Telangana

News April 15, 2024

HYD: కంటోన్మెంట్ చరిత్రలోనే ఇది రెండవ ఉపఎన్నిక..!

image

సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ చరిత్రలోనే మే 13వ తేదీన జరగనున్న ఎన్నిక రెండో ఉప ఎన్నిక. 1957లో ఆవిర్భవించిన కంటోన్మెంట్ నియోజకవర్గంలో 1969లో అప్పటి ఎమ్మెల్యే రామారావు మృతితో తొలిసారిగా ఉపఎన్నిక జరిగింది. 2024లో ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో మే 13న రెండో ఉప ఎన్నిక జరగనుంది. BRS నుంచి లాస్య నివేదిత, కాంగ్రెస్ నుంచి శ్రీగణేశ్ బరిలో ఉండగా.. బీజేపీ ఇంకా ఖరారు చేయలేదు.

News April 15, 2024

MDK: బీజేపీతో రేవంత్ రెడ్డి ములాఖత్ అయ్యాడు: హరీశ్ రావు

image

CM రేవంత్ రెడ్డి తన పదవిని కాపాడుకునేందుకు బీజేపీ‌తో ములాఖత్ అయ్యాడని సిద్దిపేట MLA హరీశ్ రావు స్పష్టం చేశారు. జహీరాబాద్‌లో జరిగిన కార్యకర్తల మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. బీజేపీని గెలిపించేందుకు కొన్ని స్థానాల్లో డమ్మీ క్యాండిడేట్లను నిలబెట్టారని ఆరోపించారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే బీజేపీకి ఓటు వేసినట్టే అని ఆయన అన్నారు. ఇందులో MLA మాణిక్ రావు, BRS పార్టీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ తదితరులు ఉన్నారు.

News April 15, 2024

MBNR: రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యం: వంశీ చంద్‌రెడ్డి

image

రాబోయే పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే లక్ష్యంగా పనిచేయాలని మహబూబ్ నగర్ కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి అన్నారు. కొందుర్గు మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే శంకర్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నరేంద్ర మోడీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించారని మండిపడ్డారు.

News April 15, 2024

ఎన్నికల సహాయక కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి : కలెక్టర్

image

లోకసభ ఎన్నికలు-2024 సహాయక కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ అన్నారు. కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన లోకసభ ఎన్నికల సహాయక కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. లోక్ సభ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల సహాయార్థం సహాయక కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కేంద్రంలో ఎన్నికల సంఘం నుండి పంపబడిన నామినేషన్ పత్రాలు అభ్యర్థులకు అందుబాటులో ఉంచినట్టు తెలిపారు.

News April 15, 2024

మైనార్టీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. దరఖాస్తు గడువు తేదీ పొడగింపు

image

రాష్ట్ర మైనారిటీస్ స్టడీ సర్కిల్ , మైనారిటీల సంక్షేమ శాఖ వారు UPSC – CSAT 2025 పరీక్ష కోసం 100 మంది మైనారిటీ అభ్యర్ధుల నుండి ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి టి.విజయేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ గడువు తేదీ ఈ నెల 22 వరకు పొడిగించడం జరిగిందని తెలిపారు. ఆసక్తి కలిగిన మైనారిటీ విధ్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News April 15, 2024

HYD: కంటోన్మెంట్ చరిత్రలోనే ఇది రెండవ ఉపఎన్నిక..!

image

సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ చరిత్రలోనే మే 13వ తేదీన జరగనున్న ఎన్నిక రెండో ఉప ఎన్నిక. 1957లో ఆవిర్భవించిన కంటోన్మెంట్ నియోజకవర్గంలో 1969లో అప్పటి ఎమ్మెల్యే రామారావు మృతితో తొలిసారిగా ఉపఎన్నిక జరిగింది. 2024లో ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో మే 13న రెండో ఉప ఎన్నిక జరగనుంది. BRS నుంచి లాస్య నివేదిత, కాంగ్రెస్ నుంచి శ్రీగణేశ్ బరిలో ఉండగా.. బీజేపీ ఇంకా ఖరారు చేయలేదు.

News April 15, 2024

హైదరాబాద్‌: నేడే చివరి అవకాశం

image

కేంద్ర ప్రభుత్వ ఆమోదిత నేషనల్ అకాడమి ఆఫ్ సైబర్ సెక్యూరిటీ ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీ, ఎథికల్ హ్యాకింగ్ కోర్సుల ఆన్‌లైన్ శిక్షణకు HYD, RR, MDCL,VKB జిల్లాల యువతి, యువకుల నుంచి దరఖాస్తులను కోరుతున్నట్లు డైరెక్టర్ విమలారెడ్డి తెలిపారు. ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ పాలిటెక్నిక్, డిప్లొమా విద్యార్థులు ఏప్రిల్ 15వ తేదీలోపు https://www.nacsindia.org ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.SHARE IT

News April 14, 2024

RR: ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS

image

✓HYD,RR,MDCL,VKB జిల్లాల్లో ఘనంగా అంబేద్కర్ జయంతి
✓HYDలో అంబేద్కర్‌కు అవమానం: గంటా చక్రపాణి
✓ఆగస్టు చివరి నాటికి మూసి మాస్టర్ ప్లాన్ సిద్ధం
✓శంషాబాద్ ఫామ్ హౌస్ పై పోలీసుల రైడ్స్
✓ప్రజా పోరాటంతో తెలంగాణ సాధించాం:KTR
✓కొంపల్లి: నీట్ పరీక్ష భయంతో విద్యార్థి ఆత్మహత్య
✓హిమాయత్ సాగర్ అడుగున వ్యర్ధాలు
✓VKB జిల్లాలో తగ్గిన ఉష్ణోగ్రతలు గరిష్టంగా 32 డిగ్రీలు నమోదు.

News April 14, 2024

ధాన్యం కొనుగోలులో ఇబ్బందులు ఉంటే ఫోన్లో సంప్రదించండి: కలెక్టర్

image

ధాన్యం కొనుగోలులో ఏమైనా ఇబ్బందులుంటే రైతులు నేరుగా జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నంబర్ 7995050785కు సంప్రదించవచ్చని కలెక్టర్ ప్రావీణ్య కోరారు. జిల్లాలో 207ధాన్యం కొనుగోలు కేంద్రాలకు గాను ఇప్పటికే 186 కేంద్రాలున్నాయన్నారు. నర్సంపేట ధాన్యం ఆలస్యంగా రావడం దృష్ట్యా మిగిలిన సెంటర్లను కూడా ప్రారంభిస్తామన్నారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో తేమ శాతం పరిశీలించే యంత్రాలు అందుబాటులో ఉన్నాయన్నారు.

News April 14, 2024

సమావేశంలో పాల్గొన్న ఉమ్మడి జిల్లా మంత్రులు, నేతలు

image

రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ MP అభ్యర్థులు, ఇంచార్జిలతో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసి వేణుగోపాల్ నిర్వహించిన సమావేశంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీ అభ్యర్థులు, ఇన్చార్జులు పాల్గొన్నారు. పార్టీ గెలుపు కోసం తీసుకోవాల్సిన చర్యలపై నేతలకు జనరల్ సెక్రెటరీ వేణుగోపాల్ దిశా నిర్దేశం చేశారు. కార్యక్రమంలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ, ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి కావ్య పాల్గొన్నారు.