Telangana

News September 27, 2024

వరంగల్: 274 మందికి డీఎస్సీ కౌన్సెలింగ్

image

ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన 274 మంది 2008 డీఎస్సీ అభ్యర్థులకు కాంట్రాక్టు ఎస్జీటీ ఉద్యోగాల నియామకానికి నేటి నుంచి కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. నేటి నుంచి అక్టోబర్ 5 వరకు హనుమకొండలోని డీఈవో ఆఫీసులో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుందని అధికారులు చెప్పారు. అర్హులు వారి సర్టిఫికెట్లతో హాజరుకావాలని సూచించారు.

News September 27, 2024

కరీంనగర్: మత్స్యకారుల ఆందోళన!

image

మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు గత ప్రభుత్వం అమలు చేసిన ఉచిత చేపల పంపిణీ కరీంనగర్ జిల్లాలో ఇప్పటి వరకు జరగకపోవడంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. వానాకాలం పూర్తి అవుతున్నప్పటికీ చేప పిల్లల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి సంకేతాలు రాకపోవడంతో అయోమయంలో పడ్డారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 13,456 హెక్టార్లలో 1,008 చెరువులు, కుంటలు ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి.

News September 27, 2024

వరంగల్: వాహనం ఢీకొని కానిస్టేబుల్ మృతి

image

వాహనం ఢీకొని కానిస్టేబుల్ మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. వరంగల్ జిల్లా మామునూరు శివారులో గురువారం రాత్రి వాహనం ఢీకొని కానిస్టేబుల్ విజయేందర్ మృతి చెందాడు. మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ పోలీస్ స్టేషన్‌లో విజయేందర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News September 27, 2024

మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్‌కు రాష్ట్రస్థాయి అవార్డు

image

మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయికి రాష్ట్రస్థాయి అవార్డు వరించింది. రాష్ట్రంలోనే అత్యధికంగా యువ టూరిజం క్లబ్బులను ఏర్పాటు చేసినందుకుగాను సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కలెక్టర్ అవార్డు అందుకొనున్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా కలెక్టర్‌కు అవార్డును ఇవ్వనున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా 1,350 ఏర్పాటు చేశారు.

News September 27, 2024

కడెం ప్రాజెక్టు నీటి వివరాలు

image

కడెం ప్రాజెక్టు నీటి వివరాలను అధికారులు తెలిపారు. కడెం ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 700 అడుగుల కాగా, శుక్రవారం ఉదయం ప్రాజెక్టులో 700 పూర్తిస్థాయి నీటిమట్టం ఉందన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి 902 క్యూసెక్కుల వరదనీరు వస్తోంది. దీంతో కుడి, ఎడమ కాలువలకు 806, మిషన్ భగీరథకు 9 మొత్తం 902 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని ప్రాజెక్ట్ అధికారులు వివరించారు.

News September 27, 2024

NTPC విద్యుత్ పరిశ్రమకు ఇండస్ట్రీస్ అవార్డు

image

రామగుండంలోని NTPC విద్యుత్ పరిశ్రమకు 2024కు గాను ఎకనామిక్ టైమ్స్ ఎనర్జీ లీడర్షిప్‌కు సంబంధించిన రెండు అవార్డులు దక్కాయి. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ మాజీ పవర్ కార్యదర్శి అనిల్ రజ్దాన్ చేతుల మీదుగా సంస్థ ED కేదార్ రంజన్ పాండు అవార్డును అందుకున్నారు. అంతే కాకుండా పవర్ విభాగంలో ఎనర్జీ కంపెనీ అవార్డును సాధించింది. ఈ సందర్భంగా అధికారులు హర్షం వ్యక్తం చేశారు.

News September 27, 2024

బయోటెక్నాలజీ రంగానికి అధిక ప్రాధాన్యం: రీతూ శర్మ

image

కాకతీయ యూనివర్సిటీ జంతు శాస్త్ర విభాగ ఆధ్వర్యంలో రీసెంట్ ట్రెండ్స్ ఇన్ అనిమల్ బయోటెక్నాలజీ అంశంపై జరిగిన రెండు రోజుల జాతీయ సదస్సు గురువారం ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అనిమల్ బయో టెక్నాలజీ డైరెక్టర్ డాక్టర్ రీతూ శర్మ హాజరై ప్రసంగించారు. వారు మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా బయోటెక్నాలజీ రంగానికి అధిక ప్రాధాన్యత ఉందన్నారు.

News September 27, 2024

Rewind: మూసీ వరదలకు 116 ఏళ్లు!

image

HYD చరిత్రలో మూసీ వరదలు చెదరని ముద్ర వేశాయి. 1908 సెప్టెంబర్ 27 తెల్లవారుజామున క్లౌడ్‌ బరస్ట్ అయ్యింది. దాదాపు 36 గంటల పాటు భారీ వర్షం, వరదలు ముంచెత్తాయి. 28న మూసీ ఉగ్రరూపం దాల్చింది. వరదల్లో 50 వేల మంది నిరాశ్రయులు అయ్యారు. 15 వేల మంది చనిపోయినట్లు నాటి నిజాం పేర్కొన్నారు. ఇలాంటి విపత్తులు మరోసారి తలెత్తకుండా ఉస్మాన్ అలీఖాన్ ఆధ్వర్యంలో ఇంజినీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జంటజలాశయాలను నిర్మించారు.

News September 27, 2024

Rewind: మూసీ వరదలకు 116 ఏళ్లు!

image

HYD చరిత్రలో మూసీ వరదలు చెదరని ముద్ర వేశాయి. 1908 సెప్టెంబర్ 27 తెల్లవారుజామున క్లౌడ్‌ బరస్ట్ అయ్యింది. దాదాపు 36 గంటల పాటు భారీ వర్షం, వరదలు ముంచెత్తాయి. 28న మూసీ ఉగ్రరూపం దాల్చింది. వరదల్లో 50 వేల మంది నిరాశ్రయులు అయ్యారు. 15 వేల మంది చనిపోయినట్లు నాటి నిజాం పేర్కొన్నారు. ఇలాంటి విపత్తులు మరోసారి తలెత్తకుండా ఉస్మాన్ అలీఖాన్ ఆధ్వర్యంలో ఇంజినీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జంటజలాశయాలను నిర్మించారు.

News September 27, 2024

NZB: నగరంలో సందడి చేయనున్న సినీ తారలు

image

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో హీరో రామ్, హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ సందడి చేయనున్నారు. హైదరాబాద్ రోడ్డులో వెలిసిన ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి రానున్నారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు జిల్లా నాయకులతో కలిసి ప్రారంభించి, తిరిగి హైదరాబాద్ వెళ్తారు. అయితే అభిమాన హీరో, హీరోయిన్‌ను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున చేరుకొనున్నారు. ఇందుకోసం పోలీసులు భారీ పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.