India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వెళ్లే ప్రయాణికులకు గుడ్న్యూస్. వేసవి వేళ మంచినీటి వసతిని SCR అధికారులు మెరుగుపరిచారు. సాధారణ తాగునీటితో పాటుగా, కూల్ వాటర్ను రూ.5కే అందిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా కూలర్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. మొత్తం 170 స్టేషన్లలో 468 వాటర్ కూలర్లను అందబాటులోకి తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని పరిశీలిస్తున్నట్లు తెలియజేశారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వెళ్లే ప్రయాణికులకు గుడ్న్యూస్. వేసవి వేళ మంచినీటి వసతిని SCR అధికారులు మెరుగుపరిచారు. సాధారణ తాగునీటితో పాటుగా, కూల్ వాటర్ను రూ.5కే అందిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా కూలర్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. మొత్తం 170 స్టేషన్లలో 468 వాటర్ కూలర్లను అందబాటులోకి తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని పరిశీలిస్తున్నట్లు తెలియజేశారు.
ఈ నెల 18 నుండి పార్లమెంట్ ఎన్నికల నామినేషన్లను స్వీకరించనున్నట్లు ఖమ్మం ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ తెలిపారు. కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో గుర్తింపు పొందిన రాజకీయపార్టీల ప్రతినిధులతో జిల్లా ఎన్నికల అధికారి సమావేశం ఏర్పాటుచేసి, నామినేషన్ల ప్రక్రియపై అవగాహన కల్పించారు. 18 నుండి 25 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందన్నారు. నామినేషన్ వేసే అభ్యర్థికి 3 వాహనాలు మాత్రమే అనుమతి ఉందన్నారు.
జిల్లాలోని గ్రామాలు, పట్టణాలలో నిరంతరం పర్యవేక్షించి త్రాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ రవి నాయక్ అధికారులను ఆదేశించారు. సోమవారం వెబెక్స్ ద్వారా సంబంధిత అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. SDF ద్వారా మంజూరు చేసిన త్రాగునీటి సంబంధిత బోర్ వెల్ లు, మోటర్ లు, పైప్ లైన్ పనులు ప్రగతిలో ఉన్న పనులన్నీ వారం రోజులలో పూర్తి చేయాలని తెలిపారు.
స్టేట్ బ్యాంకు ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాలోని నిరుద్యోగ గ్రామీణ మహిళలకు బ్యూటీ పార్లర్ లో 30 రోజుల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు SBI-RSETI డైరెక్టర్ రఘుపతి తెలిపారు. భోజన వసతి కల్పించడం జరుగుతుందన్నారు. 19 నుండి 45 ఏళ్ల మధ్య వుండి 10వ తరగతి పాసైన నిరుద్యోగ గ్రామీణ మహిళలు ఈనెల 18 లోపు SBI, ఆర్సెటి రాంనగర్, నల్గొండలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
✏ఆగస్టు 15 నాటికి రూ.2 లక్షల రుణమాఫీ:CM రేవంత్ రెడ్డి
✏KCR కట్టిన సెక్రటేరియట్లో కూర్చోకండి: నిరంజన్ రెడ్డి
✏MP ఎన్నికల్లో పాలమూరులో గులాబీ జెండా ఎగరాలి: హరీష్ రావు
✏కాంగ్రెస్కి 3,4 సీట్లు మాత్రమే వస్తాయి:మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి
✏రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న BJPనేతలు
✏ఉమ్మడి జిల్లాలో పగలు సెగలు..రాత్రి చల్ల గాలులు
✏అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యం:వంశీ చంద్ రెడ్డి
HYD కూకట్పల్లి PS పరిధి ప్రకాశ్నగర్లో మెదక్ వాసి సూసైడ్ చేసుకొన్నాడు. సోమవారం రమేశ్(20) అనే డెలివరీ బాయ్ ఆత్మహత్య చేసుకొన్నాడు. SI రామకృష్ణ వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా సీతారాంనగర్కి చెందిన రమేశ్ ప్రకాశ్నగర్లో నివాసం ఉంటూ డెలివరీ బాయ్గా పని చేస్తున్నాడు. ఇంట్లో పరిస్థితులు, వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకొని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఈరోజు హైదరాబాద్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTRను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఈనెల 19న పెద్దపల్లి పార్లమెంట్ MPఅభ్యర్థి కొప్పుల ఈశ్వర్ నామినేషన్ కోసం ఆహ్వానించినట్లు తెలిపారు. ఈ మేరకు KTR పెద్దపల్లికి వస్తున్నట్లు ప్రకటించారు.
కూకట్పల్లి PS పరిధి ప్రకాశ్నగర్లో విషాదం నెలకొంది. సోమవారం రమేశ్ (20) అనే డెలివరీ బాయ్ ఆత్మహత్య చేసుకొన్నాడు. SI రామకృష్ణ వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా సీతారాంనగర్కి చెందిన రమేశ్ ప్రకాశ్నగర్లో నివాసం ఉంటూ డెలివరీ బాయ్గా పని చేస్తున్నాడు. ఇంట్లో పరిస్థితులు, వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకొని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
NRPT:ఎన్ని కష్టాలు ఎదురైనా కాంగ్రెస్ కార్యకర్తలు ఈ జెండాను వదల్లేదు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. జన జాతర సభలో కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ.. “కార్యకర్తలు ఎల్లప్పుడూ అండగా ఉన్నారని, ఎన్ని కష్టాలు వచ్చినా కాంగ్రెస్ జెండా వదలలేరని,కాంగ్రెస్ పార్టీ పేదలకు, బీసీలకు టికెట్లు ఇచ్చి గెలిపించింది. వెనుకబడిన సామాజిక వర్గాలకు న్యాయం చేయడంలో కాంగ్రెస్కు మించింది లేదు” అని రేవంత్ రెడ్డి అన్నారు.
Sorry, no posts matched your criteria.