Telangana

News April 15, 2024

డీఎస్సీ ఉచిత శిక్షణ కోసం దరఖాస్తుల ఆహ్వానం

image

షెడ్యూల్డు కులాల అభివృద్ధి శాఖ, వరంగల్ జిల్లా ద్వారా DSCఉచిత శిక్షణ కోసం దరఖాస్తు చేసుకొనుటకు జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్ జిల్లాలో గల షెడ్యూల్డు కులాల నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని వరంగల్ జిల్లా షెడ్యూల్ కులాల అధికారి భాగ్యలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. బీఎడ్ లేదా డైట్ నందు అర్హత సాధించిన SC విద్యార్థులందరూ అర్హులన్నారు. వివరాలకు 9346374583 నంబర్‌ను సంప్రదించాలన్నారు.

News April 15, 2024

HYD: వివాహేతర సంబంధం.. DSP ఇంటి ముందు ఆందోళన

image

ఆదిభట్ల PS పరిధి తుర్కయంజాల్ శ్రీ సాయిపంచవతి హోమ్స్‌‌లోని DSP రంగా నాయక్ ఇంటి ముందు ఆయన భార్య ఆందోళనకు దిగారు. వేరే అమ్మాయితో వివాహేతర సంబంధం పెట్టుకొని తనను పట్టించుకోవడం లేదని జ్యోతి ఆరోపిస్తున్నారు. తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని.. న్యాయం చేయాలంటూ కుటుంబ సభ్యులతో కలిసి ధర్నా చేస్తున్నారు. కాగా, రంగా నాయక్ ప్రస్తుతం మెదక్ ఏఆర్ డీఎస్పీగా పని చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.

News April 15, 2024

HYD: వివాహేతర సంబంధం.. DSP ఇంటి ముందు ఆందోళన

image

ఆదిభట్ల PS పరిధి తుర్కయంజాల్ శ్రీ సాయిపంచవతి హోమ్స్‌‌లోని DSP రంగా నాయక్ ఇంటి ముందు ఆయన భార్య ఆందోళనకు దిగారు. వేరే అమ్మాయితో వివాహేతర సంబంధం పెట్టుకొని తనను పట్టించుకోవడం లేదని జ్యోతి ఆరోపిస్తున్నారు. తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని.. న్యాయం చేయాలంటూ కుటుంబ సభ్యులతో కలిసి ధర్నా చేస్తున్నారు. కాగా, రంగా నాయక్ ప్రస్తుతం మెదక్ ఏఆర్ డీఎస్పీగా పని చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.

News April 15, 2024

నల్గొండ, భువనగిరి ఓట్ల లెక్కింపు ఇక్కడే..!

image

లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు ఉన్నతాధికారులు ఓట్లను లెక్కించే ప్రాంతాలను గుర్తించి అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. నల్గొండ పార్లమెంట్‌ ఓట్ల లెక్కింపు దుప్పల్లి వేర్‌హౌజింగ్‌ కార్పొరేషన్‌ గోదాములో చేపడతారు. భువనగిరి ఓట్ల లెక్కింపు రాయగిరి అరోరా ఇంజినీరింగ్‌ కళాశాలలో చేపడతారు. భువనగిరి స్థానం 2009లో ఏర్పడినప్పటి నుంచి ఇక్కడే ఓట్లు లెక్కిస్తున్నారు.

News April 15, 2024

కేటీఆర్‌ను కలిసిన వరంగల్ ఎంపీ అభ్యర్థి

image

వరంగల్ పార్లమెంట్ ప్రస్తుత & మాజీ శాసన సభ సభ్యులు, శాసన మండలి సభ్యులతో పాటు వరంగల్ పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, డా.సుధీర్ కుమార్ సోమవారం కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఉమ్మడి వరంగల్ నేతలు పార్లమెంట్ స్థానం కైవసం చేసుకుంటామని, అందుకు అహర్నిశలు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎర్రబెల్లి దయాకర్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, వినయ్ భాస్కర్, తదితరులున్నారు.

News April 15, 2024

ఎడపల్లిలో బాలిక సూసైడ్

image

మండలానికి చెందిన ఓ బాలిక ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. బోధన్‌లోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో 8వ తరగతి చదువుతోంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇంట్లో వెతకగా 10 పేజీల లెటర్ లభ్యమైనట్లు వెల్లడించారు. 4 ఏళ్ల క్రితం ఆమె తండ్రి చనిపోవడంతో మనస్తాపానికి గురైనట్లు ఆమె తల్లి పేర్కొంది.

News April 15, 2024

KNR: ‘ఓపెన్ స్కూల్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి’

image

ఈనెల 25నుంచి మే 2వరకు జరుగనున్న ఓపెన్ స్కూల్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో ఓపెన్ స్కూల్ పరీక్షల నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో సోమవారం సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు సజావుగా సాగేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, పరీక్ష కేంద్రాల్లోకి ఫోన్లు అనుమతించొద్దన్నారు.

News April 15, 2024

ఆదిలాబాద్: పాలిసెట్ దరఖాస్తుకు 22న LAST

image

ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలలతో పాటుగా వ్యవసాయ, వెటర్నరీ, హార్టికల్చర్, ఫిషరీస్ డిప్లమోలలో ప్రవేశం కోసం నిర్వహించే పాలిటెక్నిక్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష పాలీసెట్ కొరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఆదిలాబాద్ సంజయ్ గాంధీ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ భరద్వాజ పేర్కొన్నారు. ఏప్రిల్ 22 వరకు దరఖాస్తుకు అవకాశం ఉందని, మే 17న ప్రవేశ పరీక్ష ఉంటుందని తెలిపారు. 150 మార్కులతో పరీక్ష ఉంటుందన్నారు.

News April 15, 2024

భద్రాచలం వద్ద రెండో బ్రిడ్జిని ప్రారంభించిన కలెక్టర్

image

భద్రాచలం గోదావరి నదిపై నిర్మించిన రెండవ వంతెనను జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా, ఎస్పీ సోమవారం మధ్యాహ్నం లాంఛనంగా ప్రారంభించారు. 2014లో అప్పటి రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వంతెనకు శంకుస్థాపన చేశారు. పదేళ్లుగా నిర్మిస్తున్న ఈ వంతెనను శ్రీరామనవమి నాటికి ప్రారంభిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. వంతెనను రూ. 100 కోట్ల వ్యయంతో 2 కీ.మీ పొడవు నిర్మించారు.

News April 15, 2024

HYD: అసలే ఎండాకాలం.. దొంగలతో జాగ్రత్త!

image

ఎండాకాలం వచ్చేసింది. HYD నగరంలో ఇంటిల్లిపాది విహారయాత్రలు, సొంతూళ్లకు వెళ్తుంటారు. ఏటా HYD, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్లలో కలిపి 3 వేలకు పైగా చోరీలు జరుగుతుంటే అందులో అధిక శాతం ఈ వేసవి మూడు నెలల వ్యవధిలోనివేనని అధికారులు తెలిపారు. అంతర రాష్ట్ర ముఠా సైతం వేసవిని ఆసరాగా చేసుకుంటున్నారు. అందుకే వేసవి వేళ, నగర ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు.