India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన మేడ్చల్ PS పరిధి రైల్వే కాలనీలోని ఓ వెంచర్లో జరిగింది. కుళ్లిపోయిన మహిళ మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలంలో ఉన్న ఆధారాలను సేకరించి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మహిళ వయసు సుమారు 45 నుండి 50 ఉంటుందని భావిస్తున్నారు.
తిమ్మాజిపేట మండలం గోరిటలో దారుణం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఎండీ అజీద్, అదే గ్రామానికి చెందిన ఎండీ మతీన్, ఎండి అఫీజ్ల మధ్య భూ తగాదాలు ఉన్నాయి. గత రెండు రోజుల క్రితం దాడి చేయగా బాధితుడు అజీజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మాపైనే ఫిర్యాదు చేస్తావా అంటూ ఏకంగా కారుతో ఢీ కొట్టి కర్రలతో విచక్షణ రహితంగా దాడికి దిగి హత్యకు యత్నించారు. గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలించారు.
మహిళ హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు పడింది. పోలీసుల వివరాలు.. సంగారెడ్డి జిల్లా ఆరుట్లకు చెందిన రాములు 2019లో చేవెళ్ల బస్టాండులో ఉన్న గండీడ్ మండలం నంచర్లకు చెందిన అంజులమ్మను బైక్ పై ఎక్కించుకున్నాడు. పటాన్చెరు మండలం లక్డారం శివారులో ఆమెను హత్య చేసి నగలు ఎత్తుకెళ్లాడు. ఈఘటనపై తాజాగా సంగారెడ్డి కోర్టు నిందితుడికి శిక్ష విధించింది. నిందితుడు 2003-19లో 10 హత్యలు, చోరీలు చేసినట్లు విచారణలో తేలింది.
ఏప్రిల్ 21న (ఆదివారం) మహవీర్ జయంతి వేడుకలు నిర్వహించేందుకు జైనులు సిద్ధమయ్యారు. గ్రేటర్ హైదరాబాద్లో వీరి సంఖ్య ఎక్కువే ఉండడంతో ఆ రోజు భారీ ర్యాలీలు తీయనున్నారు. ఈ నేపథ్యంలోనే GHMC పరిధిలో మాంసం దుకాణాలు (మటన్, పశువుల కబేళాలు, బీఫ్ షాపులు) మూసివేయనున్నారు. ఇందుకు సంబంధించి బల్దియా కమిషనర్ రోనాల్డ్ రాస్ ఆదేశాలు జారీ చేశారు. SHARE I
ఏప్రిల్ 21న (ఆదివారం) మహవీర్ జయంతి వేడుకలు నిర్వహించేందుకు జైనులు సిద్ధమయ్యారు. గ్రేటర్ హైదరాబాద్లో వీరి సంఖ్య ఎక్కువే ఉండడంతో ఆ రోజు భారీ ర్యాలీలు తీయనున్నారు. ఈ నేపథ్యంలోనే GHMC పరిధిలో మాంసం దుకాణాలు (మటన్, పశువుల కబేళాలు, బీఫ్ షాపులు) మూసివేయనున్నారు. ఇందుకు సంబంధించి బల్దియా కమిషనర్ రోనాల్డ్ రాస్ ఆదేశాలు జారీ చేశారు.
SHARE IT
మహిళ హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు పడింది. పోలీసుల వివరాలు.. సంగారెడ్డి జిల్లా ఆరుట్లకు చెందిన రాములు 2019లో చేవెళ్ల బస్టాండులో ఉన్న గండీడ్ మండలం నంచర్లకు చెందిన అంజులమ్మను బైక్ పై ఎక్కించుకున్నాడు. పటాన్చెరు మండలం లక్డారం శివారులో ఆమెను హత్య చేసి నగలు ఎత్తుకెళ్లాడు. ఈఘటనపై తాజాగా సంగారెడ్డి కోర్టు నిందితుడికి శిక్ష విధించింది. నిందితుడు 2003-19లో 10 హత్యలు, చోరీలు చేసినట్లు విచారణలో తేలింది.
కేసీఆర్, కేటీఆర్ త్వరలో జైలుకు పోవడం ఖాయమని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. కేసీఆర్ వల్లే కవిత బలైందన్నారు. చర్లపల్లి జైలులో డబుల్ బెడ్ రూమ్ కట్టించి స్వాగతం పలుకుతామని ఎద్దేవా చేశారు. రేపటి నుంచి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అంటే ఏంటో చూపిస్తా అంటూ బీఆర్ఎస్ పార్టీపై ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యేలను కొనాలని బీఆర్ఎస్ నేతలు చూస్తున్నారని ఆరోపించారు.
నిజామాబాద్ జిల్లాలోని నర్సింగ్ పల్లిలో ఉన్న ఇందూరు తిరుమల క్షేత్రంలో బుధవారం నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు దంపతులు పాల్గొన్నారు. సత్యం స్వామి అర్చకత్వంలో శ్రీరామ నవమి వేడుకలు, సీతారాముల కళ్యాణోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త నర్సింహ రెడ్డి దంపతులు తదితరులు పాల్గొన్నారు.
టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ సీఎం ఎన్టీఆర్కు సంబంధించిన ఫొటోను ఆ పార్టీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. నాడు CM హోదాలో ఎన్టీఆర్ తన సతీమణితో కలిసి భద్రాచల రామునికి ముత్యాల తలంబ్రాలు అందిస్తున్న చిత్రం అది. నేడు శ్రీరామ నవమిని పురస్కరించుకుని ఈ ఫొటోను టీడీపీ పోస్ట్ చేసి.. తెలుగు వారందరికీ నవమి శుభాకాంక్షలు తెలిపింది.
కరీంనగర్కు చెందిన కొలనుపాక సహన సివిల్స్ ఫలితాల్లో 739వ ర్యాంకు సాధించారు. గతంలో కరీంనగర్ కలెక్టర్గా విధులు నిర్వహించిన స్మితా సబర్వాల్ తనకు ఆదర్శమన్నారు. ఏ క్యాడర్ వచ్చినా IAS కావడమే లక్ష్యమని పేర్కొన్నారు. తన రోల్ మోడల్ స్మితా సబర్వాల్ అని సహన పేర్కొనగా.. ట్విట్టర్లో స్మిత స్పందించారు. ‘ప్రియమైన సహన.. మీ ఎంపికకు శుభాకాంక్షలు. So proud of you’ అంటూ అభినందనలు తెలిపారు.
Sorry, no posts matched your criteria.