India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గద్వాలలోని పాత హౌసింగ్ బోర్డ్ కాలనీ సమీపంలోనున్న ఫాతిమా మజీద్ వద్ద గుర్తుతెలియని రైలు ఢీకొని ఓ మహిళ మృతి చెందింది. ప్రమాదాన్ని గుర్తించిన కాలనీవాసులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు డెడ్ బాడీని ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున జరిగినట్లు పేర్కొన్నారు.
ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
అభం శుభం తెలియని చిన్నారులను సైతం కామాంధులు వదలడం లేదు. ఆరేళ్ల చిన్నారితో ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించిన ఘటన మలక్పేట్ PS పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. సలీంనగర్ వాసి సుబ్బారావు(52)కు ముసారాంబాగ్లో కిరాణా షాప్ ఉంది. దుకాణానికి వచ్చిన ఓ చిన్నారి(6)తో అతడు అసభ్యంగా ప్రవర్తించాడు. బాలిక ఏడుస్తూ వెళ్లి తల్లిదండ్రులకు విషయం చెప్పగా వారు PSలో ఫిర్యాదు చేశారు. పోక్సో కేసు నమోదైంది.
అభం శుభం తెలియని చిన్నారులను సైతం కామాంధులు వదలడం లేదు. ఆరేళ్ల చిన్నారితో ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించిన ఘటన మలక్పేట్ PS పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. సలీంనగర్ వాసి సుబ్బారావు(52)కు ముసారాంబాగ్లో కిరాణా షాప్ ఉంది. దుకాణానికి వచ్చిన ఓ చిన్నారి(6)తో అతడు అసభ్యంగా ప్రవర్తించాడు. బాలిక ఏడుస్తూ వెళ్లి తల్లిదండ్రులకు విషయం చెప్పగా వారు PSలో ఫిర్యాదు చేశారు. పోక్సో కేసు నమోదైంది.
యాభై కుటుంబాలతో చూడటానికి చిన్న గ్రామమైనా.. ఆదర్శంలో మాత్రం పెద్దది. దేశ సేవకోసం మేము సైతం అంటూ ఆ గ్రామ యువత కదిలారు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు ఏకంగా 25మందికిపైగా సైన్యంలో చేరి దేశ రక్షణలో తమవంతు బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. మర్కూక్ మండలం గంగాపూర్కు రాజస్థాన్, హర్యానా రాష్ట్రాల నుంచి ఎన్నో ఏళ్ల కిందట వచ్చిన ‘రాజ్పుత్’లతో గంగాపూర్గా ఆవిర్భవించింది. చాలా ఏళ్ల కిందట ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారు.
తిరుపతి వెళ్లే వారి వద్ద డబ్బులు తీసుకుని మోసం చేసిన వ్యక్తిపై కేసు నమోదైన ఘటన ఎల్బీనగర్ PS పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. బైరామల్గూడ వాసి కపిల్ రెడ్డిని చరణ్ అనే వ్యక్తి పరిచయం చేసుకున్నాడు. తాను TTD ఛైర్మన్ PA అని, శ్రీవారి దర్శనం టికెట్లు బుక్ చేస్తానని నమ్మించి ఈనెల 7న రూ.1,60,900 తీసుకున్నాడు. ఆ తర్వాత కపిల్.. చరణ్కు ఫోన్ చేయగా సమాధానం ఇవ్వలేదు. బాధితుడు PSలో ఫిర్యాదు చేశాడు.
తిరుపతి వెళ్లే వారి వద్ద డబ్బులు తీసుకుని మోసం చేసిన వ్యక్తిపై కేసు నమోదైన ఘటన ఎల్బీనగర్ PS పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. బైరామల్గూడ వాసి కపిల్ రెడ్డిని చరణ్ అనే వ్యక్తి పరిచయం చేసుకున్నాడు. తాను TTD ఛైర్మన్ PA అని, శ్రీవారి దర్శనం టికెట్లు బుక్ చేస్తానని నమ్మించి ఈనెల 7న రూ.1,60,900 తీసుకున్నాడు. ఆ తర్వాత కపిల్.. చరణ్కు ఫోన్ చేయగా సమాధానం ఇవ్వలేదు. బాధితుడు PSలో ఫిర్యాదు చేశాడు.
ఈ నెల 18న లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుండగా.. మే 13న పోలింగ్ జరగనుంది. అయితే ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో చాలా మంది ఓటరుగా పేరు నమోదు చేసుకోలేదు. 2006 మార్చి 31లోపు పుట్టిన వారంతా ఓటరుగా నమోదు చేసుకోవడానికి ఈ నెల 15 వరకు సమయం ఉంది. ఫారం-6 నింపి, ధ్రువీకరణ పత్రాల నకలు, పాస్ ఫొటోలు జతపర్చి స్థానిక BLOకు అందజేయండి. లేదంటే స్థానిక మీసేవ సెంటర్లో అప్లై చేసుకోవచ్చు. అంతేకాదు మార్పులు చేసుకోవచ్చు.
నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి ఈనెల 15న కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారైనట్లు సమాచారం. మెదక్ బీఆర్ఎస్ ఎంపీ టికెట్ను వెంకట్రామిరెడ్డికి కేసీఆర్ కేటాయించారు. దీంతో కాంగ్రెస్లో చేరేందుకు ఇటీవల మాజీ ఎమ్మెల్యే మైనంపల్లితో వెళ్లి రేవంత్రెడ్డిని కలిసి చర్చించారు. సీఎం నుంచి క్లారిటీ రావడంతో కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమైనట్లు టాక్. అయితే చేరికపై క్లారిటీ రావాల్సి ఉంది.
కోతల సమయంలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో అకాల వర్షాలు అన్నదాతలను నిండా ముంచాయి. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం చిన్న మావందిలో 40.3 మి.మీ, కామారెడ్డి జిల్లా బాన్సువాడలో 26.5, బిచ్కందలో 25, మద్నూర్ మండలం మేనూరులో 20 జుక్కల్ లో 10.6 మి.మీ వర్షపాతం నమోదైంది. మార్కెట్ యార్డులు, కొనుగొలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దవడంతో రైతులు కన్నిటిపర్యంతమయ్యారు.
ప్రియురాలు మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతో మనోవేదనకు గురైన వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన HYD సూరారం PS పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. బిహార్ వాసి తన్వీర్ ఖాన్(27)కు మూడేళ్ల క్రితం వివాహమవగా బతుకుదెరువు నిమిత్తం HYD వచ్చి దయానంద్ నగర్లో ఉంటున్నాడు. కాగా పెళ్లికి ముందు అతడు ప్రేమించిన యువతికి ఇటీవల పెళ్లి జరిగింది. విషయం తెలిసి తన్వీర్ ఉరేసుకుని చనిపోయాడు. శనివారం కేసు నమోదైంది.
Sorry, no posts matched your criteria.