India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఓరుగల్లులోని చూడదగ్గ పర్యాటక ప్రాంతాల్లో ఖిలా వరంగల్ ఒకటి. ఇక్కడ చూసేందుకు అనేక ప్రదేశాలు ఉన్నప్పటికీ ఖుష్ మహల్ ప్రత్యేకం. 14వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఖుష్ మహల్ తుగ్లక్ పాలన కాలంలో నిర్మించారు. ఈ నిర్మాణంపై ఇప్పటికీ తుగ్లక్ నిర్మాణ శైలి జాడలు కనిపిస్తాయి. ఢిల్లీలోని ఘియాత్ అల్ దిన్ తుగ్లక్ సమాధి, ఖుష్ మహల్ మధ్య నిర్మాణ సారూప్యత ఉందని చరిత్రకారులు చెబుతుంటారు. ఈ కట్టడాన్ని చూసారా.. కామెంట్ చేయండి.
భూమి కలిగిన ప్రతి రైతుకు ఆధార్ కార్డు తరహాలో ‘భూధార్’ కార్డు ఇవ్వనున్నట్లు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. గురువారం ఏర్గట్ల మండలం బట్టాపూర్లో భూభారతి నూతన చట్టంపై రైతులకు అవగాహన కల్పించి మాట్లాడారు. ఇది వరకు ధరణిలో రికార్డుల నిర్వహణ లేదని, ఇప్పుడు రికార్డుల నిర్వహణ ఉంటుందని చెప్పారు.
ఆర్టీసీ బస్సుల రాకపోకల వివరాల కోసం ప్రత్యేకంగా సేవలు అందుబాటులోకి వచ్చాయి. నిజామాబాద్ రీజియన్లో ఆర్టీసీ ప్రయాణికులు బస్సుల రాకపోకల వివరాలు తెలుసుకునేందుకు ఫోన్ నంబర్లను ఏర్పాటు చేసినట్లు ఆర్ఎం జ్యోత్స్న పేర్కొన్నారు. ఆర్మూర్-73828 43133, నిజామాబాద్-99592 26022, కామారెడ్డి-73828 43747, బోధన్-98495 00725, బాన్సువాడ-94911 05706 నంబర్లకు ఫోన్చేసి బస్సుల వివరాలు తెలుసుకోవచ్చన్నారు.
మెదక్ సీనియర్ సివిల్ జడ్జి సిహెచ్. జితేందర్ బదిలీ అయ్యారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జడ్జిల బదిలీలు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. జితేందర్ మెదక్ నుంచి సిటీ సివిల్ కోర్టు హైదరాబాద్కు 27వ అదనపు న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. మెదక్ సీనియర్ సివిల్ జడ్జిగా అర్చన రెడ్డి బదిలీపై రానున్నారు. ఇప్పటికే జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మి శారదా సూర్యాపేటకు బదిలీ అయిన విషయం తెలిసిందే.
కాంగ్రెస్ కార్యకర్తలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఆదిలాబాద్ వన్ టౌన్ సీఐ సునీల్ కుమార్ తెలిపారు. కాంగ్రెస్ కార్యకర్తలపై పట్టణానికి చెందిన శైలేష్ అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వాట్సప్లో మెసేజ్ పోస్ట్ చేసినట్లు అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రూపేష్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు చేశారన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు.
ప్రపంచ పర్యావరణ దినోత్సవం(జూన్5) సందర్భంగా తెలంగాణ కాలుష్య నియంత్రణ బోర్డ్ ఆధ్వర్యంలో పర్యావరణ కార్యక్రమాలు చేపడుతున్న పాఠశాలలకు Best Environmental Performance Awards ప్రదానం చేయనున్నారు. జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలలు వారు నిర్వహిస్తున్న పర్యావరణ పరిరక్షణ చర్యల ప్రతిపాదనలు డాక్యుమెంటేషన్ ఫోటోగ్రాఫ్లతో ఈనెల25లోగా జిల్లా సైన్స్ అధికారికి 9848219365 వాట్సాప్ ద్వారా పంపాలని గంగాకిషన్ కోరారు.
MBNR జిల్లా కేంద్రంలోని బాలికల గిరిజన సంక్షేమ వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి గురువారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. 9వ తరగతి విద్యార్థులతో కలెక్టర్ ముఖాముఖిగా మాట్లాడుతూ.. ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. విద్యపై దృష్టి పెట్టి చదువులో బాగా రాణించాలని విద్యార్థులకు సూచించారు. విద్యతోపాటు ఇంటి దగ్గర తల్లిదండ్రులకు సహాయంగా ఉండాలని చెప్పారు.
మెదక్ జిల్లాలో ఎన్నో చారిత్రాత్మక కట్టడాలు ఉన్నట్లు యువ చరిత్ర పరిశోధకుడు సంతోష్ తెలిపారు. అంతర్జాతీయ చారిత్రక కట్టడాల దినోత్సవం సందర్బంగా మాట్లాడుతూ.. వేల్పుగొండ తుంబురేశ్వర స్వామి ఆలయం, వెల్దుర్తి కాకతీయ కళాతోరణం, కొంటూరు మసీద్, సీఎస్ఐ చర్చి లాంటి ఎన్నో అద్భుతమైన పురాతన కట్టడాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. కాలగర్భంలో కలిసిపోతున్న అత్యద్భుతమైన శిల్ప సంపద మెదక్ జిల్లాలో ఉందన్నారు.
ఖమ్మం జిల్లాకు ఖమ్మం అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా. ఖమ్మం నగర మధ్యలో ఉన్న స్తంభాద్రి నుంచి మండపాలకు, స్తంభాలకు కావాల్సిన రాళ్లు తరలించేవారని చరిత్ర చెబుతుంది. ఉర్దూ భాషలో ఖమ్మం అంటే స్తంభం అని అర్ధం. అలాగే నరసింహస్వామి పేరు మీద ఈ పేరు వచ్చిందనే వాదన ఉంది. బ్రిటిష్ వారి పాలనలో ఈ ప్రాంతాన్ని ‘ఖమ్మం మెట్టు’ అని పిలిచేవారనే మరో వాదన ఉంది. దీంతో ఖమ్మంకు అలా పేరు వచ్చిందని చెబుతున్నారు.
సమ్మర్ క్యాంప్ శిక్షణ కార్యక్రమంలో భాగంగా గురువారం జిల్లా కలెక్టర్ రాజర్షి షా కలెక్టరేట్ ఛాంబర్లో వేసవి శిక్షణ శిబిరం పోస్టర్ను ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లో మే 1 నుంచి 31 వరకు శిబిరాలు కొనసాగుతాయన్నారు. 6 నుంచి 14 ఏళ్ల బాలబాలికలు శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Sorry, no posts matched your criteria.