Telangana

News April 17, 2024

ADB: హెడ్ కానిస్టేబుల్ పై కేసు నమోదు

image

హెడ్ కానిస్టేబుల్‌పై కేసు నమోదు చేసిన ఘటన ఆదిలాబాద్‌లో జరిగింది. వివరాలిలా.. అక్రమ నిర్మాణం చేపట్టడమే కాకుండా.. నిర్మాణ పనులు నిలిపివేయాలని వెళ్లిన మున్సిపల్ సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించారు. దీంతో తమ విధులకు ఆటంకం కలిగించారనే అభియోగంపై హెడ్ కానిస్టేబుల్ మురాద్ అలీపై మున్సిపల్ కమిషనర్ MD ఖమర్ టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదైంది.

News April 17, 2024

వరంగల్: ఈ వానాకాలం అధిక వర్షపాతం!

image

వచ్చే వానాకాలంలో ములుగు, భూపాలపల్లి, వరంగల్, హనుమకొండలో అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ మేరకు జూన్- సెప్టెంబరు నెలల మధ్య వర్షాల ప్రభావంపై మంగళవారం HYD వాతావరణ శాఖ నివేదిక విడుదల చేసింది. గతేడాది రుతుపవనాల రాక ఆలస్యం కావడం, లెక్కకు మించి వానల విరామ కాలాలు నమోదవడంతో సాగుకు విఘాతం కలిగింది. ఈ సారి ఆ పరిస్థితి ఉండదని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు.

News April 17, 2024

సిద్దిపేట: భార్యతో గొడవ.. ఇంటికి నిప్పు

image

డబ్బుల కోసం భార్యతో గొడవపడి సొంతింటికి భర్త నిప్పు అంటించి దహనం చేశాడు. ఇంట్లో ఎవరు లేకపోవడంతో ప్రాణ నష్టం జరగలేదు. సిద్దిపేట గ్రామీణ ఠాణా ఎస్సై అపూర్వరెడ్డి వివరాలు.. నారాయణరావుపేటకు చెందిన నర్సింలు, రేణుక భార్యాభర్తలు. నర్సింలు కుటుంబ సభ్యుల బాగోగులు పట్టించుకోవడంలేదని గొడవలు రావడంతో రేణుక పిల్లలను తీసుకొని వెళ్లిపోయింది. దీంతో కోపోద్రిక్తుడైన నర్సింలు సొంతింటికి నిప్పు అంటించాడు.

News April 17, 2024

UPDATE జగిత్యాల: తల్లి కోసం వెళ్లి కుమార్తె మృతి

image

జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో బస్సు కిందపడి <<13062336>>చిన్నారి మృతి చెందిన<<>> విషయం విదితమే.మద్దుట్లకు చెందిన రజాక్‌-హసీనా దంపతులకు కొడుకు, కుమార్తె ఉన్నారు. మంగళవారం ఉదయం కొడుకు సాజిల్‌ను పాఠశాల బస్సు ఎక్కించేందుకు తల్లి హసీనా వెళ్లగా.. ఆమె వెనుకే 18 నెలల కూతురు అరిబా బస్సు ముందుకు వెళ్లింది. డ్రైవర్‌ గమనించక వాహనాన్ని ముందుకు కదిలించడంతో చిన్నారి తలపై నుంచి వెనుక చక్రం వెళ్లింది. దీంతో చిన్నారి చనిపోయింది.

News April 17, 2024

MBNR: ‘సీతారాముల కళ్యాణం చూతము రారండి’ (VIDEO)

image

శ్రీరామనవమి వేడుకలకు ఉమ్మడి పాలమూరు జిల్లాలోని రామాలయాలు ముస్తాబయ్యాయి. భక్తులకు కావాల్సిన అన్ని రకాల వసతులను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. రాములోరి కళ్యాణం అనగానే మనకు గుర్తుకొచ్చే పాట ‘సీతారాముల కళ్యాణం చూతము రారండి’. ఈ గీతాన్నిమైకుల ద్వారా వినిపిస్తున్నారు. MBNR జిల్లాలోని పలు మండలాల్లో ఏ వీధిలో చూసిన ‘జై శ్రీరామ్’ నామస్మరణలే వినిపిస్తున్నాయి. మరి మీ ఏరియాలో ఫేమస్‌ టెంపుల్‌ ఏంటి? కామెంట్ చేయండి.

News April 17, 2024

NLG: పురుగు మందు తాగి యువకుడి ఆత్మహత్య

image

పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మునుగోడు మండలంలోని కోతులారంలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పగిళ్ల వంశీ లారీ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. డ్యూటీ దిగి ఇంటికి వచ్చి.. ఎవరికి చెప్పకుండా బయటికి వెళ్లి, నారాయణపురంలోని ఇటుకల బట్టి వద్ద పురుగుల మందు తాగి కుటుంబ సభ్యులకు ఫోన్ చేశాడు. ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.

News April 17, 2024

గుండెపోటుతో సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి మృతి

image

లక్ష్మీదేవి పల్లి మండలం ప్రశాంతి నగర్ గ్రామానికి చెందిన సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి పూనం జగ్గయ్య(65) బుధవారం తెల్లవారుజామున గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు తూము చౌదరి, BJP జిల్లా నాయకులు పోడియం బాలరాజు సందర్శించి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ సెల్ కార్యదర్శి గౌస్ పాషా పాల్గొన్నారు.

News April 17, 2024

నిజామాబాద్: తుఫాన్‌ను ఢీకొని ఒకరి మృతి

image

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తుఫాన్ కారు ఢీకొన్న ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. నగరంలోని గౌతమ్ నగర్‌కు చెందిన దమ్ము పాల్ స్నేహితులు ఉమాకాంత్, వినోద్‌తో కలిసి బైక్‌పై వెళ్తున్నాడు. బైపాస్ దాటే క్రమంలో అర్సపల్లి నుంచి వేగంగా వచ్చిన తుఫాన్ బైక్‌ను ఢీకొట్టడంతో ఈప్రమాదం జరిగింది.

News April 17, 2024

భద్రాచలం ఆలయంలో అర్జిత సేవలు రద్దు

image

సీతారాముల కళ్యాణానికి వచ్చే భక్తుల కోసం దేవస్థానంతో పాటు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. మిథిలా స్టేడియాన్ని సెక్టార్లుగా విభజించి వేరు వేరు ధరల్లో టికెట్లను ఇప్పటికే విక్రయించారు. శ్రీరామ నవమికి ఉండే రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయంలో అర్జిత సేవలు రద్దు చేశారు. బుధవారం తెల్లవారుజాము నుండి క్రమక్రమంగా భక్తుల పెరుగుతోంది. నవమి వేడుకల కోసం ఆర్టీసీ ప్రత్యేకంగా 238 బస్సులను నడిపిస్తోంది.

News April 17, 2024

సత్తుపల్లి చెరువులో గుర్తు తెలియని మృతదేహం లభ్యం

image

చెరువులో పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన సత్తుపల్లిలో ఈరోజు ఉదయం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపి వివరాల ప్రకారం.. సత్తుపల్లిలోని తామర చెరువులో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉండడాన్ని అటుగా వెళుతున్న స్థానికులు గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.