Telangana

News April 10, 2024

నిజామాబాద్: మరో 6 రోజులే గడువు

image

ఈనెల 18న లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుండగా.. మే 13న పోలింగ్ జరగనుంది. అయితే ఇప్పటి వరకు చాలా మంది ఓటరుగా పేరు నమోదు చేసుకోలేదు. 2006 మార్చి 31లోపు పుట్టిన వారంతా ఓటరుగా నమోదు చేసుకోవడానికి మరో 6 రోజుల సమయం ఉంది. ఫారం-6 నింపి, దృవీకరణ పత్రాల నకలు, పాస్ ఫొటోలు జతపర్చి స్థానిక బీల్వోకు అందజేయండి. లేదంటే స్థానిక మీసేవ సెంటర్లో అప్లై చేసుకోవచ్చు. అంతేకాదు, మార్పులు కూడా చేసుకోవచ్చు.

News April 10, 2024

HNK: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి

image

హన్మకొండ నగరంలో బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. స్థానికులు వివరాల ప్రకారం.. కాజీపేటకు చెందిన సయ్యద్ వహీద్, అష్రఫ్‌లు బైక్ పై హన్మకొండ వైపు వెళ్తుండగా.. ఎదురుగా వచ్చిన ఒక కారును బైక్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో వహీద్ అక్కడికక్కడే మృతిచెందగా.. ఆసుపత్రికి తీసుకెళ్తుండగా అష్రఫ్ మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News April 10, 2024

KNR: మే 3న ఉద్యోగంలో జాయినింగ్.. బీటెక్ విద్యార్థి మృతి

image

ఈతకు వెళ్లిన ఓ యువకుడికి ఫిట్స్ వచ్చి బావిలోనే మృతి చెందిన ఘటన HZBD మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల ప్రకారం.. కందుగులకు చెందిన విజయ్ కుమార్(21) HYDలో బీటెక్ చదువుతున్నాడు. అయితే పండగకు స్వగ్రామానికి వచ్చాడు. ఈక్రమంలో స్నిహితులతో కలిసి ఊరి చివరి బావిలోకి ఈతకు వెళ్లగా.. బావిలోనే మునిగిపోగా నీటిని తోడి మృతదేహాన్ని గుర్తించారు. కాగా, విజయ్‌కు ఇటీవల ఓ ఉద్యోగం రాగా.. మే 3న చేరాల్సి ఉంది.

News April 10, 2024

ఆదిలాబాద్: నిండు గర్భిణీ మృతి

image

సిరికొండ మండలం పొన్న ఎక్స్ రోడ్‌కు చెందిన పేందుర్ విమల బాయి (25) అనే నిండు గర్భిణీ మృతి చెందింది. బంధువుల వివరాలు.. విమల బాయికి రక్తహీనత, విరేచనాలు ఎక్కువ అవ్వడంతో ఇచ్చోడ ఆస్పత్రికి తరలించారు. ఇక్కడ పరీక్షించిన వైద్యులు.. 108లో మెరుగైన వైద్యం కోసం ADB రిమ్స్ ఆసుపత్రికి తరలించగా మార్గమధ్యలో మృతి చెందినట్లు బంధువులు తెలిపారు.

News April 10, 2024

సూర్యాపేట: ఒకే కొమ్మకు 55 మామిడి కాయలు

image

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 55 మామిడి కాయలు ఒకే చోట కాశాయి. అది కూడా విరిగిపోయి ఎండినదనుకున్న కొమ్మకు. సూర్యాపేట జిల్లా గరిడేపల్లికి చెందిన మోదాల గంగయ్య పొలంలో విరిగిపోయి ఎండిపోయిందనుకున్న మామిడి చెట్టు కొమ్మ చిగురించింది. ఆ చిగురే మామిడి కాయల రూపంలో ప్రతిఫలిచింది. ఏకంగా 55 ఒకే చోట కాసి చూపరులను ఆకట్టుకుంటోంది.

News April 10, 2024

HYD: అర్ధరాత్రి ఇంటికెళ్లి బాలికపై అత్యాచారయత్నం

image

యువకుడిపై పోక్సో కేసు నమోదైన ఘటన సికింద్రాబాద్ కార్ఖానా పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. బోయిన్‌పల్లి మడ్‌ఫోర్ట్ వద్ద నివాసం ఉండే బాలిక(17)పై అర్ధరాత్రి ఆ ప్రాంతంలోనే నివాసించే భాను(25) అనే యువకుడు అత్యాచారానికి యత్నించాడు. దీంతో ఆమె కేకలు వేయగా అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ మేరకు బాలిక తల్లిదండ్రులు మంగళవారం కార్ఖానా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.

News April 10, 2024

HYD: అర్ధరాత్రి ఇంటికెళ్లి బాలికపై అత్యాచారయత్నం

image

యువకుడిపై పోక్సో కేసు నమోదైన ఘటన సికింద్రాబాద్ కార్ఖానా పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. బోయిన్‌పల్లి మడ్‌ఫోర్ట్ వద్ద నివాసం ఉండే బాలిక(17)పై అర్ధరాత్రి ఆ ప్రాంతంలోనే నివాసించే భాను(25) అనే యువకుడు అత్యాచారానికి యత్నించాడు. దీంతో ఆమె కేకలు వేయగా అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ మేరకు బాలిక తల్లిదండ్రులు మంగళవారం కార్ఖానా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.

News April 10, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో TODAY HEADLINES

image

✓ఖమ్మం, భద్రాద్రి జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం
✓ఖమ్మంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటన
✓భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు
✓అశ్వారావుపేట మండలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
✓ఖమ్మం వ్యవసాయ మార్కెట్ తిరిగి ప్రారంభం
✓కల్లూరు మండలంలో ఎమ్మెల్యే మట్టా రాగమయి పర్యటన
✓వైరా మండలంలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన

News April 10, 2024

భద్రాచలం: రాముడి ఆదాయం 14, వ్యయం 2

image

దేవస్థానంలో మంగళవారం క్రోధినామ తెలుగు సంవత్సరాది వేడుకలను వైభవోపేతంగా జరిపారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని వేపపూత పచ్చడి నివేదన చేసి భక్తులకు పంచారు. ఈ ఏడాది రాముడి ఆదాయం 14, వ్యయం 2, రాజ పూజ్యం 6, అవమానం6గా ఉందని తెలిపారు. సీతమ్మవారి ఆదాయం 5, వ్యయం 5 అని, రాజపూజ్యం 5, అవమానం 2గా ఉంటుందని పేర్కొన్నారు. జ్యేష్టమాసం శుక్లపక్షంలో తొలకరులు ఉంటాయని, సస్యవృద్ధి ఉంటుందని వెల్లడించారు.

News April 10, 2024

ఖమ్మం: BRS, కాంగ్రెస్ నేతల ఘర్షణ.. ఉద్రిక్తత

image

కామేపల్లి మండలంలోని పండితాపురంలో BRS, కాంగ్రెస్ నేతలు ఘర్షణకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. బాధితుల వివరాలిలా.. ఉగాది పండుగ సందర్భంగా గ్రామంలో మంగళవారం ఎడ్లబండ్లతో ఊరేగింపు నిర్వహించారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నాయకుడు హరిపై కాంగ్రెస్ నాయకులు దాడి చేశారు. ఇరువురికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఎస్సై ప్రవీణ్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని బందోబస్తు ఏర్పాటు చేసి విచారణ చేపట్టారు.