India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
HYD స్థానిక సంస్థల MLC కోటాలో ‘ఆ ఒక్క ఓటు’ ఆసక్తిని రేపుతోంది. 22 ఏళ్ల తర్వాత MIM మీద BJP పోటీ చేసింది. BRS పోలింగ్లో పాల్గొనలేదు. BJP 24, INC 14, MIM 50 మంది సభ్యులు ఓటేశారు. ఇందులో MIMకు 63 ఓట్లు పోలయ్యాయి. BJPకి 25 ఓట్లు రావడం చర్చనీయాంశమైంది. 24 మంది సభ్యుల సొంత ఓట్లకు అదనంగా మరో ఓటు పడింది. ఇంతకీ ఏ పార్టీ నుంచి మద్దతు వచ్చింది? BJPకి ఓటేసిన ఆ సభ్యుడు ఎవరు? అనేది హాట్ టాపిక్గా మారింది.
HYD స్థానిక సంస్థల MLC కోటాలో ‘ఆ ఒక్క ఓటు’ ఆసక్తిని రేపుతోంది. 22 ఏళ్ల తర్వాత MIM మీద BJP పోటీ చేసింది. BRS పోలింగ్లో పాల్గొనలేదు. BJP 24, INC 14, MIM 50 మంది సభ్యులు ఓటేశారు. ఇందులో MIMకు 63 ఓట్లు పోలయ్యాయి. BJPకి 25 ఓట్లు రావడం చర్చనీయాంశమైంది. 24 మంది సభ్యుల సొంత ఓట్లకు అదనంగా మరో ఓటు పడింది. ఇంతకీ ఏ పార్టీ నుంచి మద్దతు వచ్చింది? BJPకి ఓటేసిన ఆ సభ్యుడు ఎవరు? అనేది హాట్ టాపిక్గా మారింది.
రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందిన ఘటన ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికుల వివరాలిలా.. మండలంలోని అనంతనగర్ గ్రామ శివారులో ఆగి ఉన్న టిప్పర్ను ద్విచక్రవాహనం ఢీకొనడంతో బైక్పై ఉన్న యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఏడుపాయల వనదుర్గామాత ఆలయ సమీపంలో చెక్ డ్యాంలో ప్రమాదవశాత్తు నీట మునిగి వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. నాగర్ కర్నూల్ జిల్లా మరికల్కు చెందిన దేవరపాగ వీరస్వామి(40) శుక్రవారం ఓ విందు నిమిత్తం కుటుంబంతో కలిసి ఏడుపాయలకు వచ్చారు. స్నానం చేసేందుకు ఆలయ సమీపంలోని చెక్ డ్యాం వద్దకు వెళ్లిన వీరస్వామి స్నానం చేస్తుండగా నీట మునిగి మృతి చెందారు. దీంతో విందులో విషాదం నెలకొంది.
ఆదిలాబాద్ లో శాఖ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ఈ మేరకు రవాణా వాహనాలలో ప్రజలని పరిమితికి మించి తీసుకువెళ్తున్న 6 వాహనాలను సీజ్ చేశారు. ఈ క్రమంలో వాహనాలలో ప్రయాణిస్తున్న ప్రజలకి అవగాహన కల్పించారు. రోడ్డు భద్రత నియమాలను పాటించాలని సూచించారు. రవాణా అధికారి రవీందర్ మాట్లాడుతూ.. వాహన యజమానులు సరకు రవాణా వాహనాల్లో ప్రజలను తరలిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.
మెదక్ జిల్లాలోని పాఠశాలల్లో సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యాశాఖాధికారి రాధా కిషన్ హెచ్చరించారు. ఈ విషయాన్ని అన్ని రకాల యజమాన్యాల ప్రధానోపాధ్యాయులు గమనించాలని సూచించారు. జిల్లాలో జూన్ 11 వరకు అన్ని రకాల పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించినట్లు వెల్లడించారు.
బోధన్ పట్టణానికి చెందిన ఓ వ్యక్తికి బోధన్ స్పెషల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ రెండు రోజుల జైలు శిక్ష విధించినట్లు ఎడపల్లి ఎస్ఐ వంశీ కృష్ణారెడ్డి తెలిపారు. మద్యం సేవించి వాహనలను నడిపితే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ హెచ్చరించారు. వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనం నడపరాదని ఎస్ఐ పేర్కొన్నారు.
ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మోస్రాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. మోస్రాకు చెందిన కుమ్మరి గంగాధర్(45) రెండు రోజుల క్రితం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ మహేశ్ కుమార్ చెప్పారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
అకాల వర్షం అన్నదాతలను అతలాకుతలం చేస్తుంది. చేతికొచ్చిన ధాన్యం వర్షార్పణం అవుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొల్చారం మండలం కొంగోడు వద్ద ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం చెరువును తలపిస్తుది. శుక్రవారం మధ్యాహ్నం తర్వాత ఆకాశం మేఘావృతమై ఒకసారిగా వర్షం కురవడంతో అనేకచోట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద మీరు నిలవడంతో తూకం వేయలేని పరిస్థితి నెలకొంది. ధాన్యం కాపాడేందుకు రైతులు అవస్థలు పడుతున్నారు.
సీసీఎస్ ఇన్స్పెక్టర్ పి.చంద్రశేఖర్కు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు ADBలోని తిరుపెల్లిలో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ మేరకు పేకాట ఆడుతుండగా సంఘటన స్థలంలో పది మంది పట్టుబడ్డారని సీఐ తెలిపారు. వారి వద్ద నుంచి పది మొబైల్ ఫోన్లు, పేకాట ముక్కలు, రూ.79,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిపై వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.
Sorry, no posts matched your criteria.