Telangana

News April 10, 2024

KCR మీద కోపంతో‌ కాంగ్రెస్‌కు ఓటు: ఈటల

image

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ మీద కోపంతో మాత్రమే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓటేశారని BJP మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ విమర్శించారు. రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను చూసి ఓటు వేయలేదన్నారు. హామీల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. అయినా కూడా ఇప్పుడు మరోసారి 17 ఎంపీ సీట్లు గెలిపించండి అంటూ ప్రజలకు మాయ మాటలు చెబుతున్నారని ఈటల దుయ్యబట్టారు. దీనిపై మీ కామెంట్?

News April 10, 2024

బోధన్: రాహిల్‌కు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు

image

పంజాగుట్ట రోడ్డు ప్రమాదంలో అరెస్టైన బోధన్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు మహ్మద్ అమీర్ రాహిల్‌కు బెయిల్ మంజూరైంది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తున్నట్టు కోర్టు తీర్పునిచ్చింది. అంతే కాకుండా పోలీస్ కస్టడీ పిటిషన్‌ను కూడా కొట్టివేస్తున్నట్టు ప్రకటించింది. కాగా, రాహిల్‌కు హైకోర్టు ఆదేశాలను పాటించాలని రూ.20 వేలు, 2 పూచీకత్తులు సమర్పించాలని నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

News April 10, 2024

HYD: KCR మీద కోపంతో‌ కాంగ్రెస్‌కు ఓటు: ఈటల

image

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ మీద కోపంతో మాత్రమే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓటేశారని BJP మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ విమర్శించారు. రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను చూసి ఓటు వేయలేదన్నారు. హామీల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. అయినా కూడా ఇప్పుడు మరోసారి 17 ఎంపీ సీట్లు గెలిపించండి అంటూ ప్రజలకు మాయ మాటలు చెబుతున్నారని ఈటల దుయ్యబట్టారు. దీనిపై మీ కామెంట్?

News April 10, 2024

HYD: KCR మీద కోపంతో‌ కాంగ్రెస్‌కు ఓటు: ఈటల

image

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ మీద కోపంతో మాత్రమే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓటేశారని BJP మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ విమర్శించారు. రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను చూసి ఓటు వేయలేదన్నారు. హామీల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. అయినా కూడా ఇప్పుడు మరోసారి 17 ఎంపీ సీట్లు గెలిపించండి అంటూ ప్రజలకు మాయ మాటలు చెబుతున్నారని ఈటల దుయ్యబట్టారు. దీనిపై మీ కామెంట్?

News April 10, 2024

చెన్నారావుపేట: వడదెబ్బతో రైతు మృతి

image

వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ముగ్ధుంపురంలో విషాదం జరిగింది. ముగ్ధుంపురంకు చెందిన బాదవత్ మోహన్(56) వడదెబ్బతో మృతి చెందాడు. మోహన్ తన మొక్కజొన్న చేను వద్దకు రెండు రోజులు కాపలాకు వెళ్లడంతో ఎండ వేడిమికి వడదెబ్బ తాకింది. మంగళవారం అస్వస్థతకు గురయ్యాడు. స్థానికంగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. మోహన్ మృతదేహానికి ఎంపీటీసీ చీకటి స్వరూప ఓదెలు, చెన్నారావుపేట సొసైటీ డైరెక్టర్ గోపి తదితరులున్నారు.

News April 10, 2024

సూర్యాపేట: బీ అలర్ట్: కలెక్టర్ హరిచందన

image

SRPT కలెక్టరేట్లో పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి SRPT కలెక్టర్ ఎస్. వెంకటరావుతో కలిసి NLG, SRPT జిల్లాలకు చెందిన ఎస్పీలు, అదనపు కలెక్టర్లు,SRPT జిల్లా ఏఆర్వోలు, నోడల్ ఆఫీసర్స్, సెక్టోరియల్ ఆఫీసర్స్ తో NLG పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ హరిచందన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్నికల గడువు సమీపిస్తున్న తరుణంలో ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే అధికారులు, సిబ్బంది జాగ్రత్తగా ఉండాలన్నారు.

News April 10, 2024

మెదక్: మరో 6 రోజులే గడువు

image

ఈ నెల 18న లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుండగా.. మే 13న పోలింగ్ జరగనుంది. అయితే ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో చాలా మంది ఓటరుగా పేరు నమోదు చేసుకోలేదు. 2006 మార్చి 31లోపు పుట్టిన వారంతా ఓటరుగా నమోదు చేసుకోవడానికి మరో 6 రోజుల సమయం ఉంది. ఫారం-6 నింపి, ధ్రువీకరణ పత్రాల నకలు, పాస్ ఫొటోలు జతపర్చి స్థానిక BLOకు అందజేయండి. లేదంటే స్థానిక మీసేవ సెంటర్లో అప్లై చేసుకోవచ్చు. అంతేకాదు మార్పులు చేసుకోవచ్చు.

News April 10, 2024

రాజ్యసభ సభ్యురాలిగా ప్రమాణం చేసిన రేణుకా చౌదరి

image

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి రాజ్యసభ సభ్యురాలిగా బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ కార్యాలయంలో ఆమె ప్రమాణం చేశారు. రేణుకా చౌదరి వెంట పలువురు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. అధికారిక ప్రక్రియ పూర్తవ్వడంతో ఎంపీగా ఆమె బాధ్యతలు స్వీకరించారు. కాగా మూడోసారి రాజ్యసభ ఎంపీగా ఆమె పనిచేస్తున్నారు.

News April 10, 2024

సీఎం రేవంత్ రెడ్డిపై డీకే అరుణ ఫైర్

image

సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై డీకే అరుణ తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అధికార అహంతో రేవంత్ రెడ్డి విర్ర వీగుతున్నాడని.. అధికారం ఎవరికి శాశ్వతం కాదన్నారు. అధికారం ఉందని విర్రవీగితే కేసీఆర్ లాగా అవుతారని పేర్కొన్నారు. ‘అరుణమ్మను విమర్శించే హక్కు ఎవరికీ లేదు. రైతుల అభివృద్ధి కోసం అరుణమ్మ పనిచేసింది. కాంట్రాక్టర్ల కోసం, పదవుల కోసం బిజెపిలో చేరలేదు’ అని అన్నారు.

News April 10, 2024

తాండూరు: మద్యానికి బానిసైన భర్త.. భార్య ఆత్మహత్య

image

తాండూరు మండలం మాదారం గ్రామానికి చెందిన గుమాస భారతి (30) హైదరాబాదులో ఆత్మహత్యకు పాల్పడింది. కొన్ని నెలల క్రితం జీవనోపాధి కోసం హైదరాబాద్‌కు వచ్చిన భారతికి లక్ష్మణ్ తో పరిచయం ఏర్పడింది. పెళ్లి చేసుకుని చికెన్ దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. లక్ష్మణ్ మద్యానికి బానిసై భార్యతో తరచూ గొడవ పడుతున్నారు. ఇదే విషయమై భార్యల మధ్య గొడవ జరిగింది. భారతి ఆవేశంతో చీరతో ఫ్యాన్‌కు ఉరేసుకుంది.