Telangana

News April 17, 2024

రేపు రఘునందన్ నామినేషన్.. పాల్గొననున్న గోవా సీఎం

image

మెదక్ జిల్లా కలెక్టరేట్లో మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు రేపు నామినేషన్ వేయనున్నారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీగా వెళ్లనున్నారని బీజేపీ నాయకులు తెలిపారు. ఈ ర్యాలీలో గోవా సీఎం ప్రమోద్ సావంత్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొంటారని తెలిపారు. కావున బీజేపీ నాయకులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు మెదక్‌కు తరలి రావాలని రఘునందన్ రావు కోరారు.

News April 17, 2024

దర్గాలో శ్రీరాముని కళ్యాణం

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలోని సత్యనారాయణపురంలోని హజరత్ నాగుల్ మీరా దర్గాలో శ్రీరామనవమి వేడుక కన్నుల పండుగగా జరిగింది. మతాలకు అతీతంగా దర్గాలో నిర్వహించిన సీతారాముల కళ్యాణంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. దర్గాలోని మాలిక్ సర్వమతాలకు అతీతంగా రాములవారి కళ్యాణం జరిపించడం పై భక్తులు ఆనందం వ్యక్తం చేశారు.

News April 17, 2024

HYD: కోడి ఈకలతో బయో ప్లాస్టిక్!

image

పర్యావరణానికి హాని కలిగిస్తున్న సింథటిక్ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు HYD తార్నాకలోని IICT కృషి చేస్తుంది. ఇప్పటికే సింథటిక్ ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా వ్యవసాయ వ్యర్థాలతో బయోపాలిమర్లను తయారు చేసిన ఆ సంస్థ, తాజాగా కోడి ఈకలతో బయో ప్లాస్టిక్ రూపొందించడం పై దృష్టి పెట్టినట్లు తెలిపింది. మెడికల్, ఆటోమొబైల్, ప్యాకేజింగ్ అవసరాలకు అనువుగా ఉండేలా తయారీకి కసరత్తు చేస్తుంది.

News April 17, 2024

రోడ్డు ప్రమాదం.. బీఆర్ఎస్ నేత మృతి

image

నల్లగొండ పట్టణ పరిధిలోని పానగల్ బైపాస్ లెప్రసీ కాలనీ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 19వ వార్డుకు చెందిన నల్లగొండ పట్టణ బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ప్రధాన అనుచరుడు సంధినేని జనార్దన్ రావు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 17, 2024

వివిధ బీఈడీ కోర్సుల పరీక్షా ఫలితాల విడుదల

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ బీఈడీ కోర్సుల పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు. బీఈడీ (ఎంఆర్ఐ), బీఈడీ (ఎల్డీ), బీఈడీ (హెచ్ఐ), బీఈడీ (ఏఎస్ఐ) తదితర కోర్సుల సెమిస్టర్ ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు. ఈ ఫలితాలను ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.

News April 17, 2024

ఓయూ పరిధిలోని బీసీఏ పరీక్షా ఫీజు స్వీకరణ

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీసీఏ కోర్సు పరీక్షా ఫీజును స్వీకరించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు. బీసీఏ రెండు, నాలుగు, ఆరో సెమిస్టర్ మెయిన్, అన్ని సెమిస్టర్ల బ్యాక్ లాగ్ పరీక్షా ఫీజును ఈనెల 30లోగా సంబంధిత కళాశాలలో చెల్లించాలని చెప్పారు. ఈ పరీక్షలను వచ్చే నెలలో నిర్వహించనున్నట్లు తెలిపారు.

News April 17, 2024

వివిధ బీఈడీ కోర్సుల పరీక్షా ఫలితాల విడుదల

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ బీఈడీ కోర్సుల పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు. బీఈడీ (ఎంఆర్ఐ), బీఈడీ (ఎల్డీ), బీఈడీ (హెచ్ఐ), బీఈడీ (ఏఎస్ఐ) తదితర కోర్సుల సెమిస్టర్ ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు. ఈ ఫలితాలను ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.

News April 17, 2024

ఓయూ పరిధిలోని బీసీఏ పరీక్షా ఫీజు స్వీకరణ

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీసీఏ కోర్సు పరీక్షా ఫీజును స్వీకరించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు. బీసీఏ రెండు, నాలుగు, ఆరో సెమిస్టర్ మెయిన్, అన్ని సెమిస్టర్ల బ్యాక్ లాగ్ పరీక్షా ఫీజును ఈనెల 30లోగా సంబంధిత కళాశాలలో చెల్లించాలని చెప్పారు. ఈ పరీక్షలను వచ్చే నెలలో నిర్వహించనున్నట్లు తెలిపారు.

News April 17, 2024

కామారెడ్డి: బాల సదనం నుంచి ఇద్దరు బాలికలు అదృశ్యం

image

కామారెడ్డిలోని బాల సదనం నుంచి ఇద్దరు బాలికలు అదృశ్యం అయ్యారు. బాలసదనంలో ఉంటున్న గంగోత్రి (11), నజియా (7) పట్టణంలోని హరిజనవాడలో ఉన్న జడ్పీహెచ్ఎస్‌లో చదువుతున్నారు. నిన్న సదనం నుంచి వెళ్లిన బాలికలు తిరిగి రాలేదని సదనం ఇన్‌ఛార్జ్ గంగుబాయి తెలిపారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News April 17, 2024

HYD: వాహన తనిఖీలు.. నగదు స్వాధీనం

image

శంషాబాద్ మండలం పాలమాకుల వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో కారులో తరలిస్తున్న రూ.5 లక్షల 35 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. నిస్సాన్ కారులో హైదరాబాద్ నుంచి షాద్ నగర్ వైపు వెళ్తున్న రంజిత్ గౌడ్ అనే వ్యక్తి వద్ద స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగదుకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో సీజ్ చేశారు.