Telangana

News September 9, 2024

వరంగల్ మార్కెట్‌లో పెరిగిన పత్తి ధర

image

2 రోజుల విరామం తర్వాత వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ఈ రోజు మళ్లీ ప్రారంభమైంది. దీంతో పత్తి తరలి వచ్చింది. అయితే ధర మాత్రం గత వారంతో పోలిస్తే పెరిగింది. గత వారం గరిష్ఠంగా క్వింటా పత్తి ధర రూ.7,665 పలకగా.. నేడు రూ.7700 పలికిందని మార్కెట్ ఉన్నతశ్రేణి కార్యదర్శి నిర్మల తెలిపారు. మార్కెట్‌లో క్రయవిక్రయాలు కొనసాగుతున్నాయి.

News September 9, 2024

గ్రేటర్‌ వరంగల్‌లో అపురూపమైన కట్టడం!

image

గ్రేటర్‌ వరంగల్‌లో అపురూపమైన కట్టడంగా కాళోజీ కళాక్షేత్రం నిలవనుంది. కాళోజీ నారాయణరావు స్మారకార్థం హనుమకొండ హయగ్రీవాచారి మైదానంలో నిర్మిస్తున్న కళాక్షేత్రం ఓరుగల్లుకు తలమానికం కానుంది. హైదరాబాద్‌లోని రవీంద్రభారతికి దీటుగా దీనిని నిర్మించారు. సువిశాలమైన పరిసరాలు, ఆహ్లాదకరమైన ఉద్యానవనం, ప్రకృతి వాతావరణంలో ఈ కళాక్షేత్రం అందుబాటులోకి రానుంది.

News September 9, 2024

ADB: తండ్రికి శిక్ష పడుతుందేమోనని కొడుకు ఆత్మహత్య

image

కోర్టులో తన తండ్రికి శిక్ష పడుతుందేమో అన్న భయంతో కొడుకు పురుగు మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డ ఘటన జైనథ్ మండలంలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. గూడ రాంపూర్‌కు చెందిన దేవన్నపై జైనథ్ PSలో గతంలో అట్రాసిటీ కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి నేటి నుంచి వాదనలు ప్రారంభంకానున్నాయి. తండ్రికి శిక్ష పడుతుందేమోనని కొన్ని రోజులుగా కుంగిపోతున్న కొడుకు బండారి సంతోశ్(15)ఈ నెల 6న ఆత్మహత్య చేసుకున్నాడు.

News September 9, 2024

MDK: విద్యుదాఘాతంతో పారిశుధ్య కార్మికుడు మృతి

image

గణేశ్ మండపం వద్ద విషాదం జరిగింది. విద్యుదాఘాతంతో పంచాయతీ స్వీపర్ మృతి చెందిన ఘటన మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్ మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు.. రాజుపేట గ్రామానికి చెందిన దాసరి పోచయ్య (70) ఈరోజు ఉదయం మండపం వద్ద శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు విచారణ చేపట్టారు.

News September 9, 2024

లింగంపేట్: మటన్ ముక్క కోసం గొడవ

image

మటన్ ముక్కల కోసం కామారెడ్డి జిల్లాలో ఆదివారం గొడవ జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. లింగంపేటలోని ఓ ఫంక్షన్ హాల్‌లో భోజనాల సమయంలో బంధువులకు మటన్ ముక్కలు తక్కువగా వేశారని వడ్డించే వారిపై దాడి చేశారు. దీంతో ఇరు వర్గాల వారు దాడులు చేసుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి. ఇరువురు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. వారు రాజీ పడ్డారని ఎస్సై అరుణ్ కుమార్ తెలిపారు.

News September 9, 2024

NLG: రూ.10లక్షలు గెలిచే ఛాన్స్

image

RBI 90వ ఏడాదిలోకి అడుగుపెడుతున్న సందర్భంగా డిగ్రీ విద్యార్థులకు RBI-90 పేరిట క్విజ్ నిర్వహిస్తోంది. గెలిస్తే రూ.10 లక్షల ప్రైజ్ మనీ ఇవ్వనున్నారు. ఈ పోటీలో పాల్గొనేందుకు www.rbi90quiz.in వెబ్‌సైట్‌ ద్వారా ఈనెల17 వరకు దరఖాస్తు చేసుకోవాలి. ఈనెల 19నుంచి 21 వరకు ఉ.9 నుంచి రా.9గం.వరకు పోటీలు జరగనున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాల్లో మొత్తం 50కి పైగా కళాశాలలు ఉన్నాయి. 15వేల మందికిపైగా చదువుకుంటున్నారు.

News September 9, 2024

HYD: ఫస్ట్ ఫేజ్‌లో 21,505 మందికి సీట్ల కేటాయింపు

image

పీజీ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించిన పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ టెస్ట్ ఫస్ట్ ఫేజ్ సీట్ల అలాట్మెంట్ పూర్తయింది. రాష్ట్ర వ్యాప్తంగా 28,323 మంది వెబ్ ఆప్షన్లు ఇవ్వగా, వాటిలో 21,505మందికి సీట్లు అలాట్ చేసినట్టు సీపీగెట్ ప్రొఫెసర్ ఐ.పాండు రంగారెడ్డి చెప్పారు. దీనిలో అమ్మాయిలు 15,694మంది ఉండగా, అబ్బాయిలు 5,811మంది ఉన్నారు. సీట్లు పొందిన విద్యార్థులు ఈనెల13 లోగా కాలేజీల్లో రిపోర్టు చేయాలన్నారు.

News September 9, 2024

HYD: ఫస్ట్ ఫేజ్‌లో 21,505 మందికి సీట్ల కేటాయింపు

image

పీజీ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించిన పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ టెస్ట్ ఫస్ట్ ఫేజ్ సీట్ల అలాట్మెంట్ పూర్తయింది. రాష్ట్ర వ్యాప్తంగా 28,323 మంది వెబ్ ఆప్షన్లు ఇవ్వగా, వాటిలో 21,505మందికి సీట్లు అలాట్ చేసినట్టు సీపీగెట్ ప్రొఫెసర్ ఐ.పాండు రంగారెడ్డి చెప్పారు. దీనిలో అమ్మాయిలు 15,694మంది ఉండగా, అబ్బాయిలు 5,811మంది ఉన్నారు. సీట్లు పొందిన విద్యార్థులు ఈనెల13 లోగా కాలేజీల్లో రిపోర్టు చేయాలన్నారు.

News September 9, 2024

HYD: రేపటి నుంచి టీజీసెట్ పరీక్షలు ప్రారంభం

image

టీజీసెట్ పరీక్షలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. 3 రోజుల పాటు జరిగే ఈ పరీక్షలకు 33,764 మంది అటెండ్ కానున్నారని టీజీ సెట్ మెంబర్ సెక్రటరీ గడ్డం నరేశ్ రెడ్డి తెలిపారు. ప్రతిరోజు ఉ.9 గంటల నుంచి మ.12 గంటల వరకు, మ.2 నుంచి సా. 5 వరకు పరీక్షలు జరుగుతాయని చెప్పారు. పరీక్ష ప్రారంభం కావడానికి 15 నిమిషాల ముందే గేట్లు మూసివేస్తామని వెల్లడించారు. అభ్యర్థులు సకాలంలో పరీక్ష కేంద్రానికి చేరుకోవాలన్నారు.

News September 9, 2024

HYD: రేపటి నుంచి టీజీసెట్ పరీక్షలు ప్రారంభం

image

టీజీసెట్ పరీక్షలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. 3 రోజుల పాటు జరిగే ఈ పరీక్షలకు 33,764 మంది అటెండ్ కానున్నారని టీజీ సెట్ మెంబర్ సెక్రటరీ గడ్డం నరేశ్ రెడ్డి తెలిపారు. ప్రతిరోజు ఉ.9 గంటల నుంచి మ.12 గంటల వరకు, మ.2 నుంచి సా. 5 వరకు పరీక్షలు జరుగుతాయని చెప్పారు. పరీక్ష ప్రారంభం కావడానికి 15 నిమిషాల ముందే గేట్లు మూసివేస్తామని వెల్లడించారు. అభ్యర్థులు సకాలంలో పరీక్ష కేంద్రానికి చేరుకోవాలన్నారు.