Telangana

News April 16, 2024

రామయ్య కళ్యాణంలో ఎర్రటి తలంబ్రాలు.. కారణమిదే..

image

భద్రాచల రామయ్య కళ్యాణానికి వాస్తవంగా శ్వేత అక్షింతలు వాడాలి. కాని శుభ సూచకంగా కొద్దిగా పసుపు కలుపుతారు. కాగా తానీషా ప్రభుత్వం తరపున రామయ్య కళ్యాణానికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలతో పాటు గులాం పొడి తీసుకుని వచ్చేవారు. తానీషా ప్రభువు తీసుకుని వచ్చిన గులాం పొడి కూడా తలంబ్రాలతో కలపడం వల్ల భద్రాద్రిలో తలంబ్రాలు ఎర్రగా ఉంటాయి. ఈ తలంబ్రాలను పంచ ద్రవ్యాలతో కలిపి తయారు చేస్తారు.

News April 16, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి ఉష్ణోగ్రతలు ఇలా..

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మంగళవారం ఈ క్రింది విధంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యయి. అత్యధికంగా వనపర్తి జిల్లా కానాయిపల్లిలో 42.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. మహబూబ్నగర్ జిల్లా వడ్డేమాన్ లో 42.6, నాగర్ కర్నూల్ జిల్లా కోడేరులో 42.3, గద్వాల జిల్లా అల్లంపూర్లో 41.3, నారాయణపేట జిల్లా ధన్వాడలో 40.8, డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

News April 16, 2024

నిర్మల్: కాంగ్రెస్‌లో చేరిన మాజీ కేంద్రమంత్రి 

image

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాల్ చారి మంగళవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని రేవంత్ రెడ్డి ఆయనకు సూచించారు. కార్యక్రమంలో ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్, జీవన్ రెడ్డి తదితరులున్నారు.

News April 16, 2024

సివిల్స్‌లో మెరిసిన సిద్దిపేట జిల్లా యువకుడు

image

సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రానికి చెందిన బుద్ది అఖిల్ యాదవ్ UPSC-2023 ఫలితాల్లో సత్తా చాటారు. ఆలిండియా స్థాయిలో 321 ర్యాంకుతో విజయ ఢంకా మోగించారు. అతి సామాన్య కుటుంబం నుంచి వచ్చిన అఖిల్.. ఇప్పటికే ఆలిండియా సివిల్ సర్వీసెస్‌కు ఎంపికై IPSగా ఢిల్లీలో పనిచేస్తున్నారు. అఖిల్ తాజాగా IASగా ఎంపికయ్యారు. -CONGRATS

News April 16, 2024

రేపు వ్యవసాయ మార్కెట్‌కు సెలవు

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు బుధవారం సెలవు ప్రకటిస్తున్నట్లు మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈ నెల 17న శ్రీరామనవమి సందర్భంగా సెలవు ప్రకటించినట్లు తెలిపారు. తిరిగి 18న (గురువారం) నుంచి మార్కెట్లో పంట క్రయవిక్రయాలు యథావిధిగా జరుగుతాయని పేర్కొన్నారు. జిల్లా రైతులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.

News April 16, 2024

KNR: వడదెబ్బతో వ్యవసాయ కూలీ మృతి

image

వడదెబ్బతో వ్యవసాయ కూలీ మృతి చెందిన ఘటన ముత్తారం మండలంలో చోటుచేసుకుంది. స్థానికలు తెలిపిన వివరాలు.. ఓడేడుకు చెందిన మొగిలి రమేష్ (45) ప్రతి రోజు లాగానే తన పంట పొలం వద్దకు మోటారు వేయడానికి ఉదయం వెళ్లి మధ్యాహ్నం వరకు ఇంటికి రాలేదు. దీంతో కుటుంబసభ్యులు పొలం వద్దకు వెళ్లి చూడగా మానేరులో కింద పడి ఉండటం చూసి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్టు గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపారు.

News April 16, 2024

NLG: భానుడి భగ భగ..!

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎండ తీవ్రత పెరిగింది. జిల్లా వ్యాప్తంగా 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉదయం పది గంటలు దాటితే బయటికి రావాలంటే జంకుతున్నారు. రెండు, మూడు రోజులు వడగాలులు వీస్తాయని అవసరమైతే  తప్ప బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. 

News April 16, 2024

వరంగల్ జిల్లాలో ముగ్గురికి సివిల్స్ ర్యాంకులు

image

నేడు విడుదలైన యూపీఎస్సీ ఫలితాల్లో ఓరుగల్లు బిడ్డలు సత్తాచాటారు. జిల్లా నుంచి  ముగ్గురు సివిల్స్ సర్వీసుకు ఎంపికయ్యారు. వరంగల్ నగరానికి చెందిన జయసింహారెడ్డికి 103వ ర్యాంకు, గీసుకొండ మండలం అనంతరం గ్రామానికి చెందిన సయింపు కిరణ్ 568వ ర్యాంకు, శివనగర్‌కు చెందిన కోట అనిల్ కుమార్‌ 764 ర్యాంకు సాధించారు. వీరిలో జయసింహారెడ్డికి ఐఏఎస్, కిరణ్‌కు ఐపీఎస్, అనిల్ కుమార్‌కు ఐఆర్ఎస్ వచ్చే ఛాన్స్ ఉంది.

News April 16, 2024

రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

image

జూలూరుపాడు మండలం పడమట నర్సాపురంలో మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న కిలారు నరసింహారావు అనే వ్యక్తి మృతి చెందాడు. బేతాళపాడుకి చెందిన కిలారు నరసింహారావు అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఆటో ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు.

News April 16, 2024

మెదక్: మంజీరా నదిలో యువకుడి మృతదేహం

image

మెదక్ జిల్లా కొల్చారం మండలం పోతనశెట్టిపల్లి శివారులోని మంజీరా బ్రిడ్జి కింద గుర్తుతెలియని వ్యక్తి మృతిదేహం లభ్యమైంది. మంజీరాలో మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మృతుడు ఎవరు..? ఎలా చనిపోయాడు అనేది తెలియాల్సి ఉంది.