Telangana

News April 17, 2024

MBNR: ఆ రెండు పార్టీల మధ్య విమర్శలు.!!

image

పాలమూరులో ఒకవైపు సూర్యుని ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి.. మరోవైపు ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య సాగుతున్న పరస్పర ఆరోపణలతో నెలకొంటున్న ఉత్కంఠ భరిత వాతావరణంతో అభ్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తోంది. రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి, ఇతర నేతలు అంతా BJP, BRSలపై, పార్టీ అభ్యర్థులపై ఘాటుగా వ్యాఖ్యలు చేస్తూ ఉంటే.. అదే స్థాయిలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విరుచుకుపడుతోంది.

News April 17, 2024

హైదరాబాద్: ఫామ్‌హౌస్‌లో మర్డర్

image

హైదరాబాద్ శివారులో దారుణం జరిగింది. చేవెళ్ల మండలంలోని ఊరేళ్ళ గ్రామ సమీపంలోని ఓ ఫామ్‌హౌస్‌లో నారాయణ దాస్ (46)‌ హత్యకు గురయ్యారు. CI లక్ష్మారెడ్డి వివరాల ప్రకారం.. చేవెళ్ల గ్రామానికి చెందిన నారాయణ దాస్‌‌‌ను వరుసకు బావమరిది అయిన తూర్పటి భాస్కర్ గొడ్డలి‌తో నరికి హత్య చేసినట్లు వెల్లడించారు. అనంతరం చేవెళ్ల PSలో నిందితుడు లొంగిపోయినట్లు తెలిపారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

News April 17, 2024

హైదరాబాద్: ఫామ్‌హౌస్‌లో మర్డర్

image

హైదరాబాద్ శివారులో దారుణం జరిగింది. చేవెళ్ల మండలంలోని ఊరేళ్ళ గ్రామ సమీపంలోని ఓ ఫామ్‌హౌస్‌లో నారాయణ దాస్ (46)‌ హత్యకు గురయ్యారు. CI లక్ష్మారెడ్డి వివరాల ప్రకారం.. చేవెళ్ల గ్రామానికి చెందిన నారాయణ దాస్‌‌‌ను వరుసకు బావమరిది అయిన తూర్పటి భాస్కర్ గొడ్డలి‌తో నరికి హత్య చేసినట్లు వెల్లడించారు. అనంతరం చేవెళ్ల PSలో నిందితుడు లొంగిపోయినట్లు తెలిపారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.  

News April 17, 2024

మెదక్: సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధం

image

సార్వత్రిక ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించనున్నట్లు మెదక్ లోక్‌సభ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. నామినేషన్ల స్వీకరణ ప్రారంభంకానున్న నేపథ్యంలో ఈనెల 18 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని, 25 వరకు స్వీకరిస్తామన్నారు. 26న నామినేషన్ల పరిశీలన, 29 వరకు ఉపసంహరించుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. మే 13న పోలింగ్, జూన్ 4న ఓట్ల లెక్కింపు ఉంటుందని పేర్కొన్నారు.

News April 17, 2024

గుట్ట దేవస్థానంలో ఓ ఉద్యోగి నిర్వాకం.. 

image

YGT దేవస్థానంలో అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆలయంలో పనిచేసే ఓ ఉద్యోగి అధికార దుర్వినియోగం, అవకతవకల ఘటనపై ఆ శాఖ ఉన్నత అధికారి ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఆలయంలో ఫౌంటెయిన్లు లేకున్నా ఏర్పాటు చేసినట్లుగా.. నిర్వహణ పేరుతో ఏడాదిగా బిల్లుల విషయంలో సదరు ఉద్యోగి చేసిన నిర్వాకం ఇటీవల ఉన్నతాధికారి పరిశీలనలో తేలినట్లు తెలుస్తుంది. సదరు ఉద్యోగిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది.

News April 17, 2024

HYD: తొలి ప్రయత్నంలోనే 112వ UPSC ర్యాంకు

image

HYDలోని చైతన్యపురికి చెందిన గాడిపర్తి సాహి దర్శిని UPSCలో 112వ ర్యాంకు పొందారు. ఆమె తల్లి హైకోర్టులో న్యాయవాది, తండ్రి ప్రైవేటు స్కూల్ నిర్వాహకుడు. ఇంటర్ వరకూ HYDలోనే చదువుకున్నారు. ఐఐటీ పట్నాలో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. పేదవారికి సేవ చేయాలన్నదే తన లక్ష్యమని సాహి దర్శిని పేర్కొన్నారు.

News April 17, 2024

HYD: తొలి ప్రయత్నంలోనే 112వ UPSC ర్యాంకు

image

HYDలోని చైతన్యపురికి చెందిన గాడిపర్తి సాహి దర్శిని UPSCలో 112వ ర్యాంకు పొందారు. ఆమె తల్లి హైకోర్టులో న్యాయవాది, తండ్రి ప్రైవేటు స్కూల్ నిర్వాహకుడు. ఇంటర్ వరకూ HYDలోనే చదువుకున్నారు. ఐఐటీ పట్నాలో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. పేదవారికి సేవ చేయాలన్నదే తన లక్ష్యమని సాహి దర్శిని పేర్కొన్నారు.

News April 17, 2024

NLG: జనరల్, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు డిపాజిట్లు వేరువేరు!

image

ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే జనరల్ అభ్యర్థులు రూ.25వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.12,500 సెక్యూరిటీ డిపాజిట్ సమర్పించాల్సి ఉంటుంది. గుర్తింపు పొందిన రాజకీయపార్టీల అభ్యర్థులను ఒకరు ప్రతిపాదిస్తే సరిపోతుంది. గుర్తింపు పొందని రాజకీయపార్టీలు, స్వతంత్ర అభ్యర్థులను పది మంది ప్రతిపాదించాల్సి ఉంటుంది. నామినేషన్ తో పాటు ఫారం 26 ద్వారా అఫిడవిట్ దాఖలు చేయాలని కలెక్టర్ హరిచందన తెలిపారు.

News April 17, 2024

MBNR: ఆంజనేయ స్వామిని దర్శించుకున్న వంశీచంద్ రెడ్డి

image

మహబూబ్ నగర్ పట్టణం ఎనుగొండలో వెలసిన శ్రీ ఆంజనేయస్వామిని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి కుటుంబ సమేతంగా బుధవారం దర్శించుకున్నారు. స్వామి వారికి పూజలు నిర్వహించారు. అనంతరం పురోహితులు తీర్థప్రసాదాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

News April 17, 2024

భక్తాద్రిగా మారిన భద్రగిరిలో ఎమ్మెల్యేల సందడి

image

భద్రాచలంలో సీతారాముల కల్యాణాన్ని
తిలకించిన భక్తజనకోటి పులకించింది. తమ ఆరాధ్య దైవమైన శ్రీరాముడు సీతమ్మ తల్లిని మనువాడిన ఘట్టాన్ని చూసిన భక్తులు తరించారు. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం భద్రాచలానికి తరలివచ్చిన భక్తులు ఎమ్మెల్యే పాయం, ఎమ్మెల్యే తెల్ల వీక్షించి పులకించారు. భక్తుల జయ జయధ్వానాలు, వేద పండితుల మంత్రోచ్చారణలు కల్యాణతంతుతో మిథిలా స్టేడియం వైకుంఠాన్ని తలపించింది.