Telangana

News April 10, 2024

నల్గొండ: నాలుగేళ్ల చిన్నారి నాలెడ్జ్ అదుర్స్

image

చిట్యాలకు చెందిన నాలుగున్నరేళ్ల గంజి తక్ష్వి తన ప్రతిభలో మంత్రముగ్దుల్ని చేస్తోంది. ఎల్‌కేజీ చదువుతున్న చిన్నారి ఏమాత్రం తడుముకోకుండా రాష్ట్ర రాజధానుల పేర్లు చెబుతోంది. రెండు రోజుల్లోనే నేర్చుకుందన్నారు. రానున్న కాలంలో ముఖ్యమంత్రులు, జాతీయ పక్షులు, జంతువుల పేర్లు నేర్పించాలని సంకల్పంగా పెట్టుకున్నామన్నాని పాప తల్లిదండ్రులు చెబుతున్నారు.

News April 10, 2024

KNR: గుంటకు రూ.10లక్షలు.. ఖాళీ అవుతున్న గుట్ట

image

KNR-JGTL జాతీయ రహదారిలోని మధురానగర్ శివారులో వందల ఎకరాల్లో విస్తరించి ఉన్న వంటశాల గుట్ట అక్రమార్కులకు వరంగా మారింది. కొందరు వాణిజ్య అవసరాలకు తవ్వుకోవడంతో పాటు.. గుట్టను తొలచి అడుగు స్థలాన్ని చదను చేస్తున్నారు. ఇక్కడి స్థలం గుంట రూ.10 లక్షల వరకు పలుకుతుండటంతో ఈ అక్రమాలకు పాల్పడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. వీరివెనక రాజకీయ నేతల అండ ఉండటంతో పాటు అధికారులు పట్టించుకోవట్లేదని మండిపడుతున్నారు.

News April 10, 2024

HYD: ‘గోవాలో పుట్టినరోజు జరుపుకొని వస్తూ డ్రగ్స్ తెచ్చారు’

image

HYD సనత్‌నగర్ బస్టాండ్‌లో నాగరాజ్‌ అనే యువకుడితో పాటు అతడి నలుగురు స్నేహితులను అరెస్ట్ చేశామని SOT రాజేంద్రనగర్ టీం తెలిపింది. వారి నుంచి 4 గ్రాముల MDMA డ్రగ్, 5గ్రాముల గంజాయి, OCB రేపర్స్ స్వాధీనం చేసుకున్నామని పేర్కొంది. విచారణలో ఏప్రిల్ 4న నాగరాజ్‌ స్నేహితుడు దిలీప్ పుట్టినరోజు సందర్భంగా నలుగురు స్నేహితులతో గోవాకు వెళ్లి MDMA డ్రగ్‌తోపాటు GOA నుంచి బస్సులో HYDకు తిరిగి వచ్చారని తేలిందన్నారు.

News April 10, 2024

HYD: ‘గోవాలో పుట్టినరోజు జరుపుకొని వస్తూ డ్రగ్స్ తెచ్చారు’

image

HYD సనత్‌నగర్ బస్టాండ్‌లో నాగరాజ్‌ అనే యువకుడితో పాటు అతడి నలుగురు స్నేహితులను అరెస్ట్ చేశామని SOT రాజేంద్రనగర్ టీం తెలిపింది. వారి నుంచి 4 గ్రాముల MDMA డ్రగ్, 5గ్రాముల గంజాయి, OCB రేపర్స్ స్వాధీనం చేసుకున్నామని పేర్కొంది. విచారణలో ఏప్రిల్ 4న నాగరాజ్‌ స్నేహితుడు దిలీప్ పుట్టినరోజు సందర్భంగా నలుగురు స్నేహితులతో గోవాకు వెళ్లి MDMA డ్రగ్‌తోపాటు GOA నుంచి బస్సులో HYDకు తిరిగి వచ్చారని తేలిందన్నారు.

News April 10, 2024

MBNR: ఇంటికే రాములోరి తలంబ్రాలు.. ఈ నెంబర్లకు ఫోన్ చేయండి !

image

భద్రాచలం శ్రీరాముడి తలంబ్రాలు నేరుగా ఇంటికే అందించనున్నట్లు ఆయా డిపోల ఆర్టీసీ డీఎంఈలు తెలిపారు. రూ.151 చెల్లించి ఈనెల 18 వరకు బుకింగ్ చేసుకునే అవకాశం ఉందని తెలిపారు.
1.మహబూబ్ నగర్-91542 98612
2.నాగర్ కర్నూల్-96189 65885
3.కోస్గి-63051 09009
4.గద్వాల్-91542 98609
5.అచ్చంపేట-91542 98608
6.కల్వకుర్తి-91542 98610
7.కొల్లాపూర్-91542 98611
8.నాగర్ కర్నూల్-91542 98613

News April 10, 2024

వదంతులను ఎవరూ నమ్మవద్దు:  వంశీచంద్ రెడ్డి

image

నారాయణపేట జిల్లా రద్దు అవుతుందని సోషల్ మీడియాలో వస్తున్న వదంతులపై కాంగ్రెస్ MP అభ్యర్థి వంశీచంద్ రెడ్డి స్పందించారు. ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని సూచించారు. ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి అలాంటి ఆలోచన లేదన్న ఆయన.. కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా దెబ్బతీసేందుకు ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రలు అని స్పష్టం చేశారు. జీఓ69 ఓ కల అని, అది రేవంత్ రెడ్డి సారథ్యంలో జీఓ14 ద్వారా నెరవేరుతుందన్నారు.

News April 10, 2024

NLG: గ్రామాల్లో ప్ర’జల’ కష్టాలు..!?

image

ఉమ్మడి జిల్లాలో తాగునీటి ఎద్దడి తీవ్రమైంది. అసలే కరువు, ఆపై ఎండలు ముదిరిపోవడంతో భూగర్భ జలాలు మరింత లోతుల్లోకి వెళ్లాయి. దీంతో గ్రామ పంచాయతీల్లో బోర్లు ఎండిపోయాయి. మరోవైపు ఎప్పుడు వస్తాయో తెలవని భగీరథ నీళ్ల కోసం జనాలు రోజుల తరబడి పడిగాపులు కాయాల్సివస్తోంది. భగీరథ నీళ్లు సక్రమంగా రాకపోవడంతో వ్యవసాయ బోర్ల నుంచి నీటిని తెచ్చుకుంటున్నారు. అధికారులు స్పందించి గ్రామాల్లో నీటి కొరత లేకుండా చూడాలన్నారు.

News April 10, 2024

ఖమ్మం: గుండెపోటుతో అంగన్వాడీ టీచర్ మృతి

image

రఘునాథపాలెం మండలంలోని వీవీ పాలెం ఎస్టీ కాలనీ అంగన్వాడీ టీచర్ బానోత్ రంగాబాయి (46) గుండెపోటుతో మంగళవారం మృతి చెందారు. గ్రామస్థుల కథనం ప్రకారం.. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రంగాబాయి మంగళవారం గుండెపోటుకు గురికాగా ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో మృతి చెందినట్లు తెలిపారు. మృతురాలికి భర్త, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.

News April 10, 2024

HYD: ‘కారు’కు బ్రేక్ వేసేందుకు ‘చేయి’ వ్యూహం!

image

పార్లమెంట్‌ ఎన్నికలకు గడువు సమీపిస్తుండడంతో అధికార కాంగ్రెస్‌ ప్రచారంలో దూకుడు పెంచింది. తుక్కుగూడలో ఇటీవల నిర్వహించిన జన జాతర సభతో కాంగ్రెస్‌ కేడర్‌లో జోష్‌ మరింత పెరిగింది. HYD, సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి పార్లమెంట్‌ స్థానాల్లో విజయం సాధించాలని, క్షేత్రస్థాయిలో ప్రధాన ప్రతిపక్షమైన BRSకు బ్రేక్ వేసేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి నేతలకు సూచనలు చేశారు. మీ కామెంట్?

News April 10, 2024

నల్గొండ: సూపర్బ్.. 40 ఏళ్లుగా దాహార్తిని తీరుస్తున్న బావి

image

నల్గొండ జిల్లా కనగల్ మండలం పొనుగోడులోని మేడిబావి 40ఏళ్లుగా ప్రజల దాహార్తిని తీరుస్తోంది. వర్షాభావ పరిస్థితుల కారణంగా భూగర్భ జలాలు అడుగంటి బోర్లు ఎండిపోయి మోటార్లు పనిచేయకపోయినా ఈ బావిలో మాత్రం సమృద్ధిగా నీరు లభిస్తుండటంతో గ్రామంలో పలు కాలనీలకు వేసవిలో నీటి ఎద్దడి తప్పింది. గ్రామానికి చెందిన మాజీ సర్పంచి నాంపల్లి రాములు 50ఏళ్ల క్రితం తన వ్యవసాయ అవసరాల నిమిత్తం తన భూమిలో బావిని తవ్వించారు.