకపోవడంతో బుధవారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

News April 17, 2024

ప్రభుత్వ వైఫల్యాలు ప్రజలకు తెలపాలి: మాజీ మంత్రి

image

ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం, అనేక వైఫల్యాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బుధవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని తమ పార్టీ కార్యాలయంలో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. రైతులను 2 లక్షలు అప్పు తీసుకోవాలని వెంటనే మాఫీ చేస్తామని మాట తప్పారని ధ్వజమెత్తారు. అలాగే వారి వైఫల్యాలను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు చేర్చాలన్నారు.

News April 17, 2024

వికారాబాద్: జిల్లాలో ‘TODAY TOP NEWS’

image

♥UPSCలో ర్యాంకు సాధించిన వారికి.. KTR, పలువురు నేతల అభినందనల వెల్లువ
♥సర్వం సిద్ధం.. రేపటి నుంచి పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం
♥జిల్లాలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు.. పలుచోట్ల శోభాయాత్రలు 
♥పకడ్బందీగా పార్లమెంట్ ఎన్నికలు: అడిషనల్ కలెక్టర్ 
♥VKB: RSP నాకు ఇన్స్పిరేషన్: సివిల్స్ ర్యాంకర్ తరుణ్ కుమార్ 
♥శ్రీరాముడు అందరికీ ఆదర్శప్రాయుడు: స్పీకర్ గడ్డం ప్రసాద్

News April 17, 2024

ఉమ్మడి జిల్లాలో ‘TODAY TOP NEWS’

image

♥UPSCలో ర్యాంకు సాధించిన వారికి..KTR, పలు నేతల అభినందనల వెల్లువ
♥సర్వం సిద్ధం.. రేపటి నుంచి పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం
♥ఉమ్మడి జిల్లాలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు.. పలుచోట్ల శోభాయాత్రలు
♥MBNR:ఎకో పార్కులో యువతి మృతదేహం
♥NGKL:రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
♥NRPT:’డాక్టర్ల నిర్లక్ష్యంతో గర్భిణి మృతి’
♥BSPలో చేరిన మంద జగన్నాథం
♥NGKL:రామాలయంలో దొంగలు.. అదుపులోకి తీసుకున్న పోలీసులు

News April 17, 2024

HYD: వామ్మో.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిస్థితి ఇది!

image

HYD నగరంలోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రయాణికులతో కిక్కిరిసిపోతుంది. వేసవి వేళ HYD నగరంలో నివసిస్తున్న విద్యార్థులు, ఉద్యోగులు, ఇతరులు భారీ సంఖ్యలో ప్రయాణం సాగిస్తుండటంతో ఈ పరిస్థితి ఏర్పడిందని రైల్వే అధికారులు తెలిపారు. పదుల సంఖ్యలో సమ్మర్ స్పెషల్ రైళ్లను నడుపుతున్నప్పటికీ సరిపోవడం లేదు. ప్రస్తుత రద్దీని చూసి, నేడు మరో 10 స్పెషల్ రైళ్లకు SCR అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.