India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బీజేపీ సికింద్రాబాద్ కంటోన్మెంట్కి మరో షాక్ తగలనుంది. కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ బీజేపీని వీడి కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ మైనంపల్లి హనుమంతరావు ప్రతాప్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్లో చేరాల్సిందిగా ఆహ్వానించారు. ఇందుకు అంగీకరించిన జంపన ఈరోజు తన అనుచరులతో కలిసి కాంగ్రెస్లో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారు.
బీజేపీ సికింద్రాబాద్ కంటోన్మెంట్కి మరో షాక్ తగలనుంది. కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ బీజేపీని వీడి కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ మైనంపల్లి హనుమంతరావు ప్రతాప్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్లో చేరాల్సిందిగా ఆహ్వానించారు. ఇందుకు అంగీకరించిన జంపన ఈరోజు తన అనుచరులతో కలిసి కాంగ్రెస్లో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులను చిత్తుగా ఓడిస్తామని BRS నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థి RS ప్రవీణ్ కుమార్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా HYD అల్వాల్ సర్కిల్ వెంకటాపురం డివిజన్ యాదమ్మనగర్లో మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి మద్దతుగా ప్రవీణ్ కుమార్, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. RS మాట్లాడుతూ.. కాంగ్రెస్ 6 గ్యారంటీల అమలులో విఫలమైందన్నారు.
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులను చిత్తుగా ఓడిస్తామని BRS నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థి RS ప్రవీణ్ కుమార్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా HYD అల్వాల్ సర్కిల్ వెంకటాపురం డివిజన్ యాదమ్మనగర్లో మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి మద్దతుగా ప్రవీణ్ కుమార్, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. RS మాట్లాడుతూ.. కాంగ్రెస్ 6 గ్యారంటీల అమలులో విఫలమైందన్నారు.
ఎన్నికల షెడ్యూలు విడుదలై దాదాపు నెల రోజులు కావస్తుంది. ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించి ప్రచారం జోరుగా కొనసాగిస్తున్నారు. కానీ, కాంగ్రెస్ మాత్రం ఇప్పటివరకు అభ్యర్థి విషయంలో పీట మూడి వీడటం లేదు. మరో 8 రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలై నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండగా కాంగ్రెస్ అధిష్ఠానం మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈ ఉత్కంఠకు ముగింపు ఎప్పుడా అని స్థానికులు ఎదురుచూస్తున్నారు.
పార్లమెంట్ ఎన్నికలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్లో ఉప ఎన్నిక జరగనుంది. స్థానిక BRS MLA లాస్య నందిత యాక్సిడెంట్లో చనిపోగా ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. కాగా BRS నుంచి లాస్య సోదరి నివేదిత బరిలో ఉంటారని సమాచారం. అయితే BRS నుంచి BJPలో చేరి గత ఎన్నికల్లో పోటీ చేసిన శ్రీగణేశ్ ఇటీవల కాంగ్రెస్లో చేరగా ఆయనకు అధిష్ఠానం టికెట్ కేటాయించింది. BJP ఇంతవరకు అభ్యర్థిని ప్రకటించలేదు. మరి గెలుపెవరిదో?
పార్లమెంట్ ఎన్నికలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్లో ఉప ఎన్నిక జరగనుంది. స్థానిక BRS MLA లాస్య నందిత యాక్సిడెంట్లో చనిపోగా ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. కాగా BRS నుంచి లాస్య సోదరి నివేదిత బరిలో ఉంటారని సమాచారం. అయితే BRS నుంచి BJPలో చేరి గత ఎన్నికల్లో పోటీ చేసిన శ్రీగణేశ్ ఇటీవల కాంగ్రెస్లో చేరగా ఆయనకు అధిష్ఠానం టికెట్ కేటాయించింది. BJP ఇంతవరకు అభ్యర్థిని ప్రకటించలేదు. మరి గెలుపెవరిదో?
ఓ ఉపాధ్యాయురాలు పాఠశాలలోనే ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలో చోటుచేసుకుంది. బుధరావుపేట ప్రభుత్వ మోడల్ పాఠశాలలో ఈ ఘటన జరిగింది. సైన్స్ టీచర్ హారిక ఆల్ అవుట్(దోమల మందు) తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో హారికను తోటి ఉపాధ్యాయులు నర్సంపేటలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
బెల్లంపల్లి రడగంబాల బస్తీకి చెందిన వాసీమ కుటుంబకలహాలతో జీవితంపై విరక్తి చెంది తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకునేందుకు మైక్రో స్టేషన్ క్వారీకి వెళ్లింది. ఆమె భర్త షబ్బీర్ విషయం తెలుసుకుని జీఆర్పీ కానిస్టేబుల్ ఎండీ రషీద్కు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చాడు. అప్రమత్తమైన రైల్వే కానిస్టేబుల్ ఘటనాస్థలికి చేరుకుని కాపాడాడు. ముగ్గురి ప్రాణాలను
కాపాడిన కానిస్టేబుల్ను స్థానికులు అభినందించారు.
ఈనెల 15 నుంచి 1 నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు సంగ్రహణాత్మక మూల్యాంకనం(ఎస్ఏ)-2 పరీక్షలు నిర్వహించేందుకు టైం టేబుల్ విడుదల చేశారు. ఉమ్మడి జిల్లాలోని 4,187 పాఠశాలల్లో 1-9 వరకు చదువుతున్న 4,81,554 నుంచి విద్యార్థులు ఎస్ఏ-2 పరీక్షలు రాయనున్నారు. ఇప్పటికే అన్ని పాఠశాలలకు డీఈవోల ఆధ్వర్యంలో సంబందిత జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డు (డీసీఈబీ) ద్వారా ప్రశ్నపత్రాలు సరఫరా చేశారు.
Sorry, no posts matched your criteria.