Telangana

News April 17, 2024

జహీరాబాద్‌లో త్రిముఖ పోరు?

image

ZHB లోక్‌సభ స్థానంలో త్రిముఖ పోరు నెలకొంది. కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలతో ఏర్పడిన ZHB పార్లమెంటు నియోజకవర్గంలో ఇప్పటికీ 3 సార్లు ఎన్నికలు జరిగాయి. 2009లో కాంగ్రెస్ (సురేశ్ షెట్కర్), 2014, 2019లో BRS (బీబీ పాటిల్) అభ్యర్థులు విజయం సాధించారు. ఈ సారి CONG, BJP, BRS అభ్యర్థులు ఎవరికి వారు ఎత్తులు పైఎత్తులు వేస్తూ ప్రచారం చేస్తుండడంతో సార్వత్రిక పోరు ఆసక్తి రేపుతోంది. 

News April 17, 2024

జగిత్యాల: ఆర్టీసీ బస్సులో వ్యక్తి మృతి

image

ఈ నెల 6న నిజామాబాద్ నుంచి నర్సంపేటకు వస్తున్న బస్సులో జగిత్యాల జిల్లా మెట్‌పల్లి వద్ద ఇద్దరు వ్యక్తులు ఓ వ్యక్తి(46)ని ఎక్కించారు. అతడి ఆరోగ్యం బాగాలేదని, వరంగల్ వెళ్లాక లేపితే.. అక్కడి నుంచి రైలులో ఆంధ్రా ప్రాంతానికి వెళతారని కండక్టర్ రాజ్‌కుమార్‌కు చెప్పి వారు బస్సు దిగిపోయారు. వరంగల్ చేరుకున్నాక కండక్టర్ లేపడానికి ప్రయత్నించగా..అప్పటికే మృతి చెందారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

News April 17, 2024

మిర్యాలగూడలో ఉరేసుకుని యువకుడి సూసైడ్

image

మిర్యాలగూడలో ఉరేసుకుని యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎర్రకాల్వ తండాకు చెందిన నరసింహ కుటుంబ కలహాలతో పెద్ద మనుషుల మధ్య జరిగిన ఒప్పందంలో భార్య, పిల్లలకు దూరంగా ఉంటున్నాడు. మనస్తాపానికి గురై మండలంలోని అవంతీపురంలోని బాలాజీ టౌన్ షిప్ లో ఓ చెట్టుకు ఉరేసుకున్నాడు. తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

News April 17, 2024

సివిల్స్‌లో సత్తా చాటిన పాలమూరు బిడ్డలు

image

సివిల్స్ ఫలితాల్లో పాలమూరు బిడ్డలు సత్తా చాటారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం ఆరుగురికి ర్యాంకులు రాగా అనన్యరెడ్డి(MBNR) జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు సాధించారు. అక్షయ దీపక్(MBNR)కు 196వ ర్యాంకు, ఎహతేదా ముపసిర్(ఆత్మకూర్)కు 278వ ర్యాంకు, యశ్వంత్ నాయక్(వెల్దండ- పోచమ్మ గడ్డ తండా) 627వ ర్యాంక్, అనుప్రియ(బాలానగర్- తిరుమలగిరి) 914వ ర్యాంక్, శశికాంత్(జడ్చర్ల- చాకలి గడ్డ తండా) 891వ ర్యాంకు సాధించి సత్తా చాటారు.

News April 17, 2024

KTDM: బస్సు ఆపలేదని ప్రయాణికుల దాడి

image

అశ్వాపురం మండలంలోని కళ్యాణపురంలో ఆర్టీసీ డ్రైవర్‌పై ప్రయాణికులు దాడి చేశాడు. తోటి ప్రయాణికుల వివరాల ప్రకారం.. ఖమ్మం మీదుగా వస్తున్న బస్సులో కళ్యాణపురం గ్రామస్థులు ఎక్కారు. స్టాప్ వద్దకు రాగానే బస్ డ్రైవర్ బస్సు ఆపకుండా ముందుకు వెళ్లాడు. దాంతో ప్రయాణికులకి, బస్ డ్రైవర్ మధ్య వాగ్వాదం జరిగింది. కళ్యాణపురంలో బస్సును ఆపి అద్దాలు ధ్వంసం చేసి డ్రైవర్, కండక్టర్‌పై చేయి చేసుకున్నారు.

News April 17, 2024

వరంగల్: ఆర్టీసీ బస్సులో వ్యక్తి మృతి 

image

ఈ నెల 6న నిజామాబాద్ నుంచి నర్సంపేటకు వస్తున్న బస్సులో జగిత్యాల జిల్లా మెట్‌పల్లి వద్ద ఇద్దరు వ్యక్తులు ఓ వ్యక్తి(46)ని ఎక్కించారు. అతడి ఆరోగ్యం బాగాలేదని, వరంగల్ వెళ్లాక లేపితే.. అక్కడి నుంచి రైలులో ఆంధ్రా ప్రాంతానికి వెళతారని కండక్టర్ రాజ్‌కుమార్‌కు చెప్పి వారు బస్సు దిగిపోయారు. వరంగల్ చేరుకున్నాక కండక్టర్ లేపడానికి ప్రయత్నించగా..అప్పటికే మృతి చెందారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

News April 17, 2024

MBNR: MVSలో రేపు జాబ్ మేళా!

image

క్రిస్టియనపల్లిలో ఎంవీఎస్ ప్రభుత్వ ఆర్ట్స్, సైన్స్ డిగ్రీ కళాశాలలో ఈ నెల 18న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ పద్మావతి తెలిపారు. HYD మ్యూజిక్ బస్ ఫౌండేషన్, MVS కళాశాల సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ మేళాకు మెడ్ ప్లస్, అపోలో, క్రోబాన్ ఐసీఐసీఐ బ్యాంక్, వీఎన్ ఫెర్టిలైజర్స్, స్పందన స్ఫూర్తి, ముత్తూట్ ఫైనాన్స్ తదితర అనేక కంపెనీల ప్రతినిధులు, హెచ్వీడీలు హాజరవుతారని తెలిపారు.

News April 17, 2024

UPSC Results: సత్తాచాటిన హైదరాబాదీల LIST

image

RANK 50: KN చందన జాహ్నవి, హిమాయత్‌నగర్
82: మెరుగు కౌశిక్, హబ్సిగూడ
112: సాహి దర్శిని, చైతన్యపురి
231: తరుణ్, మంచన్‌పల్లి, పూడూరు-VKB
312: ముస్తఫా హష్మి, హైదరాబాద్
411: నందిరాజు శ్రీమేఘనాదేవి, హైదరాబాద్
545: నరేంద్ర పడాల, కోహెడ, తుర్కయాంజాల్-RR
649: ఐశ్వర్య నెల్లి శ్యామల, హైదరాబాద్
770: మహమ్మద్ అష్ఫక్, పెద్దేముల్-VKB
891: K. శశికాంత్, షాద్‌నగర్-RR
SHARE IT

News April 17, 2024

UPSC Results: సత్తాచాటిన హైదరాబాదీల LIST

image

RANK 50: KN చందన జాహ్నవి, హిమాయత్‌నగర్
82: మెరుగు కౌశిక్, హబ్సిగూడ
112: సాహి దర్శిని, చైతన్యపురి
231: తరుణ్, మంచన్‌పల్లి, పూడూరు-VKB
312: ముస్తఫా హష్మి, హైదరాబాద్
411: నందిరాజు శ్రీమేఘనాదేవి, హైదరాబాద్
545: నరేంద్ర పడాల, కోహెడ, తుర్కయాంజాల్-RR
649: ఐశ్వర్య నెల్లి శ్యామల, హైదరాబాద్
770: మహమ్మద్ అష్ఫక్, పెద్దేముల్-VKB
891: K. శశికాంత్, షాద్‌నగర్-RR
SHARE IT

News April 17, 2024

అభిజిత్ లగ్నంలో సీతారాముల కళ్యాణం

image

శ్రీ సీతారాముల కళ్యాణానికి భద్రాచలం ముస్తాబైంది. చైత్ర శుద్ధ నవమి అభిషేక్ లగ్నం మధ్యాహ్నం 12 గంటలకు కాస్త అటు ఇటుగా రావడం పరిపాటి. ముహూర్త సమయం కాగానే వధూవరులైన సీతారాముల తలపై జీలకర్ర బెల్లం ఉంచుతారు. తరువాత శ్రీరామదాసు చేయించిన మూడు బొట్లు ఉన్న మంగళసూత్రానికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మూడు సూత్రాలు ఉన్న తాళిని సీతమ్మ వారి మెడలో కట్టడంతో కళ్యాణ వేడుక కీలక ఘట్టం ముగుస్తుంది.