India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీలు, హామీలను అమలు చేసే శ్రద్ధ ఆ పార్టీకి లేదని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ విమర్శించారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రజలను మోసం చేసిన మాదిరిగానే కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. వడ్లకు క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్ ఇస్తామని, రుణమాఫీ అమలు చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి ఆ హామీలను మరిచిపోయారని మండిపడ్డారు.
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని వివిధ కాలనీలకు చెందిన బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల కార్యకర్తలు, నాయకులు ఆదివారం మాజీ మంత్రి డీకే అరుణ సమక్షంలో బీజేపీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆమె వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆమె మాట్లాడుతూ.. 3వ సారి నరేంద్ర మోడీని ప్రధాని చేయడమే లక్ష్యంగా పార్టీలో చేరినట్లు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
భూత్పూర్ మున్సిపల్ కేంద్రంలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి మన్నే శ్రీనివాస్ రెడ్డి కి మద్దతుగా మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి సమావేశం ఏర్పాటు చేశారు. మాజీ ఎమ్మెల్యే ఆల మాట్లాడుతూ.. బోనస్ ఇస్తా అని మద్దతు ధర కూడా రైతులకు ఇవ్వట్లేదని అన్నారు. తెచ్చిన తెలంగాణను అభివృద్ధి చేసుకున్నాం, నాలుగు నెలల్లోనే తెలంగాణలో కరువు ఛాయలు కనిపిస్తున్నాయని మండిపడ్డారు.
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మరోసారి వరంగల్ గడ్డపై గులాబీ జెండా ఎగురవేయాలని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ వరంగల్ ఎంపీ అభ్యర్థి సుధీర్ కుమార్తో మాజీ సీఎం కేసీఆర్ సమావేశం నిర్వహించారు. పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గం ప్రచారం నిర్వహించాలని ఎంపీ అభ్యర్థి సుధీర్ కుమార్కు కేసీఆర్ సూచించారు.
బీఆర్ఎస్ పార్టీకి ఈ పార్లమెంట్ ఎన్నికలు సవాల్గా మారాయి. సత్తా చాటేందుకు నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి MBNRలో ఉన్న 2 స్థానాలకు అభ్యర్థులను రంగంలోకి దింపిన పార్టీ అధిష్ఠానం ప్రత్యేక దృష్టి సారించింది. ఓ వైపు మన్నె శ్రీనివాస్ రెడ్డి, మరోవైపు RSPవిస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అధికార కాంగ్రెస్, బీజేపీలోనూ బలమైన అభ్యర్థులు నిలవడంతో BRSసర్వశక్తులూ ఒడ్డుతోంది. దీనిపై మీ కామెంట్?
నల్గొండ జిల్లాలో ధాన్యం సేకరణ వేగవంతంగా జరుగుతున్నది. రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేసేందుకుగాను ఈ యాసంగిలో జిల్లాలో 370 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ఇప్పటివరకు 171 కోట్ల రూపాయల విలువ చేసే 77,783 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. శనివారం నాటికి రూ.12.66 కోట్లు రైతుల ఖాతాలో జమ చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ హరిచందన తెలిపారు.
కలెక్టర్గా ఇక్కడికి 100 సార్లు వచ్చానని, నేడు ఎంపీ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్న నన్ను ఆశీర్వదించాలని ఎంపీ అభ్యర్థి, మాజీ కలెక్టర్, ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డి కోరారు. జగదేవపూర్లో జరిగిన జగదేవపూర్, మర్కుక్ మండల బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్సీ వంటేరు యాదవ రెడ్డి, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డితో కలిసి మాట్లాడారు. వచ్చే 30 రోజుకు నా కోసం కష్టపడాలని కార్యకర్తలను కోరారు.
HYD నగరంలో మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్టులోని అన్ని అంశాల సాధ్యాసాధ్యాలను అధికారులు పరిశీలించారు. డీపీఆర్, కాన్సెప్ట్ మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు నిర్దిష్ట కాలపరిమితిని నిర్ణయించారు. 2024 ఆగస్టు నెలాఖరులోగా మాస్టర్ ప్లాన్ ముసాయిదా సిద్ధమవుతుందని MRFDC ఎండీ ఆమ్రపాలి చెప్పారు. మొదటిదశలో ఉస్మాన్సాగర్ నుంచి గౌరెల్లి ORR, హిమాయత్సాగర్ నుంచి బాపూఘాట్ వరకు 55KM మూసీ అభివృద్ధి పై ఫోకస్ పెట్టారు.
HYD నగరంలో మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్టులోని అన్ని అంశాల సాధ్యాసాధ్యాలను అధికారులు పరిశీలించారు. డీపీఆర్, కాన్సెప్ట్ మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు నిర్దిష్ట కాలపరిమితిని నిర్ణయించారు. 2024 ఆగస్టు నెలాఖరులోగా మాస్టర్ ప్లాన్ ముసాయిదా సిద్ధమవుతుందని MRFDC ఎండీ ఆమ్రపాలి చెప్పారు. మొదటిదశలో ఉస్మాన్సాగర్ నుంచి గౌరెల్లి ORR, హిమాయత్సాగర్ నుంచి బాపూఘాట్ వరకు 55KM మూసీ అభివృద్ధి పై ఫోకస్ పెట్టారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీ సీఎం జగన్పై రాళ్ల దాడి జరిగిన విషయం తెలిసిందే. దీంతో సీఎం జగన్ కనుబొమ్మపైన గాయమైంది. దీనిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు. ఖమ్మం పర్యటనలో ఉన్న ఆయన అక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ప్రచారంలో హింసతో కూడిన కార్యక్రమాలు మంచివి కాదన్నారు. ఏ రాజకీయ పార్టీ అయినా ఇలాంటి ఘటనలను ఎవరూ సమర్థించరన్నారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి నిందితులపై చర్యలు తీసుకోవాలన్నారు.
Sorry, no posts matched your criteria.