India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
* చీఫ్ సెక్రటరీ తో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా కలెక్టర్లు. * పెగడపల్లి మండలంలో 400 గ్రాముల గంజాయి పట్టివేత. * మల్యాల మండలంలో ఉరి వేసుకొని యువకుడి ఆత్మహత్య. * కొండగట్టులో భద్రత ఏర్పాట్లను పరిశీలించిన జగిత్యాల ఎస్పీ. * వేములవాడ రూరల్ మండలంలో ఎండ వేడి తాళలేక చేపల మృతి. * కొండగట్టు అంజన్న దర్శించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్. * యూట్యూబ్ స్టార్ గంగవ్వకు సన్మానం.
ఈ నెల 18న లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుండగా.. మే 13న పోలింగ్ జరగనుంది. అయితే ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో చాలా మంది ఓటరుగా పేరు నమోదు చేసుకోలేదు. 2006 మార్చి 31లోపు పుట్టిన వారంతా ఓటరుగా నమోదు చేసుకోవడానికి మరో 6 రోజుల సమయం ఉంది. ఫారం-6 నింపి, ధ్రువీకరణ పత్రాల నకలు, పాస్ ఫొటోలు జతపర్చి స్థానిక BLOకు అందజేయండి. లేదంటే స్థానిక మీసేవ సెంటర్లో అప్లై చేసుకోవచ్చు. అంతేకాదు మార్పులు చేసుకోవచ్చు.
బాచుపల్లి PS పరిధిలో ఈ నెల 1న జరిగిన పిల్లి తేజస్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. హత్యకు పాల్పడిన 9 మంది నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. గత ఏడాది తన స్నేహితుడు తరుణ్ హత్యకు ప్రతీకారంగా తేజస్ను చంపేశారని పోలీసులు పేర్కొన్నారు. నిందితుల నుంచి 6 సెల్ఫోన్స్, 4 టూ వీలర్స్ను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.
మల్లాపూర్ మండల కేంద్రంలో ఈ నెల 5న అంబదాస్ అనే వ్యక్తిని హత్య చేసిన కందెల రవితేజ (21) అనే యువకుడిని బుధవారం అరెస్టు చేసినట్లు డిఎస్పి ఉమామహేశ్వరరావు తెలిపారు. తన తల్లితో మృతుడు సహజీవనం చేయడం ఇష్టం లేకపోవడంతో పాటు తన తల్లి సంపాదించే డబ్బులు వాడుకుంటున్నాడని, తన జల్సాలకు అడ్డు వస్తున్నాడనే నెపంతో రవితేజ హత్యకు పాల్పడ్డాడని వివరించారు. సమావేశంలో సిఐ నవీన్, ఎస్ఐ కిరణ్ కుమార్ పాల్గొన్నారు.
బాచుపల్లి PS పరిధిలో ఈ నెల 1న జరిగిన పిల్లి తేజస్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. హత్యకు పాల్పడిన 9 మంది నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. గత ఏడాది తన స్నేహితుడు తరుణ్ హత్యకు ప్రతీకారంగా తేజస్ను చంపేశారని పోలీసులు పేర్కొన్నారు. నిందితుల నుంచి 6 సెల్ఫోన్స్, 4 టూ వీలర్స్ను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.
లోక్ సభ ఎన్నికల కోడ్ నేపథ్యంలో జిల్లాలోని బార్డర్ చెక్ పోస్ట్ ల వద్ద నిర్వహించిన వాహనాల తనిఖీల్లో అనుమతి పత్రాలు లేకుండా తరలిస్తున్న నగదు రూ.2, 14, 500 సీజ్ చేసి గ్రీవెన్స్ కమిటీ కి అప్పగించినట్లు గద్వాల ఎస్పీ రితిరాజ్ తెలిపారు. బుధవారం నందిన్నె బార్డర్ చెక్ పోస్ట్ వద్ద రూ. 60,000, రాజోలి సుంకేసుల చెక్ పోస్ట్ వద్ద రూ.1,0000, గట్టు చెక్ పోస్ట్ వద్ద రూ. 54, 500 పట్టుబడినట్టు తెలిపారు.
పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా జిల్లాలో ఏర్పాటు చేసిన ఏడు పోలీసు చెక్ పోస్టుల్లో ఎలాంటి ఆధారాలు లేని రూ. 21,27,330 సీజ్ చేసినట్లు ఎస్పీ డాక్టర్ బాలస్వామి తెలిపారు. అలాగే రూ. 17,06,600 విలువగల ఫ్రీ బీస్, రూ.9,75,800 విలువైన 2535.800 లీటర్ల అక్రమ మద్యం పట్టుకున్నట్లు వివరించారు. వీటిని ఎన్నికల గ్రీవెన్స్ రిడ్రెస్సల్ కమిటీకి అప్పగించినట్లు వివరించారు.
త్రాగునీటి సరఫరాలో వచ్చే ఇబ్బందులను సత్వరమే పరిష్కరించాలని, ప్రజలకు ఎక్కడా, ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సంద్భంగా హైద్రాబాద్ నుండి రాష్ట్ర స్థాయి ఉన్నత స్థాయి అధికారులతో కలిసి ఆమె వేసవిలో త్రాగునీటి సరఫరాపై ఖమ్మం జిల్లా అధికారులతో వీడియో కాన్ఫిరెన్స్ నిర్వహించారు. నీటి సమస్యలపై సీఎస్ తెలుసుకున్నారు.
ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన దేవరకద్రలో చోటుచేసుకుంది. SI నాగన్న వివరాలు.. కోడూరు గ్రామానికి చెందిన వాకిటి శివకుమార్(22), హరిజన్ గణేష్(20) ఇద్దరు స్నేహితులు ఈరోజు కన్నయ్య బావి దగ్గరకు ఈతకు వెళ్లారు. శివ కుమార్ బావిలోకి దిగి ఈత కొడుతుండగా గణేష్ కూడా మెల్లగా బావిలోకి దిగాడు. గణేష్కు ఈత రాక మునిగిపోతుండగా శివకుమార్ కాపాడేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఇద్దరూ మునిగి చనిపోయారు.
ఉస్మానియా యూనివర్సిటీ BED హాస్టల్ మెస్లో నాణ్యత ఉండడం లేదని విద్యార్థులు బుధవారం ఆందోళనకు దిగారు. ఉదయం ఇడ్లీ తింటుంటే ప్లేట్లో బల్లి కనిపించడంతో ఖంగుతిన్నామన్నారు. ఆగ్రహంతో చీఫ్ వార్డెన్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. తక్షణమే తమ మెస్ను చీఫ్ వార్డెన్ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. సంఘటనపై విచారణ జరిపిన అధికారులు మెస్లోని నలుగురు సిబ్బందిని బదిలీ చేశారు.
Sorry, no posts matched your criteria.