Telangana

News April 9, 2024

HYD: లీజుకు RTC బస్టాండ్లలోని దుకాణాలు..!

image

HYD నగరంలోని పలు ప్రయాణ ప్రాంగణాల్లో దుకాణాలు లీజుకు సిద్ధమంటూ ఆర్టీసీ ప్రకటించింది. ఈసీఐఎల్ బస్ స్టేషన్లో 5200 చ.అ.స్థలంలో వసతి, కోచింగ్ సెంటర్, డయాగ్నొస్టిక్ సెంటర్ పెట్టుకోవాలని సూచించింది. ఇలా.. సికింద్రాబాద్ రీజియన్లో మొత్తం 17 దుకాణాలకు, మరో 10 ప్రాంతాల్లో ఐస్క్రీమ్ పార్లర్ల నిర్వహణకు టెండర్లు పిలిచింది. HYD రీజియన్లో 35 దుకాణాల కోసం టెండర్లు పిలిచారు. దరఖాస్తుల స్వీకరణ సైతం పూర్తయింది.

News April 9, 2024

HYD: లీజుకు RTC బస్టాండ్లలోని దుకాణాలు..!

image

HYD నగరంలోని పలు ప్రయాణ ప్రాంగణాల్లో దుకాణాలు లీజుకు సిద్ధమంటూ ఆర్టీసీ ప్రకటించింది. ఈసీఐఎల్ బస్ స్టేషన్లో 5200 చ.అ.స్థలంలో వసతి, కోచింగ్ సెంటర్, డయాగ్నొస్టిక్ సెంటర్ పెట్టుకోవాలని సూచించింది. ఇలా.. సికింద్రాబాద్ రీజియన్లో మొత్తం 17 దుకాణాలకు, మరో 10 ప్రాంతాల్లో ఐస్క్రీమ్ పార్లర్ల నిర్వహణకు టెండర్లు పిలిచింది. HYD రీజియన్లో 35 దుకాణాల కోసం టెండర్లు పిలిచారు. దరఖాస్తుల స్వీకరణ సైతం పూర్తయింది.

News April 9, 2024

HYD: రంజాన్ స్పెషల్.. అత్తర్ల పరిమళాలు

image

పవిత్ర రంజాన్ మాసానికి పరిమళాలు వెదజల్లే అత్తర్లు మరింత వన్నె తెస్తాయి. వివిధ ప్రాంతాల నుంచి పెద్దఎత్తున తరలివచ్చే కొనుగోలుదారులతో హైదరాబాద్ పాతబస్తీలోని దుకాణాలు కళకళలాడుతున్నాయి. గులాబీ రేకులు, మల్లె, మొగలిపూలు, గంధం చెక్కలు మరిగించటం ద్వారా వచ్చే ఆవిరితోనే అత్తర్లను తయారుచేస్తారు. 200లకు పైగా వివిధ రకాల ఫ్లేవర్లు నగరవాసులకు అందుబాటులో ఉన్నాయి. ఇవి రూ.40 నుంచి రూ.600 వరకు దొరుకుతున్నాయి.

News April 9, 2024

HYD: రంజాన్ స్పెషల్.. అత్తర్ల పరిమళాలు 

image

పవిత్ర రంజాన్ మాసానికి పరిమళాలు వెదజల్లే అత్తర్లు మరింత వన్నె తెస్తాయి. వివిధ ప్రాంతాల నుంచి పెద్దఎత్తున తరలివచ్చే కొనుగోలుదారులతో హైదరాబాద్ పాతబస్తీలోని దుకాణాలు కళకళలాడుతున్నాయి. గులాబీ రేకులు, మల్లె, మొగలిపూలు, గంధం చెక్కలు మరిగించటం ద్వారా వచ్చే ఆవిరితోనే అత్తర్లను తయారుచేస్తారు. 200లకు పైగా వివిధ రకాల ఫ్లేవర్లు నగరవాసులకు అందుబాటులో ఉన్నాయి. ఇవి రూ.40 నుంచి రూ.600 వరకు దొరుకుతున్నాయి.

News April 9, 2024

HYD: ‘పేదలందరికీ ప్రభుత్వమే అద్దాలివ్వాలి’

image

HYD మెహిదీపట్నంలోని సరోజినీ దేవి కంటి ఆసుపత్రిలో నిత్యం దాదాపుగా 1250 నుంచి 1350 మంది రోగులు వస్తుంటారు. అయితే వారిలో రోజు దాదాపు 200 నుంచి 300 మందికి డాక్టర్లు అద్దాలను సిఫార్సు చేస్తున్నారు. దీంతో పేదలు బయటకు వెళ్లి డబ్బు పెట్టి కొనుగోలు చేయాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ఆసుపత్రిలో అవసరమైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వమే అద్దాలు ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు.

News April 9, 2024

HYD: ‘పేదలందరికీ ప్రభుత్వమే అద్దాలివ్వాలి’

image

HYD మెహిదీపట్నంలోని సరోజినీ దేవి కంటి ఆసుపత్రిలో నిత్యం దాదాపుగా 1250 నుంచి 1350 మంది రోగులు వస్తుంటారు. అయితే వారిలో రోజు దాదాపు 200 నుంచి 300 మందికి డాక్టర్లు అద్దాలను సిఫార్సు చేస్తున్నారు. దీంతో పేదలు బయటకు వెళ్లి డబ్బు పెట్టి కొనుగోలు చేయాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ఆసుపత్రిలో అవసరమైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వమే అద్దాలు ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు. 

News April 9, 2024

గాంధీ ఆస్పత్రిలో డయాగ్నొస్టిక్ సేవలు ఇలా..!

image

సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో నాణ్యమైన డయాగ్నొస్టిక్ సేవలు అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రతినెల దాదాపుగా 100 అల్ట్రా సౌండ్ స్కానింగ్ 3,000 సీటీ స్కాన్, సుమారు 700 ఎంఆర్ఐ స్కానింగ్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రిలో MRI ప్రారంభం కాకపోవడం వల్ల, గాంధీ ఆసుపత్రికి MRI స్కానింగ్ కోసం వచ్చేవారి సంఖ్య పెరుగుతుందని సూపరింటెండెంట్ రాజారావు తెలిపారు.

News April 9, 2024

గాంధీ ఆస్పత్రిలో డయాగ్నొస్టిక్ సేవలు ఇలా..!

image

సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో నాణ్యమైన డయాగ్నొస్టిక్ సేవలు అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రతినెల దాదాపుగా 100 అల్ట్రా సౌండ్ స్కానింగ్ 3,000 సీటీ స్కాన్, సుమారు 700 ఎంఆర్ఐ స్కానింగ్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రిలో MRI ప్రారంభం కాకపోవడం వల్ల, గాంధీ ఆసుపత్రికి MRI స్కానింగ్ కోసం వచ్చేవారి సంఖ్య పెరుగుతుందని సూపరింటెండెంట్ రాజారావు తెలిపారు.

News April 9, 2024

సాగర్ ప్రాజెక్ట్ సమాచారం

image

నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ జలాశయంలో నీటి నిల్వలు రోజురోజుకూ పడిపోతున్నాయి. మంగళవారం ఉదయం సమాచారం మేరకు జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను ప్రస్తుతం 511.10 అడుగులు ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.00 టీఎంసీలకు గాను ప్రస్తుతం 133.5447 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ప్రస్తుతం ప్రాజెక్ట్ నుంచి 6,498 క్యూసెక్కుల ఔట్ ఫ్లో ఉండగా, ఇన్ ఫ్లో నిల్ ఉంది.

News April 9, 2024

కుటుంబ కలహాలతో పురుగుల మందు తాగి ఆత్మహత్య

image

పురుగుల మందు తాగి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన వెంకటాపురం మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన కథనం ప్రకారం.. వెంకటాపురం మండలం చొక్కాల గ్రామానికి చెందిన కోక కార్తీక్(28) ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కుటుంబ కలహాలతో ఆత్మహత్యకు చేసుకున్నాడని స్థానిక ప్రజలు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.