Telangana

News April 9, 2024

మెదక్: ‘మా పార్టీ కార్యకర్తలను కడుపులో పెట్టి చూసుకుంటుంది’

image

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కడుపులో పెట్టి చూసుకుంటుందని దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. దుబ్బాక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చందునాయక్ ఆధ్వర్యంలో శిలాజి నగర్, టేకులతండాకు చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారిని పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

News April 9, 2024

జగిత్యాల: హెడ్ కానిస్టేబుల్ సస్పెండ్

image

జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న అశోక్ సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు మల్టీజోన్ ఐజి రంగనాథ్ సోమవారం అతడిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పోలీస్ స్టేషన్లో మద్యం సేవించారని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఉన్నతాధికారులు విచారణ జరిపి సస్పెండ్ చేసినట్లు సమాచారం. ఇదే ఆరోపణలతో ఇటీవల ఇద్దరు కానిస్టేబుళ్లు సస్పెండ్ అయిన విషయం తెలిసిందే.

News April 9, 2024

‘నెక్కొండ ఫలుదా’ ఘటన.. ఫుడ్‌సేఫ్టీ అధికారుల రిపోర్ట్ ఇదే!

image

నెక్కొండలో ఇటీవల ఫలుదాలో ఓ వ్యాపారి వీర్యం, మూత్రం కలుపుతున్నట్లు వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. వెంటనే సదరు వ్యాపారిని గుర్తించి అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఆ ఐస్‌క్రీం బండిలోని పదార్థాలను HYDలో ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. వాటి నివేదికను ఫుడ్ సేఫ్టీ అధికారులు విడుదల చేశారు. అందులో ఎలాంటి వీర్యం, మూత్రం ఆనవాళ్లు లేవని నిర్ధారించినట్లు WGL జోన్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అమృతశ్రీ క్లారిటీ ఇచ్చారు.

News April 9, 2024

యాదాద్రి ఆలయంలోకి సెల్ఫోన్స్ నిషేధం

image

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాన ఆలయంలోకి సెల్ ఫోన్లు నిషేధిస్తూ ఏప్రిల్ 8న ఉత్తర్వులు జారీచేసింది. ప్రధాన ఆలయంలో విధులు నిర్వహించే మినిస్టీరియల్ సిబ్బంది, మతపర సిబ్బంది, నాల్గో తరగతి సిబ్బంది, ఎస్పీఎఫ్, హోంగార్డ్స్, అవుట్ సోర్సింగ్, సిబ్బంది వారి సెల్ ఫోన్లు ఆలయంలోకి‌ తీసుకెళ్లడాన్ని నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది.

News April 9, 2024

సిరిసిల్ల: ఎంట్రెన్స్ రాయకున్నా పాలిటెక్నిక్‌లో ఉచిత సీటు

image

దుర్గాబాయి దేశ్ ముఖ్ మహిళా సాంకేతిక శిక్షణ సంస్థ HYDలో ప్రవేశానికై తల్లిదండ్రులను కోల్పోయిన అనాథ బాలికల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సిరిసిల్ల జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం తెలిపారు. పాలిటెక్నిక్ ఎంట్రెన్స్ రాయకున్నా కేవలం 10వ తరగతి చదివిన అర్హులన్నారు. ఆసక్తి గలవారు మే15లోగా దరఖాస్తులు సమర్పించాలన్నారు. దరఖాస్తు ఫారాల కోసం జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయంలో సంప్రదించాలన్నారు.

News April 9, 2024

కొత్త సంవత్సరంలో మెరుగైన అభివృద్ధి సాధించాలి: కలెక్టర్

image

శుభాలను ఇచ్చే సంవత్సరం శ్రీ క్రోధి నామ సంవత్సరమని, ప్రజలందరూ శుభాలతో ఏప్రిల్ 9న ఉగాది పర్వదినాన్ని ఆనందోత్సవాలతో జరుపుకోవాలని, కలెక్టర్ ఆకాంక్షించారు. శ్రీ క్రోధి నామ సంవత్సరం ప్రారంభం కానున్న సందర్భంగా.. సమృద్ధిగా వానలు కురిసి, రైతుల కుటుంబాల్లో సుఖ సంతోషాలు వెల్లివిరియాలని అభిలషించారు. అలాగే కొత్త సంవత్సరంలో జిల్లా అన్ని రంగాల్లో మెరుగైన అభివృద్ధి సాధించాలని కలెక్టర్ ఆకాంక్షించారు.

News April 9, 2024

KMM: ఉపవాస దీక్షాపరుల కోసం గరం గరం గంజి

image

రంజాన్‌ మాసంలో హలీమ్‌ను తినేందుకు ఎంతగా ఇష్టపడతారో.. గరం గరం గంజిని సేవించేందుకు కూడా అంతే ఇష్టం చూపిస్తారు. ఉపవాస దీక్ష సమయంలో బలవర్థకమైన ఆహారం తీసుకుంటూ ద్రవపదార్థమైన వేడివేడి గంజి(జావ)ను తాగితే మంచిదని భావిస్తారు. ప్రతి ఏటా రంజాన్‌ మాసంలో మసీదుల్లో ఈ పసందైన ఘమఘుమలాడే వంటకాన్ని మధ్యాహ్నాం నుంచి సాయంత్రం వరకు తయారు చేస్తారు.ఉపవాస దీక్షా పరులు ఈ గంజిని సేవిస్తే బడలిక తీరుతుంది.

News April 9, 2024

బోధన్: ‘కుట్రపూరితమైన స్వార్థ రాజకీయాలు చేసేది బీజేపీ’

image

బోధన్ పట్టణంలో కాంగ్రెస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. కుట్రపూరితమైన స్వార్థ రాజకీయాలు చేసే పార్టీ బీజేపీ అని.. కుల మత విభేదాలు లేకుండా నాయకత్వం ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. గెలుపు ఓటమిలు కార్యకర్తల లక్ష్యాన్ని బట్టి ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, నాయకులు ఉన్నారు.

News April 9, 2024

సంగారెడ్డి: గ్రూప్స్ ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

image

షెడ్యూలు కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో గ్రూప్- 1, 2, 3, 4 ఫౌండేషన్ కోర్సుల ఉచిత శిక్షణకు దరఖాస్తులు చేసుకోవాలని ఎస్సీ అభివృద్ధి అధికారి అఖిలేష్ రెడ్డి సోమవారం తెలిపారు. సంగారెడ్డి హాస్టల్ గడ్డలోని సమీకృత వసతి గృహంలో డిగ్రీ పూర్తి చేసిన ఎస్సీ విద్యార్థులు నేరుగా దరఖాస్తుల సమర్పించాలన్నారు.

News April 9, 2024

HYD: యాప్‌లో ఫిర్యాదు చేస్తే పరిష్కారం!

image

TSSPDCL యాప్‌ను పునరుద్ధరించినట్లు HYD సెక్షన్ విద్యుత్ అధికారులు ‘X’ వేదికగా తెలియజేశారు. ప్లే స్టోర్ ద్వారా ఈ యాప్ డౌన్లోడ్‌ చేసుకోవాలన్నారు. ఆయా ప్రాంతంలో ఉన్న కరెంటు సమస్యలపై ఫిర్యాదు చేస్తే పరిష్కరిస్తామని, నూతన ఫీచర్స్ అందుబాటులోకి తెచ్చినట్లుగా తెలిపారు. https://play.google.com/store/apps/details?id=supply.power.tsspdcl లింక్ ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. SHARE IT