Telangana

News September 9, 2024

NLG: రూ.10లక్షలు గెలిచే ఛాన్స్

image

RBI 90వ ఏడాదిలోకి అడుగుపెడుతున్న సందర్భంగా డిగ్రీ విద్యార్థులకు RBI-90 పేరిట క్విజ్ నిర్వహిస్తోంది. గెలిస్తే రూ.10 లక్షల ప్రైజ్ మనీ ఇవ్వనున్నారు. ఈ పోటీలో పాల్గొనేందుకు www.rbi90quiz.in వెబ్‌సైట్‌ ద్వారా ఈనెల17 వరకు దరఖాస్తు చేసుకోవాలి. ఈనెల 19నుంచి 21 వరకు ఉ.9 నుంచి రా.9గం.వరకు పోటీలు జరగనున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాల్లో మొత్తం 50కి పైగా కళాశాలలు ఉన్నాయి. 15వేల మందికిపైగా చదువుకుంటున్నారు.

News September 9, 2024

HYD: ఫస్ట్ ఫేజ్‌లో 21,505 మందికి సీట్ల కేటాయింపు

image

పీజీ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించిన పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ టెస్ట్ ఫస్ట్ ఫేజ్ సీట్ల అలాట్మెంట్ పూర్తయింది. రాష్ట్ర వ్యాప్తంగా 28,323 మంది వెబ్ ఆప్షన్లు ఇవ్వగా, వాటిలో 21,505మందికి సీట్లు అలాట్ చేసినట్టు సీపీగెట్ ప్రొఫెసర్ ఐ.పాండు రంగారెడ్డి చెప్పారు. దీనిలో అమ్మాయిలు 15,694మంది ఉండగా, అబ్బాయిలు 5,811మంది ఉన్నారు. సీట్లు పొందిన విద్యార్థులు ఈనెల13 లోగా కాలేజీల్లో రిపోర్టు చేయాలన్నారు.

News September 9, 2024

HYD: ఫస్ట్ ఫేజ్‌లో 21,505 మందికి సీట్ల కేటాయింపు

image

పీజీ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించిన పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ టెస్ట్ ఫస్ట్ ఫేజ్ సీట్ల అలాట్మెంట్ పూర్తయింది. రాష్ట్ర వ్యాప్తంగా 28,323 మంది వెబ్ ఆప్షన్లు ఇవ్వగా, వాటిలో 21,505మందికి సీట్లు అలాట్ చేసినట్టు సీపీగెట్ ప్రొఫెసర్ ఐ.పాండు రంగారెడ్డి చెప్పారు. దీనిలో అమ్మాయిలు 15,694మంది ఉండగా, అబ్బాయిలు 5,811మంది ఉన్నారు. సీట్లు పొందిన విద్యార్థులు ఈనెల13 లోగా కాలేజీల్లో రిపోర్టు చేయాలన్నారు.

News September 9, 2024

HYD: రేపటి నుంచి టీజీసెట్ పరీక్షలు ప్రారంభం

image

టీజీసెట్ పరీక్షలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. 3 రోజుల పాటు జరిగే ఈ పరీక్షలకు 33,764 మంది అటెండ్ కానున్నారని టీజీ సెట్ మెంబర్ సెక్రటరీ గడ్డం నరేశ్ రెడ్డి తెలిపారు. ప్రతిరోజు ఉ.9 గంటల నుంచి మ.12 గంటల వరకు, మ.2 నుంచి సా. 5 వరకు పరీక్షలు జరుగుతాయని చెప్పారు. పరీక్ష ప్రారంభం కావడానికి 15 నిమిషాల ముందే గేట్లు మూసివేస్తామని వెల్లడించారు. అభ్యర్థులు సకాలంలో పరీక్ష కేంద్రానికి చేరుకోవాలన్నారు.

News September 9, 2024

HYD: రేపటి నుంచి టీజీసెట్ పరీక్షలు ప్రారంభం

image

టీజీసెట్ పరీక్షలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. 3 రోజుల పాటు జరిగే ఈ పరీక్షలకు 33,764 మంది అటెండ్ కానున్నారని టీజీ సెట్ మెంబర్ సెక్రటరీ గడ్డం నరేశ్ రెడ్డి తెలిపారు. ప్రతిరోజు ఉ.9 గంటల నుంచి మ.12 గంటల వరకు, మ.2 నుంచి సా. 5 వరకు పరీక్షలు జరుగుతాయని చెప్పారు. పరీక్ష ప్రారంభం కావడానికి 15 నిమిషాల ముందే గేట్లు మూసివేస్తామని వెల్లడించారు. అభ్యర్థులు సకాలంలో పరీక్ష కేంద్రానికి చేరుకోవాలన్నారు.

News September 9, 2024

శృంగేరి పీఠానికి బయలుదేరిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

image

వేములవాడ ఎమ్మెల్యే , ఆది శ్రీనివాస్ ఆదివారం రాత్రి శృంగేరి పీఠానికి బయలుదేరారు. దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టేందుకు శృంగేరి పీఠాధిపతుల అనుమతులు పొందడానికి వెళ్లినట్టు తెలిపారు. వివిధ నిర్మాణాల నమూనాలు, నిర్మాణ ప్రాంతాల ఫొటోలతో పీఠాధిపతులకు వివరించనున్నారు.

News September 9, 2024

HYD: డ్రగ్స్ సరఫరా, వినియోగం కట్టడికి మరిన్ని చర్యలు

image

డ్రగ్స్ సరఫరా, వినియోగం కట్టడికి మరింత దూకుడుగా వ్యవహరించేందుకు పోలీసు, ఆబ్కారీ యంత్రాంగం సిద్ధమైంది. వారాంతపు సమయాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టనున్నారు. అనుమానితుల మూత్ర నమూనాలు సేకరించి డ్రగ్స్ డిటెక్షన్ కిట్స్ ద్వారా కేవలం 2-5 నిమిషాల వ్యవధిలో పరీక్షించవచ్చు. డ్రగ్స్ తీసుకున్నట్టు గుర్తించిన వారితో మత్తుపదార్థాల సరఫరాపై వివరాలు తెలుసుకొని కీలక వ్యక్తుల అరెస్టుకు సిద్ధమవుతున్నారు.

News September 9, 2024

HYD: డ్రగ్స్ సరఫరా, వినియోగం కట్టడికి మరిన్ని చర్యలు

image

డ్రగ్స్ సరఫరా, వినియోగం కట్టడికి మరింత దూకుడుగా వ్యవహరించేందుకు పోలీసు, ఆబ్కారీ యంత్రాంగం సిద్ధమైంది. వారాంతపు సమయాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టనున్నారు. అనుమానితుల మూత్ర నమూనాలు సేకరించి డ్రగ్స్ డిటెక్షన్ కిట్స్ ద్వారా కేవలం 2-5 నిమిషాల వ్యవధిలో పరీక్షించవచ్చు. డ్రగ్స్ తీసుకున్నట్టు గుర్తించిన వారితో మత్తుపదార్థాల సరఫరాపై వివరాలు తెలుసుకొని కీలక వ్యక్తుల అరెస్టుకు సిద్ధమవుతున్నారు.

News September 9, 2024

KMM: రూ.10లక్షలు గెలుచుకునే ఛాన్స్

image

RBI 90వ ఏడాదిలోకి అడుగుపెడుతున్న సందర్భంగా డిగ్రీ విద్యార్థులకు RBI-90 పేరిట క్విజ్ నిర్వహిస్తోంది. ఈ పోటీలో పాల్గొనేందుకు www.rbi90quiz.in వెబ్సైట్ ద్వారా ఈనెల17 వరకు దరఖాస్తు చేసుకోవాలి. ఈనెల 19 నుంచి 21 వరకు ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు పోటీలు జరగనున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో మొత్తం 186 కళాశాలలు ఉన్నాయి. అందులో విద్యార్థులంతా పాల్గొనే అవకాశం ఉంది.

News September 9, 2024

కరీంనగర్: భారీగా పెరుగుతున్న నిత్యావసర సరకుల ధరలు!

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కూరగాయలు, వంట నూనెలు, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇతర రాష్ట్రాల నుంచి సరఫరా తగ్గిపోయింది. దీంతో ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. పది రోజుల్లోనే వెల్లుల్లి కిలో ధర రూ.200 ఉండగా ప్రస్తుతం రూ.400 వరకు ఉంది. అటు ఉల్లి ధర కిలో రూ.30 ఉండగా, ప్రస్తుతం రూ.50 నుంచి రూ.60 దాకా పలుకుతోంది.