Telangana

News September 9, 2024

నవరాత్రులను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని: ఏసీపీ

image

గణేష్ నవరాత్రులను ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని నర్సంపేట ఏసీపీ కిరణ్ కుమార్ సూచించారు. నర్సంపేట పట్టణంలోని సిద్ధార్థ నగర్ లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద ఏసిపి కిరణ్ కుమార్ సోమవారం పూజలు నిర్వహించారు. డిప్యూటీ తహసిల్దార్ రవి, పిఆర్టియు జిల్లా అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, నరసింహ రాములు తదితరులు ఉన్నారు.

News September 9, 2024

హైకోర్టు తీర్పు నేపథ్యంలో స్పందించిన భద్రాచలం ఎమ్మెల్యే

image

ప్రజల అభీష్టం మేరకే తాను ఎమ్మెల్యే అయ్యానని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు అన్నారు. BRS పార్టీని చూసి ప్రజలు ఓటు వేయలేదన్నారు. సోమవారం హైకోర్టు తీర్పు వెలువడిన నేపథ్యంలో ఎమ్మెల్యే స్పందించారు. నియోజకవర్గ ప్రజలకు తన వ్యక్తిగతం తెలుసని, మారుమూల పల్లెల్లో పుట్టి ఎమ్మెస్ పూర్తి చేశానన్నారు. ఎన్నికల్లో పోటీ చేసి ప్రజల ఆశీర్వాదంతోనే గెలిచానని తెలిపారు.

News September 9, 2024

నల్గొండ జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలో దారుణం

image

నల్గొండ జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలో దారుణం జరిగింది. హలియాకు చెందిన కృపారాణి అనే మహిళ ప్రసవం కోసం ఈ నెల 4న ఆసుపత్రిలో చేరింది. డాక్టర్లు సాధారణ ప్రసవం కోసం 5 రోజులు వేచి చూశారు. దీంతో కడుపులోనే శివువు మృతి చెందిందని భాదితులు ఆరోపించారు. శిశువు మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు.

News September 9, 2024

HYD: DSC ఫైనల్ కీలో తప్పులు.. అధికారులను కలిసిన అభ్యర్థులు

image

DSC అభ్యర్థులు ఈరోజు HYDలో ఉన్న పాఠశాల విద్యా కార్యాలయంలోని విద్యాశాఖ అధికారులకు కలిశారు. ఇటీవల విడుదల చేసిన DSCఫైనల్ కీలో కొన్ని తప్పులు ఉన్నాయని, పాఠ్య పుస్తకాల ప్రకారం సమాధానాలు ఇవ్వకుండా కొన్ని సమాధానాలు మార్పు చేశారని అభ్యర్థులు వాపోయారు. ఎలాగైనా తమకు న్యాయం చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. అభ్యర్థులు ఇచ్చిన ఆధారాలను మరోసారి రివ్యూ కమిటీకి సెండ్ చేస్తామని అదికారులు తెలిపారని వారు అన్నారు.

News September 9, 2024

HYD: DSC ఫైనల్ కీలో తప్పులు.. అధికారులను కలిసిన అభ్యర్థులు

image

DSC అభ్యర్థులు ఈరోజు HYDలో ఉన్న పాఠశాల విద్యా కార్యాలయంలోని విద్యాశాఖ అధికారులకు కలిశారు. ఇటీవల విడుదల చేసిన DSCఫైనల్ కీలో కొన్ని తప్పులు ఉన్నాయని, పాఠ్య పుస్తకాల ప్రకారం సమాధానాలు ఇవ్వకుండా కొన్ని సమాధానాలు మార్పు చేశారని అభ్యర్థులు వాపోయారు. ఎలాగైనా తమకు న్యాయం చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. అభ్యర్థులు ఇచ్చిన ఆధారాలను మరోసారి రివ్యూ కమిటీకి సెండ్ చేస్తామని అదికారులు తెలిపారని వారు అన్నారు.

News September 9, 2024

HYD: కాళోజీ నారాయణరావుకు నివాళులర్పించిన స్పీకర్

image

పద్మవిభూషణ్, ప్రజాకవి, స్వర్గీయ కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా అసెంబ్లీ వద్ద ఏర్పాటు చేసిన చిత్రపటానికి శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ బండ ప్రకాశ్ ఈరోజు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, లెజిస్లేటివ్ సెక్రటరీ నరసింహా చార్యులు పాల్గొన్నారు.

News September 9, 2024

HYD: కాళోజీ నారాయణరావుకు నివాళులర్పించిన స్పీకర్

image

పద్మవిభూషణ్, ప్రజాకవి, స్వర్గీయ కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా అసెంబ్లీ వద్ద ఏర్పాటు చేసిన చిత్రపటానికి శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ బండ ప్రకాశ్ ఈరోజు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, లెజిస్లేటివ్ సెక్రటరీ నరసింహా చార్యులు పాల్గొన్నారు.

News September 9, 2024

రాష్ట్రంలో 80వేల ఎకరాల వక్ఫ్ భూములు: డీకే అరుణ

image

తెలంగాణ రాష్ట్రంలో వక్ఫ్ బోర్డు పరిధిలో సుమారు 80వేల ఎకరాల భూములు ఉన్నాయని ఎంపీ డీకే అరుణ అన్నారు. మహబూబ్ నగర్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. నిరుపేదలకు లబ్ధి చేకూర్చేందుకే కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డులో సవరణలు చేపట్టిందన్నారు. ఈ విషయంలో కొందరు పనిగట్టుకొని కేంద్రంపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. అభిప్రాయాలు తెలుసుకునేందుకు రాష్ట్రంలో నెలాఖరున జేపీసీ పర్యటన ఉంటుందన్నారు.

News September 9, 2024

సదస్సులో పాల్గొన్న మంత్రి సీతక్క

image

ఆగ్రాలో జరిగిన సామాజిక న్యాయం, సాధికారత సదస్సులో కేంద్ర మంత్రులు డాక్టర్ వీరేంద్ర కుమార్, రాందాస్ అథవాలేతో కలిసి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పాల్గొన్నారు. అనంతరం తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలపై సీతక్క మాట్లాడారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమంపై దృష్టి సాధించాలని విజ్ఞప్తి చేశారు.

News September 9, 2024

వరంగల్ మార్కెట్లో మొక్కజొన్నకు రికార్డు ధర

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మొక్కజొన్న మరోసారి రికార్డు ధర పలికింది. గత వారం మార్కెట్లో క్వింటా మొక్కజొన్న ధర రూ.3,015 పలకగా.. నేడు అదే ధర పలికి రికార్డును కొనసాగించింది. మార్కెట్ చరిత్రలోనే ఇంత ధర రావడం ఇదే మొదటిసారి అని వ్యాపారులు చెబుతున్నారు. దీంతో మొక్కజొన్న రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.