India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
హనుమకొండ జిల్లా కేంద్రంలోని నయీంనగర్ పెద్ద మోరీ వద్ద బ్రిడ్జి నిర్మిస్తున్న సందర్భంగా బస్సులు ములుగు రోడ్డు నుంచి తిరిగి వెళుతున్నాయి. దీంతో బస్సు ఛార్జీలు నేటి నుంచి ఆర్టీసీ అధికారులు పెంచారు. హుజూరాబాద్ నుంచి హనుమకొండకు రూ.50 ఉంటే రూ.10 పెంచి రూ.60 చేశారు. బ్రిడ్జి నిర్మాణం వల్ల ప్రయాణికులపై భారం మోపడం సరికాదని విమర్శలు వస్తున్నాయి. పెంచిన ఛార్జీలు తగ్గించాలని ప్రయాణికులు కోరుతున్నారు.
హనుమకొండ జిల్లా కేంద్రంలోని నయీంనగర్ పెద్ద మోరీ వద్ద బ్రిడ్జి నిర్మిస్తున్న సందర్భంగా బస్సులు ములుగు రోడ్డు నుంచి తిరిగి వెళుతున్నాయి. దీంతో బస్సు ఛార్జీలు నేటి నుంచి ఆర్టీసీ అధికారులు పెంచారు. హుజూరాబాద్ నుంచి హనుమకొండకు రూ.50 ఉంటే రూ.10 పెంచి రూ.60 చేశారు. బ్రిడ్జి నిర్మాణం వల్ల ప్రయాణికులపై భారం మోపడం సరికాదని విమర్శలు వస్తున్నాయి. పెంచిన ఛార్జీలు తగ్గించాలని ప్రయాణికులు కోరుతున్నారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 53 గ్రామాల్లో తాగునీటి సమస్య ఏర్పడనున్నట్లు అధికారులు గుర్తించారు. వీటిలో నిజామాబాద్ లో 37, కామారెడ్డిలో 16 ఉన్నాయి. ఇక్కడ చేపట్టాల్సిన పనులకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మిషన్ భగీరథ పథకం అమల్లోకి వచ్చాక బోరుబావులు, చేతి పంపులను పట్టించుకోలేదు. ఇప్పుడు వాటి అవసరాన్ని గుర్తించి పునరుద్ధరించాలని అధికారులు నిర్ణయించారు.
జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం బండ నాగారం గ్రామం సమీపంలో ఓ వ్యవసాయ బావి వద్ద అనుమానాస్పదంగా రెండు నెమళ్లు మృతి చెందిన ఘటన జరిగింది. ఎండ తీవ్రతతో నెమళ్లు మృతి చెందినట్లు గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
నిజామాబాద్ లోక్సభ స్థానంలో ప్రధాన పార్టీలకు అభ్యర్థులు ఖరారవడంతో తమదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు. మరో 6 రోజుల్లో ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయనుండటంతో అభ్యర్థులు జనం మద్దతు కూడగట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాతో పాటు జగిత్యాల జిల్లాలో మూడు పార్టీల అభ్యర్థులు అర్వింద్, జీవన్ రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్ ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు.
ఎన్నికల సంఘం రూపొందించిన నియమావళిని ఉల్లంఘించిన వారికి కఠిన చర్యలు తప్పవని సూర్యాపేట జిల్లా SP రాహుల్ హెగ్డే హెచ్చరించారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో MCC కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో పోలీసులు రాజకీయ నాయకుల కార్యకలాపాల్లో పాల్గొనడం చట్ట విరుద్ధం. నేరేడుచర్లకి చెందిన అధికార పార్టీ నాయకుడి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న పాలకీడు కానిస్టేబుల్ చింతలచెరువు విష్ణును సస్పెండ్ చేసినట్లు తెలిపారు.
HYD: గురుకులాల్లో ఆర్ట్ టీచర్ పోస్టుల భర్తీకి మరోసారి నియామక పరీక్ష నిర్వహించాలని TREI-RBను హైకోర్టు ఆదేశించింది. ఇంగ్లిష్తో పాటు తెలుగులో పరీక్ష పేపర్ ఇవ్వాలని స్పష్టం చేసింది. నోటిఫికేషన్లో తెలుగు, ఇంగ్లిష్ పరీక్ష ఉంటుందని పేర్కొని, కేవలం ఆంగ్లంలోనే పరీక్షను నిర్వహించడంపై పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. కోర్టు తీర్పు పట్ల HYD, ఉమ్మడి RR జిల్లా విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.
ఆన్లైన్లో పరిచయమై ఓ వ్యక్తిని నమ్మించి తన ఖాతాలోంచి రూ.36 లక్షలు ఖాళీ చేసిన ఘటన జడ్చర్లలో చోటుచేసుకుంది. SI చంద్రమోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన సునీల్ జవహర్కు ఆన్లైన్లో గుర్తుతెలియని వ్యక్తి పరిచయం కాగా.. గూగుల్ వ్యూస్స్ ఇస్తే డబ్బులు వస్తాయని దీని కోసం యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పిన అతను సునీల్ ఖాతా నుంచి రూ.36 లక్షలు స్వాహా చేశారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదైంది.
∆} పలు శాఖలపై ఉమ్మడి ఖమ్మం జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం
∆} ఖమ్మం నగరంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటన
∆} పెనుబల్లిలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం
∆} దుమ్ముగూడెం మండలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} తల్లాడ మండలంలో ఎమ్మెల్యే రాగమయి పర్యటన
∆} భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు
∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు సెలవు
నియోజకవర్గ కేంద్రాల్లో నిరుపేదలు, మధ్య తరగతి కుటుంబాలకు ఉపయోగపడేలా ఫంక్షన్ హాళ్లు నిర్మిస్తామని మెదక్ BRS ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి అన్నారు. RCపురంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్ కేంద్రాల్లో సామాజిక భవనాలు నిర్మించి ఒక్క రూపాయి అద్దెకు ఇస్తామన్నారు. రూ.100 కోట్ల నిధులతో ఉచిత విద్యతోపాటు, నీట్, IAS, IPS కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు.
Sorry, no posts matched your criteria.