India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
శంషాబాద్ మండలం పాలమాకుల వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో కారులో తరలిస్తున్న రూ.5 లక్షల 35 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. నిస్సాన్ కారులో హైదరాబాద్ నుంచి షాద్ నగర్ వైపు వెళ్తున్న రంజిత్ గౌడ్ అనే వ్యక్తి వద్ద స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగదుకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో సీజ్ చేశారు.
మల్కాజ్గిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు యునైటెడ్ హైదరాబాద్ ఫ్రంట్ తమిళ్స్ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఎంపీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. తమిళ్ భవన్ కోసం ఎన్నో సార్లు BRS ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా.. పట్టించుకోలేదని, యునైటెడ్ HYD తమిళ్ ఫ్రంట్ అధ్యక్షులు సాయి కాంత్ అన్నట్లుగా తెలియజేశారు.
శ్రీరాముడు అందరికీ ఆదర్శప్రాయుడని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలియజేశారు. లంగర్ హౌస్లోని త్రివేణి సంగమం ఆలయంలో నిర్వహించిన శ్రీరామనవమి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతారాములను దర్శించుకున్నారు. అనంతరం ఆలయ పీఠాధిపతి రాహుల్ దాస్ బాబా ఆయనకు వేద ఆశీర్వచనం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. శ్రీరాముని అడుగుజాడల్లో నడవాల్సిన అవసరం ఉందన్నారు.
శ్రీరాముడు అందరికీ ఆదర్శప్రాయుడని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలియజేశారు. లంగర్ హౌస్లోని త్రివేణి సంగమం ఆలయంలో నిర్వహించిన శ్రీరామనవమి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతారాములను దర్శించుకున్నారు. అనంతరం ఆలయ పీఠాధిపతి రాహుల్ దాస్ బాబా ఆయనకు వేద ఆశీర్వచనం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. శ్రీరాముని అడుగుజాడల్లో నడవాల్సిన అవసరం ఉందన్నారు.
పెద్దపల్లి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగలనున్నట్లు తెలుస్తోంది. పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరనున్నట్లు తెలిసింది. పెద్దపల్లి ఎంపీ టికెట్ ఆశించిన వెంకటేష్ నేతకు కాంగ్రెస్లోనూ మొండిచేయి చూపడంతో ఇప్పుడు బీజేపీలో చేరనున్నట్లు సమాచారం. ఇప్పటికే బీజేపీ అభ్యర్థిగా గోమాస శ్రీనివాస్ పేరును ప్రకటించిన బీజేపీ.. వెంకటేష్ నేత చేరితే టికెట్ మార్చే అవకాశం ఉందని టాక్.
తిమ్మాజిపేట మండలం గోరిటలో దారుణం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఎండీ అజీద్, అదే గ్రామానికి చెందిన ఎండీ మతీన్, ఎండి అఫీజ్ల మధ్య భూ తగాదాలు ఉన్నాయి. గత రెండు రోజుల క్రితం దాడి చేయగా బాధితుడు అజీజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మాపైనే ఫిర్యాదు చేస్తావా అంటూ ఏకంగా కారుతో ఢీ కొట్టి కర్రలతో విచక్షణా రహితంగా దాడికి దిగి హత్యకు యత్నించారు. గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలించారు.
గద్వాల్ పట్టణానికి చెందిన శ్రీ రామకోటి భక్త సమాజం సంస్థ ఆధ్వర్యంలో 25 కోట్ల లిఖిత శ్రీరామ నామాలతో సీతారాములకు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. సంస్థ అధ్యక్షులు రామకోటి రామారాజు అద్దాల మందిరం వద్ద రామనామస్మరణతో ప్రాంగణం మారుమోగింది. ఈ సందర్భంగా రామనామ స్మరణ చేస్తే ఆనందం లభిస్తుందని రామకోటి రామరాజు పేర్కొన్నారు.
అత్తమామల వేధింపులు తట్టుకోలేక ఓ మహిళ మండుటెండలో ఇంటి ముందు నిరసన దీక్ష చేపట్టింది. ఈ సంఘటన బోనకల్ మండల కేంద్రంలో జరిగింది. స్థానికంగా నివాసం ఉంటున్న మహిళ తన అత్తమామలు మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారని అంతేకాకుండా తలపై దిండుపెట్టి హత్యాయత్నం చేశారని ఆరోపిస్తూ నిరసన చేపట్టింది. న్యాయం జరగే వరకు ఇంటి ముందు నుంచి కదలనని ఆవేదన వ్యక్తం చేసింది.
వ్యవసాయ కుటుంబం నుంచి IASగా నిలిచి తల్లిదండ్రుల కష్టాన్ని సగర్వంగా నిలిచేలా చేశాడు. వైఫల్యాలు వెక్కిరించినా ఐదో ప్రయత్నంలో IAS సాధించాడు కొండపాకకు చెందిన అఖిల్. తండ్రి నరేష్ వ్యవసాయం చేస్తూ పెద్ద కొడుకు అఖిల్ను ఉన్నత చదువులు చదివించాడు. 2018లో ఇంజనీరింగ్ అయిపోగానే ఇంటి నుంచే సివిల్స్కు ప్రిపేర్ అయి 2019,20, 22లో నిరాశ ఎదురైనా 2021లో IPS సాధించాడు. 2023లో IAS సాధించి లక్ష్యాన్ని ముద్దాడాడు.
ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన మేడ్చల్ PS పరిధి రైల్వే కాలనీలోని ఓ వెంచర్లో జరిగింది. కుళ్లిపోయిన మహిళ మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలంలో ఉన్న ఆధారాలను సేకరించి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మహిళ వయసు సుమారు 45 నుండి 50 ఉంటుందని భావిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.