Telangana

News April 12, 2024

ఎన్నికల కోడ్ నేపథ్యంలో రూ. 4.55 కోట్లు సీజ్

image

ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నాటి నుండి గురువారం వరకు జిల్లా వ్యాప్తంగా రూ.1.71 లక్షల నగదు, రూ. 7.75 వేల విలువ గల మద్యం, 20, 000 విలువగల గంజాయి, రూ. 1.14 లక్షల విలువగల ఆభరణాలు, 86 లక్షల విలువగల ఇతర విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు సీజ్ చేశామని ఎస్పీ తెలిపారు. ఎక్సైజ్ శాఖ అధ్వర్యంలో 75 లక్షల విలువగల మద్యం సీజ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం రూ.4.55 కోట్లు సీజ్ చేశామన్నారు

News April 12, 2024

బీజేపీ జెండా ఎగురవేయాలి: KVR

image

ఆందోల్ నియోజకవర్గం టెక్మాల్‌లో జహీరాబాద్ ఎన్నికల నిర్వహణ కమిటీ సమావేశంలో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణరెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్లమెంట్ ఎన్నికల ప్రభారీ అభయ్ పాటిల్, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రేమెందర్ రెడ్డి హాజరయ్యారు. పార్లమెంటు ఎన్నికల్లో జహీరాబాద్ నియోజకవర్గంలో బీజేపీ జెండా ఎగరవేయాలని వారు సూచించారు.

News April 12, 2024

HYD: హుస్సేన్ సాగర్‌లో పంపింగ్ స్టేషన్లకు ప్రణాళిక!

image

HYD నగరంలోని హుస్సేన్‌సాగర్‌లో నీటి పై తేలియాడే ఫ్లోటింగ్ పంపింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు జలమండలి ప్రణాళిక సిద్ధం చేసింది. నీటిమట్టాలు తగ్గడం, డెడ్ స్టోరేజీ పడిపోయినప్పుడు ఎమర్జెన్సీ పంపింగ్ చేసే అవకాశం ఉందన్నారు. నీటి నిల్వలు పూర్తిస్థాయిలో తగ్గితే ఇబ్బందులు లేకుండా అప్రోచ్ ఛానల్ ద్వారా నీటిని పంప్ చేసి, శుద్ధి చేయనున్నారు.

News April 12, 2024

శ్రీరామనవమికి గదులు ఆన్‌లైన్‌ బుకింగ్ : కలెక్టర్

image

భద్రాచలంలో ఈనెల 17, 18 తేదీలలో జరిగే శ్రీరామనవమి, మహా పట్టాభిషేక మహోత్సవాల సందర్భంగా భక్తుల సౌకర్యార్థం ఆన్‌లైన్‌లో గదులు బుక్ చేసుకునే సౌకర్యం కల్పించబడిందని జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా ఒక ప్రకటన విడుదల చేశారు. https://book.bhadrachalamonline.com/book-hotel ఈ లింకు ద్వారా శ్రీరామ నవమి మహా పట్టాభిషేకానికి వచ్చే భక్తులు గదులు బుకింగ్ చేసుకోవాలని తెలిపారు. 

News April 11, 2024

నాగర్‌కర్నూలు లోక్‌సభ: BRS సమన్వయకర్తలు వీళ్లే..

image

నాగర్‌కర్నూలు లోక్‌సభ స్థానంలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ నియమించారు. నాగర్‌కర్నూలు లోక్‌సభ సమన్వయకర్తలు.. నాగర్‌కర్నూలు–వాల్యానాయక్‌, గద్వాల–ఇంతియాజ్‌ అహ్మద్‌, అలంపూర్‌–దేవరమల్లప్ప, కల్వకుర్తి–చాడా కిషన్‌రెడ్డి, వనపర్తి–బైకాని శ్రీనివాస్‌ యాదవ్, అచ్చంపేట – నవీన్‌కుమార్‌రెడ్డి, కొల్లాపూర్‌ – డాక్టర్‌ ఆంజనేయులు గౌడ్ నియమించారు.

News April 11, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

*రాజన్న సిరిసిల్ల జిల్లాలో మూడు ప్రైవేటు ఆసుపత్రుల ప్రసూతి గదుల సీజ్.
*ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి.
*ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రంజాన్ పర్వదిన వేడుకలు.
*మహదేవ్పూర్ మండలంలో వడ్డీ వ్యాపారుల ఇండ్లపై దాడులు.
*మెట్ పల్లి పట్టణంలో చాయ్ పై చర్చ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ ధర్మపురి అరవింద్.
*తన జీవితం తెరిచిన పుస్తకమన్న మాజీ మంత్రి కొప్పుల 

News April 11, 2024

నారాయణపేట: బీజేపీకి కీలక నేతలు రాజీనామా..!!

image

పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నారాయణపేట జిల్లాలో BJPకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. జిల్లాలోని ముగ్గురు కీలక నేతలు ఒకే రోజు రాజీనామా చేయడం సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. పార్టీ జిల్లా అధ్యక్షునిగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో నారాయణపేట బిజెపి అభ్యర్థిగా పోటీలో ఉన్న పాండు రెడ్డి, మక్తల్ అభ్యర్థిగా పోటీలో ఉన్న జలంధర్ రెడ్డి, జిల్లా కార్యదర్శిగా ఉన్న రఘురాం రెడ్డి ఈరోజు BJPకి రాజీనామా చేశారు.

News April 11, 2024

హైదరాబాద్: BRS, కాంగ్రెస్, MIM ఒక్కటే: కిషన్ రెడ్డి

image

BRS, కాంగ్రెస్, MIM మూడు పార్టీలు ఒక్కటేనని కిషన్ రెడ్డి అన్నారు. గతంలో‌ అధికారంలో ఉన్న BRSకు మద్దతు ఇచ్చిన MIM ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తోందని విమర్శించారు. ఫిరోజ్‌ఖాన్‌ మాటలే ఇందుకు నిదర్శనమన్నారు. వీళ్లంతా కలిసి హైదరాబాద్‌ను అభివృద్ధి చేసింది ఏంటని ప్రశ్నించారు. మతం పేరుతో రాజకీయం చేస్తున్నారంటూ ఆయన ఫైర్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో BJPకే అత్యధిక స్థానాలు వస్తాయని జోస్యం చెప్పారు.

News April 11, 2024

హైదరాబాద్: BRS, కాంగ్రెస్, MIM ఒక్కటే: కిషన్ రెడ్డి

image

BRS, కాంగ్రెస్, MIM మూడు పార్టీలు ఒక్కటేనని కిషన్ రెడ్డి అన్నారు. గతంలో‌ అధికారంలో ఉన్న BRSకు మద్దతు ఇచ్చిన MIM ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తోందని విమర్శించారు. ఫిరోజ్‌ఖాన్‌ మాటలే ఇందుకు నిదర్శనమన్నారు. వీళ్లంతా కలిసి హైదరాబాద్‌ను అభివృద్ధి చేసింది ఏంటని ప్రశ్నించారు. మతం పేరుతో రాజకీయం చేస్తున్నారంటూ ఆయన ఫైర్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో BJPకే అత్యధిక స్థానాలు వస్తాయని జోస్యం చెప్పారు.

News April 11, 2024

MBNR: సీఎం రేవంత్ పై డీకే అరుణ హాట్ కామెంట్స్

image

CM రేవంత్ రెడ్డిపై BJP ఎంపీ అభ్యర్థి DK అరుణ హాట్ కామెంట్స్ చేశారు. గురువారం జిల్లాలోని ఆమె మీడియాతో మాట్లాడారు. గతంలో MPగా ఉన్నప్పుడు పాలమూరు ప్రాజెక్ట్ సాధనలో CM రేవంత్ రెడ్డి పాత్ర ఉందా? అని ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం అయిందని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో సానుభూతి కోసం రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు.