India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామంలో ఉరేసుకొని మామిడి నర్సయ్య(34) మృతి చెందినట్లు ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు. నర్సయ్య కొంతకాలంగా మద్యానికి బానిస అయ్యారని చెప్పారు. అనారోగ్యంతో జీవితంపై విరక్తి చెంది మంగళవారం ఉరేసుకొని మృతి చెందినట్లు పేర్కొన్నారు. నర్సయ్య భార్య వనిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
భద్రాచలంలో జరగనున్న శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణానికి సగర వంశస్తులైన మంగళవారం పట్టు వస్త్రాలు, తలంబ్రాలు, వడి బియ్యం స్వామివారికి అందజేశారు. భాగ్యనగరం నుంచి భద్రాచలం వరకు పాదయాత్రతో తరలివచ్చిన ఆలయంలో సమర్పించారు. ఈ సందర్భంగా సగర సంగం రాష్ట్ర అధ్యక్షులు ఉప్పరి శేఖర్ మాట్లాడుతూ.. ప్రతి ఏడాది స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పిస్తామని చెప్పారు.
కాంగ్రెస్ దొంగ వాగ్దానాలు చేసి గెలిచిందని.. అధికారంలోకి వచ్చాక బాధ్యత లేకుండా ప్రవర్తిస్తోందని ఎంపీ అరవింద్ ధర్మపురి విమర్శించారు. జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ సైతం ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చి కనిపించకుండా పోయారన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మాదిరి బీజేపీ దొంగ వాగ్దానాలు ఇవ్వదన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చేపార్టీ బీజేపీ అన్నారు.
సూర్యాపేట సద్దుల చెరువులో గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సీఐ రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. సద్దుల చెరువులో మృతదేహం ఉన్నట్టు స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని బయటకు తీయించారు. మృతురాలి కుడి చేతిపై ఉమా అని పేరు రాసి ఉందని తెలిపారు. మృతదేహాన్ని ఎవరైనా గుర్తిస్తే స్థానిక పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని సీఐ తెలిపారు.
అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడు మృతిచెందిన ఘటన మంగళవారం తానూర్ మండలంలో జరిగింది. ఎస్ఐ సందీప్ తెలిపిన వివరాలిలా.. మండలంలోని భోసీకి చెందిన దినేష్ (23) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తండ్రి దినాజీ చికిత్స నిమిత్తం హెదరాబాద్ వెళ్లాడు. ఈరోజు ఇంటికి వచ్చాడు. అతను వచ్చేసరికి కొడుకు దినేశ్ ఉరేసుకుని ఉన్నాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వద్దురా నాయన కాంగ్రెస్ పాలన అని ప్రజలు అంటున్నారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. చౌటకూరు మండలం సుల్తాన్ పూర్ మంగళవారం ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. 100 రోజుల్లో 6గ్యారంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందని విమర్శించారు. ప్రచారానికి కాంగ్రెస్ నాయకులు వస్తే చెప్పు, చీపుర్లు పట్టాలని చెప్పారు. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ను చిత్తుగా ఓడించాలని కోరారు.
వికారాబాద్ జిల్లా అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్గా ఉమా హారతిని కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మంగళవారం అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్గా ఉమా హారతి, IAS, 2022-23 వికారాబాద్ జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పరిపాలనపై పట్టు సాధించి భవిష్యత్తులో ప్రజలకు ఉన్నత సేవలు అందించి మంచి పేరు సంపాదించేలా కృషి చేస్తానని ట్రైనీ కలెక్టర్ ఉమాహారతి అన్నారు.
MBNR జిల్లా కేంద్రానికి ఈ నెల 19న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రానున్నట్లు డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తెలిపారు. మంగళవారం మహబూబ్ నగర్లో ఆయన మాట్లాడారు. 19న కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి నామినేషన్ వేసే కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు అవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు పాల్గొననున్నట్లు ఆయన తెలిపారు.
విద్యార్థి ఆత్మహత్య ఘటనకు సంబంధించి పూర్తి నివేదికను అందజేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం బాసర ట్రిపుల్ ఐటీలో జిల్లా ఎస్పీ జానకి షర్మిలతో కలిసి ఆయన అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. విద్యార్థి ఆత్మహత్య బాధాకరమని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ఠ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గతంలో జరిగిన ఘటనలు తీసుకున్న చర్యలపై నివేదికలు అందజేయాలన్నారు.
శ్రీరామనవమి నిర్వహణపై మంగళవారం ఎస్పీ రోహిత్ రాజు పోలీసులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ.. తమకు కేటాయించిన విధులను గురించి వివరించారు. పోలీసు అధికారులు సిబ్బంది తమకు కేటాయించిన ప్రదేశాల్లో బాధ్యతగా విధులు నిర్వహించాలని సూచించారు. విధుల పట్ల ఎవరు నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని చెప్పారు. ఎవరికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా సమన్వయంతో డ్యూటీ చేయాలన్నారు.
Sorry, no posts matched your criteria.