Telangana

News April 9, 2024

ఖమ్మం: ఇరువర్గాల మధ్య ఘర్షణ.. 9 మందికి గాయాలు

image

ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో 9 మందికి గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కాగా, ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 9, 2024

MBNR: లేగ దూడపై చిరుత దాడి

image

బిజినేపల్లి మండలం వసురాం తాండలో రాముడు నాయక్ అనే రైతు తాండ సమీపంలో ఉన్న వ్యవసాయ పొలంలో లేగ దూడపై చిరుత పులి దాడి చేసి చంపినట్లు మంగళవారం తెలిపారు. ఇండ్ల నుంచి బయటకు వెళ్లాలంటే గిరిజనులు జంకుతున్నారు. ఫారెస్టు అధికారులు పంచనామా చేసి చిరుతపులి అవు దూడను చంపి తినేసినట్లు గుర్తించారు. అత్యవసరం అయితే తప్ప చుట్టుపక్కల గ్రామాల తాండా వాసులు బయటికి రావొద్దని అధికారులు తెలిపారు.

News April 9, 2024

నేతన్నల పోరాట ఫలితమే: బండి సంజయ్

image

సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడం చాలా సంతోషం అని ఎంపీ బండి సంజయ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. వస్త్ర పరిశ్రమ ఆసాములు, నేతన్నలంతా ఐక్యంగా చేసిన పోరాటాల ఫలితంగానే రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చింది. ఈ విషయంలో నేతన్నలకు అండగా నిలిచిన బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు అభినందనలు తెలిపారు.

News April 9, 2024

రోడ్డు ప్రమాదంలో బీఆర్ఎస్ నాయకుడికి గాయాలు

image

తెలంగాణ రాష్ట్ర కల్లు గీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవి కుమార్ గౌడ్‌కు మంగళవారం మధ్యాహ్నం కొత్తపేట వద్ద తృటిలో ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో రవికుమార్ స్వల్పగాయాలతో బయట పడ్డారు. మిత్రుడిని పరామర్శించి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న కారు టైరు కొత్తపేట క్రాస్ రోడ్ సమీపంలో పగిలిపోవడంతో అదుపు తప్పి డివైడర్, మెట్రో రైలు పిల్లర్ గుద్దుకోవడంతో ఎయిర్ బెలూన్లు ఓపెన్ కావడంతో ప్రమాదం తప్పింది.

News April 9, 2024

తూప్రాన్: రోడ్డు ప్రమాదంలో కామారెడ్డి జిల్లా వాసి మృతి

image

తూప్రాన్ మండలం యావపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన కామారెడ్డి జిల్లా బిక్నూర్ మండలం అంతంపల్లి గ్రామానికి చెందిన గోల్కొండ నరసింహారెడ్డి (48) మృతి చెందాడు. యావపూర్‌కు చెందిన సురేందర్ రెడ్డి వద్ద ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్న నరసింహారెడ్డి ద్విచక్ర వాహనంపై 4న వెళ్తున్నాడు. యావపూర్ చౌరస్తా వద్ద ఆగి ఉన్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొనగా తీవ్రంగా గాయపడి.. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు.

News April 9, 2024

వేయి స్తంభాల ఆలయ పంచాంగ శ్రవణంలో పాల్గొన్న సీపీ

image

ఉగాది పండుగ సందర్భంగా హన్మకొండలోని వేయి స్తంభాల ఆలయంలో పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని ప్రధాన అర్చకుడు గంగు ఉపేంద్ర శర్మ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీపీ అంబర్ కిషోర్ ఝూ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పంచాంగ శ్రవణం పూర్తికాగానే కవి సమ్మేలనం జరిగింది. ఈ సందర్భంగా కవులతో పాటు ఆలయ ఈవో వెంకటయ్యను సీపీ సన్మానించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

News April 9, 2024

MBNR: ఉపాధ్యాయ అర్హత పరీక్షకు దరఖాస్తులు

image

ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు 1,66,475 దరఖాస్తులు వచ్చాయి. ఈ మేరకు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్, టెట్ కన్వీనర్ ఎం.రాధారెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తుల సమర్పణకు తుది గడువు బుధవారం వరకే ఉందని తెలిపారు. వచ్చే నెల 20 నుంచి జూన్ 3వ తేదీ వరకు టెట్ రాత పరీక్షలను ఆన్‌లైన్ కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) విధానంలో నిర్వహిస్తారు.

News April 9, 2024

జైనూర్: దగ్గు, దమ్ముతో నిండు గర్భిణీ మృతి !

image

జైనూర్ మండలం లక్ష్మణ్ పటేల్‌గూడకు చెందిన ఆత్రం లక్ష్మి(30) అనే నిండు గర్భిణీ దగ్గు, దమ్ముతో అకస్మాత్తుగా మృతి చెందింది. బంధువులు తెలిపిన వివరాలు.. లక్ష్మీకి దమ్ము, దగ్గు అధికం కావడంతో జైనూర్ ఆస్పత్రికి తరలించారు. ఇక్కడ పరీక్షించిన వైద్యులు.. ఆక్సిజన్ ద్వారా 108లో మెరుగైన వైద్యం కోసం ఉట్నూర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతుండగా ఒకేసారి దమ్ము, దగ్గు రావడంతో చనిపోయిందని చెప్పారు.

News April 9, 2024

హైదరాబాద్‌లో BRS లీడర్‌కు తప్పిన ప్రమాదం

image

HYDలో BRS లీడర్‌కు ప్రమాదం తప్పింది. మంగళవారం తెలంగాణ రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ పల్లె రవి కుమార్ గౌడ్‌ ఖైరతాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో తన మిత్రుడిని పరామర్శించి తిరిగి ఇంటికి వెళ్తున్నారు. మార్గమధ్యలో (కొత్తపేట క్రాస్ రోడ్డు సమీపంలో) టైరు పగిలిపోవడంతో కారు అదుపు తప్పి మెట్రో డివైడర్‌ను ఢీ కొట్టింది. ఎయిర్‌బెలూన్స్ ఓపెన్ కావడంతో పల్లె రవి, డ్రైవర్‌ ఖదీర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

News April 9, 2024

హైదరాబాద్‌లో BRS లీడర్‌కు తప్పిన ప్రమాదం

image

HYDలో BRS లీడర్‌కు ప్రమాదం తప్పింది. మంగళవారం తెలంగాణ రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ పల్లె రవి కుమార్ గౌడ్‌ ఖైరతాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో తన మిత్రుడిని పరామర్శించి తిరిగి ఇంటికి వెళ్తున్నారు. మార్గమధ్యలో (కొత్తపేట క్రాస్ రోడ్డు సమీపంలో) టైరు పగిలిపోవడంతో కారు అదుపు తప్పి మెట్రో డివైడర్‌ను ఢీ కొట్టింది. ఎయిర్‌బెలూన్స్ ఓపెన్ కావడంతో పల్లె రవి, డ్రైవర్‌ ఖదీర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు.