India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కరీంనగర్ పార్లమెంట్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ నామినేషన్ ముహూర్తం ఖరారైంది. ఈనెల 19న కరీంనగర్లో నామినేషన్ వేయనున్నట్లు బండి సంజయ్ ప్రకటించారు. నామినేషన్ కార్యక్రమానికి భారీ సంఖ్యలో కార్యకర్తలు తరలిరావాలని పిలుపునిచ్చారు. కరీంనగర్ లో బీజేపీ గెలుస్తుందని సర్వేలన్నీ స్పష్టం చేస్తున్నాయన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు అబద్ధాలతో ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
ఉమ్మడి జిల్లాలో ఉష్ణోగ్రతలు ఇలా నమోదయ్యాయి. అత్యధికంగా నాగర్ కర్నూలు జిల్లా కోడేరులో 41.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. గద్వాల జిల్లా ఐజలో 40.9, వనపర్తి జిల్లా కానాయిపల్లిలో 40.8, మహబూబ్నగర్ జిల్లా వడ్డేమాన్ లో 40.5, నారాయణపేట జిల్లా ధన్వాడలో 40.0 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ప్రమాదంలో తండ్రి.. <<13037266>>అనారోగ్యంతో తల్లి మృతి<<>>తో ముగ్గురు ఆడపిల్లలు అనాథలయ్యారు. మూసాపేట మండలం నందిపేటకు చెందిన వెంకట్రాముడు, రాణెమ్మ దంపతులకు ఐదుగురు కుమార్తెలు. 2011లో భర్త చనిపోగా ఇద్దరు పిల్లల పెళ్లిళ్లు చేసిన ఆమె అనారోగ్యంతో మృతిచెందారు. దీంతో పిల్లలు శ్రీలత(17), శిల్ప, వెన్నెల అనాథలయ్యారు. చిన్నాన్న దినకూలీ, నాన్నమ్మకు కాలు విరిగి ఇంటికే పరిమితమైంది. పిల్లలను ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన ఘటన ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన కథనం ప్రకారం.. మండలం నాచేపల్లి గ్రామానికి చెందిన సట్టు నాగరాజు(29) గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో పడి మృతి చెందాడు. గమనించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఆదిలాబాద్ పట్టణంలో ఓ మురికి కాల్వలో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో సంఘ భవన సమీపంలోని శుక్రవారం మురికి కాల్వలో పడి చౌహన్ సంతోష్ అనే వ్యక్తి మృతి చెందాడు. అతను రోడ్లపై దొరికే సామగ్రిని విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నట్లు సమాచారం. అయితే మురికికాలువలో ప్రమాదవశాత్తు పడ్డాడా లేదా ఇంకా ఏమైనా కారణం ఉందా తెలియాల్సి ఉంది. ఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు.
కాసిపేట మండలంలోని ముత్యంపల్లికి చెందిన చొప్పరి బాలయ్య అనే వృద్దుడు పాము కాటుతో మృతి చెందాడు. మృతుడు దుబ్బగూడెం సమీపంలో మామిడి తోటకు కాపలాగా ఉంటున్నాడు. గురువారం అపస్మారక స్థితిలో పడి ఉన్న బాలయ్యను చూసిన కొందరు కుటుంబీకులకు సమాచారం అందించగా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే లోపు మృతి చెందాడు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు.
కాసిపేట మండలంలోని ముత్యంపల్లికి చెందిన చొప్పరి బాలయ్య అనే వృద్దుడు పాము కాటుతో మృతి చెందాడు. మృతుడు దుబ్బగూడెం సమీపంలో మామిడి తోటకు కాపలాగా ఉంటున్నాడు. గురువారం అపస్మారక స్థితిలో పడి ఉన్న బాలయ్యను చూసిన కొందరు కుటుంబీకులకు సమాచారం అందించగా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే లోపు మృతి చెందాడు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు.
వేములవాడ రాజరాజేశ్వరస్వామి వారి ఆలయంలో శుక్రవారం భక్తుల రద్దీ నెలకొంది. వరుసగా సెలవులు రావడంతో రాజన్నను దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూలైన్లో బారులుదీరారు. అనంతరం ఆలయంలోకి ప్రవేశించిన భక్తులు రాజన్నను దర్శించుకొని తరించారు.
మందమర్రి మండలం క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధి రామక్రిష్ణాపూర్ పట్టణంలోని అల్లూరి సీతారామరాజునగర్లో దారుణం జరిగింది. కుటుంబ తగాదాలతో గురువారం రాత్రి కన్నతండ్రిని కుమారుడు హతమార్చాడు. సింగరేణిలో పనిచేసి పదవీ విరమణ పొందిన బామండ్లపల్లి రాయమల్లును కుమారుడు రాకేష్ రోకలి బండతో కొట్టి హత్య చేశాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పాలమూరు జిల్లాలో భూగర్భజలాలు రోజురోజుకు అడుగంటుతున్నాయి. నాలుగేళ్ల క్రితం భూగర్భ జలాలు 10 మీటర్ల కన్నా ఎక్కువ లోతుకు వెళ్లగా ప్రస్తుతం జిల్లాలో 11.43 మీటర్ల లోతుకు నీరు వెళ్లిపోయింది. 2020 తరువాత ఈ స్థాయిలో లోతుకు నీరు వెళ్లడం ఇదే తొలిసారి. గతేడాది మార్చిలో 7.97 మీ. లోతులో నీరుండగా ప్రస్తుతం గతేడాదికి అదనంగా మరో 3.46 మీ. లోతుకు నీరు వెళ్లిపోవడంతో బోర్లలో నీటిమట్టం తగ్గిపోతోంది.
Sorry, no posts matched your criteria.